తెలంగాణ బీజేపీలోని అసంత్రుప్త వర్గాన్ని శాంతింపజేసేందుకు హైకమాండ్ రంగంలోకి దిగిందా? ఈ నాయకులకు టికెట్లతో పాటు ప్రాధాన్యతనిస్తామని చెప్పి బుజ్జగిస్తోందా? అంటే రాజకీయ వర్గాల నుంచి అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. తెలంగాణ ఎన్నికల కోసం బీజేపీ ప్రకటించబోయే అభ్యర్థుల తొలి జాబితాలో విజయశాంతితో పాటు కొండా విశ్వేశ్వర రెడ్డి పేరు ఉందనే ప్రచారమే అందుకు నిదర్శనమని చెప్పాలి. విజయశాంతికి మెదక్, విశ్వేశ్వర రెడ్డికి తాండూర్ టికెట్ ను బీజేపీ కేటాయించిందని తెలిసింది.
తెలంగాణ ఎన్నికల రేసులో ఇప్పటికే బీజేపీ వెనుకబడింది. సరైన సమయం చూసి వ్యూహాలు అమలు చేయాలని అధిష్ఠానం సూచిస్తోంది. కానీ రాష్ట్రంలో పార్టీ వెనుకబడుతోందని ఇక్కడి నాయకులు గగ్గోలు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికపై తీవ్ర కసరత్తు చేస్తున్న అధిష్ఠానం 65 మందితో తొలి జాబితా విడుదల చేసేందుకు సిద్ధమైందని సమాచారం. ఇటీవల పార్టీపై అసంత్రుప్తి వ్యక్తం చేస్తున్న నాయకుల్లో కొందరికి ఇందులో చోటు కల్పించారని తెలిసింది.
బీజేపీలో తగిన ప్రాధాన్యత దక్కడం లేదని సీనియర్ నాయకురాలైన విజయశాంతి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో కిరణ్ కుమార్ రెడ్డి ఉండటంతో విజయశాంతి వెళ్లిపోయారు. ఆ తర్వాత కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేలా, కాంగ్రెస్ ను పొగిడేలా ఆమె ట్వీట్లు చేశారు. మరోవైపు విజయశాంతి, విశ్వేశ్వర రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల రెడ్డి, వివేక్ తదితరులు రహస్య సమావేశం పెట్టడం కూడా చర్చనీయాంశంగా మారింది. మోదీ సభల్లోనూ వీళ్లు కనిపించలేదు. దీంతో పార్టీ మారతారేమోననే ప్రచారం సాగింది. కానీ ఇప్పుడు తొలి జాబితాలోనే విజయశాంతి, విశ్వేశ్వర రెడ్డితో పాటు రాజగోపాల్ రెడ్డి (మునుగోడు)కి టికెట్ ఇవ్వనున్నట్లు తెలిసింది. మరి టికెట్ దక్కిన తర్వాత విజయం కోసం వీళ్లు కష్టపడతారా? లేదా పార్టీకే దెబ్బ కొడతారా? అన్నది చూడాలి.
This post was last modified on October 20, 2023 3:43 pm
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ కు ఇటీవల ఎక్కడ లేని ప్రాచుర్యం లభించింది. నీట్ పేపర్ లీకేజి కి…
గతంలో బ్రహ్మానందం, బాబు మోహన్ లాంటి కమెడియన్స్ ఉన్నప్పుడు వాళ్ళ కోసమే విడిగా కామెడీ ఎపిసోడ్స్ రాసేవాళ్ళు. మెయిన్ రైటర్స్…
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుల జాబితా తీస్తే.. అందులో పైవరుసలో ఉండే ఆర్టిస్టుల్లో మోహన్ బాబు ఒకరు.…
ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కొత్త ప్రస్థానం మొదలైపోయింది. నిన్నటిదాకా రాజకీయ వ్యూహకర్తగా, ఓ రాజకీయ పార్టీకి అధినేతగా…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ కీలక కేసు విషయంలో సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. వ్యక్తి చనిపోయిన తర్వాత.. కేసును…
టాలీవుడ్ విచిత్రాలు కొన్ని భలే అనిపిస్తాయి. కాకతాళీయమే అయినా అదేదో రాసిపెట్టి జరగడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇటీవలే విడుదలైన శ్రీనివాస…