తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఈ క్రమంలో విజయభేరి బస్సు యాత్ర, బైకు యాత్రలు చేపట్టింది. తాజాగా భూపాలపల్లిలో చేపట్టిన బైక్ ర్యాలీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా పాల్గొన్నారు. అయితే.. ఈ బైక్ ర్యాలీలో పాల్గొన్న మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు కొండ సురేఖ తృటి భారీ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.
ఆమె నడుపుతున్న బైక్ను సురేఖ బ్యాలెన్స్ చేయలేకపోయారు. దీంతో నాలుగు అడుగుల దూరం వెళ్లిన తర్వాత.. బండి అదుపు తప్పింది. అయితే.. ఇంతలోనే బైక్ వేగాన్ని సురేఖ ఖంగారులో పెంచేశారు. దీంతో ఆ బైకు దూసుకుపోయింది. ఈ పరిణామంతో కొండా సురేఖ రోడ్డుపై పడిపోయి.. కొంత దూరం వరకు బైకుతో పాటే దూసుకుపోయారు. ఈ ప్రమాదంలో సురేఖ ముఖానికి, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి.
అయితే, వెంటనే స్పందించిన కార్యకర్తలు.. బైకును అదుపులోకి తెచ్చారు. సురేఖను వెంటనే సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనను ప్రత్యక్షంగా పరిశీలించిన పలువురు.. కొండా సురేఖ పెద్ద ప్రమాదం నుంచే బయట పడ్డారని వ్యాఖ్యానించారు. కాగా, ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని.. ముఖాయిన గాయాలకు కట్టు కట్టామని.. వైద్య సిబ్బంది తెలిపినట్టు ఆమె అనుచరులు చెప్పారు. ఇదిలావుంటే.. బైక్ యాత్ర మాత్రం యథావిధిగా ముందుకు సాగిపోయింది.
This post was last modified on October 19, 2023 7:44 pm
ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్రం చేసిన ప్రతిపాదన తీవ్ర సంకట స్థితిలోకి నెట్టేసింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటూ.. కేంద్ర…
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…