తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఈ క్రమంలో విజయభేరి బస్సు యాత్ర, బైకు యాత్రలు చేపట్టింది. తాజాగా భూపాలపల్లిలో చేపట్టిన బైక్ ర్యాలీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా పాల్గొన్నారు. అయితే.. ఈ బైక్ ర్యాలీలో పాల్గొన్న మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు కొండ సురేఖ తృటి భారీ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.
ఆమె నడుపుతున్న బైక్ను సురేఖ బ్యాలెన్స్ చేయలేకపోయారు. దీంతో నాలుగు అడుగుల దూరం వెళ్లిన తర్వాత.. బండి అదుపు తప్పింది. అయితే.. ఇంతలోనే బైక్ వేగాన్ని సురేఖ ఖంగారులో పెంచేశారు. దీంతో ఆ బైకు దూసుకుపోయింది. ఈ పరిణామంతో కొండా సురేఖ రోడ్డుపై పడిపోయి.. కొంత దూరం వరకు బైకుతో పాటే దూసుకుపోయారు. ఈ ప్రమాదంలో సురేఖ ముఖానికి, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి.
అయితే, వెంటనే స్పందించిన కార్యకర్తలు.. బైకును అదుపులోకి తెచ్చారు. సురేఖను వెంటనే సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనను ప్రత్యక్షంగా పరిశీలించిన పలువురు.. కొండా సురేఖ పెద్ద ప్రమాదం నుంచే బయట పడ్డారని వ్యాఖ్యానించారు. కాగా, ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని.. ముఖాయిన గాయాలకు కట్టు కట్టామని.. వైద్య సిబ్బంది తెలిపినట్టు ఆమె అనుచరులు చెప్పారు. ఇదిలావుంటే.. బైక్ యాత్ర మాత్రం యథావిధిగా ముందుకు సాగిపోయింది.
This post was last modified on October 19, 2023 7:44 pm
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…
ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికాల యుద్ధం మన దేశంపై కూడా ప్రభావం చూపుతోంది. పెట్రోల్, డీజిల్ తో పోలిస్తే ఎల్పీజీ…
లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సాగుతోంది. ఇలా లోక్సభ స్పీకర్పై తమకు విశ్వాసం…