తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఈ క్రమంలో విజయభేరి బస్సు యాత్ర, బైకు యాత్రలు చేపట్టింది. తాజాగా భూపాలపల్లిలో చేపట్టిన బైక్ ర్యాలీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా పాల్గొన్నారు. అయితే.. ఈ బైక్ ర్యాలీలో పాల్గొన్న మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు కొండ సురేఖ తృటి భారీ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.
ఆమె నడుపుతున్న బైక్ను సురేఖ బ్యాలెన్స్ చేయలేకపోయారు. దీంతో నాలుగు అడుగుల దూరం వెళ్లిన తర్వాత.. బండి అదుపు తప్పింది. అయితే.. ఇంతలోనే బైక్ వేగాన్ని సురేఖ ఖంగారులో పెంచేశారు. దీంతో ఆ బైకు దూసుకుపోయింది. ఈ పరిణామంతో కొండా సురేఖ రోడ్డుపై పడిపోయి.. కొంత దూరం వరకు బైకుతో పాటే దూసుకుపోయారు. ఈ ప్రమాదంలో సురేఖ ముఖానికి, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి.
అయితే, వెంటనే స్పందించిన కార్యకర్తలు.. బైకును అదుపులోకి తెచ్చారు. సురేఖను వెంటనే సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనను ప్రత్యక్షంగా పరిశీలించిన పలువురు.. కొండా సురేఖ పెద్ద ప్రమాదం నుంచే బయట పడ్డారని వ్యాఖ్యానించారు. కాగా, ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని.. ముఖాయిన గాయాలకు కట్టు కట్టామని.. వైద్య సిబ్బంది తెలిపినట్టు ఆమె అనుచరులు చెప్పారు. ఇదిలావుంటే.. బైక్ యాత్ర మాత్రం యథావిధిగా ముందుకు సాగిపోయింది.
This post was last modified on October 19, 2023 7:44 pm
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…