Political News

నంద‌మూరి సుహాసిని.. ఈ సారి ప‌క్కా.. టీడీపీ స్కెచ్ ఇదే!

నంద‌మూరి కుటుంబానికి చెందిన ఆడ‌ప‌డుచు.. నంద‌మూరి సుహాసిని ఈ సారి తెలంగాణ అసెంబ్లీలో అడుగు పెట్డడం ఖాయ‌మ‌ని అంటున్నారు తెలుగు దేశం పార్టీ నాయ‌కులు. ఎందుకంటే.. ఈ సారి పార్టీ వ్యూహం .. అడుగులు వేరేగా ఉన్నాయ‌ని చెబుతున్నారు. గ‌త 2018 ఎన్నిక‌ల్లో తొలిసారి నంద‌మూరి కుటుంబం నుంచి ఆడ‌ప‌డుచు రాజ‌కీయాల్లోకి వ‌చ్చింది (పురందేశ్వ‌రి లైన్ వేరు). దివంగ‌త హ‌రికృష్ణ గారాల ప‌ట్టి అయిన సుహాసిని గురించి అప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రికీ తెలియ‌దు.

తొలిసారి 2018 ఎన్నిక‌ల్లో కూక‌ట్ ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం నుంచి సుహాసిని బ‌రిలో నిలిచారు. కాంగ్రెస్‌తో అప్ప‌ట్లో టీడీపీ పొత్తు ఉన్న నేప‌థ్యంలో ఈమె ఖ‌చ్చితంగా గెలిచి తీరుతార‌ని అంద‌రూ అనుకున్నారు. పైగా నంద‌మూరి బాల‌కృష్ణ వంటివారు వ‌రుస‌గా ప్ర‌చారం కూడా చేశారు. కానీ, అనూహ్యంగా సుహాసిని ఓట‌మి చ‌విచూశారు. ఇక‌, ఇప్పుడు వ‌చ్చిన అసెంబ్లీ పోరులో ఆమె మ‌రోసారి ఎన్నిక‌ల యుద్ధానికి దిగుతున్నారు.

అయితే.. ఈ సారి మాత్రం సుహాసినిని గెలిపించుకోవ‌డం ల‌క్ష్యంగా టీడీపీ వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తోంది. గ‌త ఎన్నిక‌ల్లో కూక‌ట్ ప‌ల్లి నుంచి పోటీ చేసి ఓడిపోయిన నంద‌మూరి సుహాసినికి ఈ ద‌ఫా రెండుస్థానాలు కేటాయించిన‌ట్టు స‌మాచారం. సెటిల‌ర్లు ఎక్కుగా ఉన్న ఎల్బీన‌గ‌ర్‌తోపాటు కూక‌ట్ ప‌ల్లి సీటును కూడా సుహాసినికి కేటాయించిన‌ట్టు పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఈ ద‌ఫా ఆమెను గెలిపించుకోవాల‌ని పార్టీ భావిస్తున్న‌ట్టు స‌మాచారం.

ఎల్బీ న‌గ‌ర్‌లో గ‌తంలో బీసీ నాయ‌కుడు ఆర్‌.కృష్ణ‌య్య కూడా టీడీపీ టికెట్ పై విజ‌యం సాధించారు. ఒక‌వైపు బీఆర్ ఎస్ ప్ర‌భావం జోరుగా ఉన్న‌ప్ప‌టికీ.. కృష్ణ య్య విజ‌యాన్ని ఎవ‌రూ ఆప‌లేక‌పోయారు. దీంతో ఈ సారి ఎల్‌బీన‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి సుహాసిని టికెట్ కోర‌డంతో ఆమెను అక్క‌డ నుంచి బ‌రిలో దింపుతున్న‌ట్టు టీడీపీ వ‌ర్గాలు చెబుతున్నాయి. మ‌రి ఆమె గెలుస్తారా? అసెంబ్లీలో అడుగు పెడ‌తారా? అనేది చూడాలి.

This post was last modified on October 17, 2023 12:15 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

నాని ఎదుర్కున్న సమస్యే శ్రీవిష్ణుకి వస్తుందా

ఒకే హీరో రెండు సినిమాలు ఒకే టైంలో రిలీజ్ కు రెడీ కావడమంత సంకట పరిస్థితి మరొకటి ఉండదు. గతంలో…

5 hours ago

మూడు రోజులుగా లడ్డూ లడాయి.. వైసీపీ ట్రాప్‌లో చిక్కారా?

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా కూటమి…

6 hours ago

తిరుమ‌ల ల‌డ్డూపై క‌మిష‌న్‌.. సూత్రధారులు దొరుకుతారా?

తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూలో క‌ల్తీ నెయ్యి వినియోగంపై ప్ర‌స్తుతం సీబీఐ విచార‌ణ చేసింది. దీనికి సంబంధించిన చార్జిషీట్‌ను కూడా నెల్లూరు…

7 hours ago

రాజా సాబ్ మళ్ళీ టార్గెట్ అవుతాడా

డిజాస్టర్లు ప్రతి హీరో, దర్శకుడికి ఉంటాయి కానీ రాజా సాబ్ విషయంలో మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఎవరయ్యా అంటే ఠక్కున…

7 hours ago

అర్జున్ ఈ విషయంలో అదృష్టవంతుడే

వచ్చే వారం విడుదల కాబోతున్న సినిమాల్లో సీత పయనం ఉంది. పేరు వింటే పెద్దగా విశేషం అనిపించదు కానీ ఈ…

8 hours ago

ఈ పాయింట్లన్నీ వైసీపీని ఇరుకున పెట్టాయా?

హిందూ ధర్మం, పవిత్ర ఆలయాలపై వైసీపీ వైఖరిని సీఎం చంద్రబాబు కీలక పాయింట్లతో ఎండగట్టారు. ఒకటి కాదు, రెండు కాదు..…

9 hours ago