Political News

బీఆర్ఎస్ కు రాజీనామా.. సొంతంగా పోటీ!

హ్యాట్రిక్ విజయంపై కన్నేసి.. తెలంగాణ ఎన్నికల యుద్ధానికి సిద్ధమవుతున్న బీఆర్ఎస్ కు షాక్ లు తప్పడం లేదు. ఎప్పుడో టికెట్లు ప్రకటించినప్పటికీ.. ఇంకా అసంత్రుప్తి సెగ కొనసాగుతూనే ఉంది. టికెట్లు రాలేవనే నిరాశతో కీలక నాయకులు ఆ పార్టీని వీడుతూనే ఉన్నారు. కేటీఆర్ బుజ్జగించినా.. హరీష్ రావు నచ్చజెప్పినా వెళ్లేవాళ్లు వెళ్తూనే ఉన్నారు. తాజాగా బీఆర్ఎస్ కీలక నేత, ముదిరాజ్ సంఘం రాష్ట్ర నాయకుడు కొత్తపల్లి నీలం మధు ఆ పార్టీకి రాజీనామా చేశారు. పటాన్ చెరులో బీఆర్ఎస్ బలోపేతం కోసం పదేళ్లుగా పని చేశానని, అయినా ప్రాధాన్యత దక్కడం లేదని నీలం మధు ఆవేదన వ్యక్తం చేశారు.

చివరి క్షణం వరకూ పటాన్ చెరు టికెట్ కోసం నీలం మధు తీవ్రంగా ప్రయత్నించారు. టికెట్ వస్తుందనే ఆశతో ఉన్నారు. తనకు టికెట్ ప్రకటించే విషయంలో బీఆర్ఎస్ పార్టీకి అక్టోబర్ 16 వరకు డెడ్ లైన్ విధించారు. పార్టీ అధినాయకత్వం స్పందించకపోతే రాజీనామా చేస్తానని కూడా ప్రకటించారు. అన్నట్లుగానే ఇప్పుడు పార్టీని వీడారు. ఇక్కడి బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి బీఫామ్ దక్కడంతో మధు బీఆర్ఎస్ ను వీడారు. రాజీనామ లేఖను కేసీఆర్ కు పంపించారు.

స్వగ్రామం సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం కొత్తపల్లిలో మధు రాజీనామా ప్రకటన చేశారు. అంతే కాకుండా ఈ సారి ఎన్నికల బరిలో దిగుతానని కూడా ఆయన స్పష్టం చేశారు. కొత్తపల్లి గ్రామం నుంచి పాదయాత్ర చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. 2001లో బీఆర్ఎస్లో చేరిన మధు.. 2014లో జడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2019లో చిట్కూరు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా సర్పంచ్గా ఎన్నికయ్యారు. ఎమ్మెల్యే టికెట్ కోసం ఆశించి భంగపడ్డారు. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఎన్నో విధాలుగా ఇబ్బంది పెడుతున్నారని, బీఆర్ఎస్ కు రాజీనామా చేసి ప్రజల దగ్గరకు వెళ్తున్నానని మధు పేర్కొన్నారు. ఎలాగైనా వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని మధు ప్రకటించారు. దీంతో సొంతంగా ఆయన పోటీ చేస్తారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. లేదా కాంగ్రెస్ లో చేరతారా? అనే సందేహాలు వినిపిస్తున్నాయి.

This post was last modified on October 16, 2023 5:38 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

నాని ఎదుర్కున్న సమస్యే శ్రీవిష్ణుకి వస్తుందా

ఒకే హీరో రెండు సినిమాలు ఒకే టైంలో రిలీజ్ కు రెడీ కావడమంత సంకట పరిస్థితి మరొకటి ఉండదు. గతంలో…

5 hours ago

మూడు రోజులుగా లడ్డూ లడాయి.. వైసీపీ ట్రాప్‌లో చిక్కారా?

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా కూటమి…

5 hours ago

తిరుమ‌ల ల‌డ్డూపై క‌మిష‌న్‌.. సూత్రధారులు దొరుకుతారా?

తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూలో క‌ల్తీ నెయ్యి వినియోగంపై ప్ర‌స్తుతం సీబీఐ విచార‌ణ చేసింది. దీనికి సంబంధించిన చార్జిషీట్‌ను కూడా నెల్లూరు…

7 hours ago

రాజా సాబ్ మళ్ళీ టార్గెట్ అవుతాడా

డిజాస్టర్లు ప్రతి హీరో, దర్శకుడికి ఉంటాయి కానీ రాజా సాబ్ విషయంలో మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఎవరయ్యా అంటే ఠక్కున…

7 hours ago

అర్జున్ ఈ విషయంలో అదృష్టవంతుడే

వచ్చే వారం విడుదల కాబోతున్న సినిమాల్లో సీత పయనం ఉంది. పేరు వింటే పెద్దగా విశేషం అనిపించదు కానీ ఈ…

8 hours ago

ఈ పాయింట్లన్నీ వైసీపీని ఇరుకున పెట్టాయా?

హిందూ ధర్మం, పవిత్ర ఆలయాలపై వైసీపీ వైఖరిని సీఎం చంద్రబాబు కీలక పాయింట్లతో ఎండగట్టారు. ఒకటి కాదు, రెండు కాదు..…

8 hours ago