Political News

కొత్తవాళ్లకు పండగ.. హామీ మేరకు కాంగ్రెస్ టికెట్లు

తెలంగాణ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలనే పట్టుదలతో కాంగ్రెస్ ఉంది. అందుకు అవసరమైన కసరత్తుల్లో పార్టీ ముగినిపోయింది. ఈ నేపథ్యంలోనే ఆదివారం 55 మంది అభ్యర్థులతో తొలి జాబితా ప్రకటించింది.  ఇందులో చాలా వరకు కొత్తవాళ్ల పేర్లు ఉండటం విశేషం. ఈ సారి బీఆర్ఎస్ ను గద్దె దించడమే లక్ష్యంగా చేరికలను ప్రోత్సహిస్తున్న కాంగ్రెస్.. బీఆర్ఎస్, బీజేపీ నుంచి నాయకులను పార్టీలో చేర్చుకుంటున్న సంగతి తెలిసిందే. కీలక నాయకులకు, ఎన్నికల్లో ప్రభావం చూపగలరనుకునే నేతలకు టికెట్ల హామీనిచ్చి కాంగ్రెస్ లో చేర్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తొలి జాబితా చూస్తే ఇచ్చిన హామీల మేరకు 12 నుంచి 13 మంది అభ్యర్థులకు తొలిసారి కాంగ్రెస్ టికెట్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

మల్కాజిగిరి నుంచి మైనంపల్లి హన్మంత రావు, మెదక్ నుంచి ఆయన తనయుడు రోహిత్ కాంగ్రెస్ జెండా మీద పోటీ చేయబోతున్నారు. అలాగే ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి (ఆర్మూర్), కూచుకుళ్ల రాజేష్ రెడ్డి (నాగర్ కర్నూల్), కసిరెడ్డి నారాయణ రెడ్డి (కల్వకుర్తి), జూపల్లి క్రిష్ణారావు (కొల్లపూర్), వేముల వీరేశం (నకిరేకల్), జయవీర్ రెడ్డి (నాగార్జున సాగర్) కూడా కాంగ్రెస్ తరపున పోటీకి సై అంటున్నారు. ఈ సారి ఎన్నికలకు సీనియర్ నాయకుడు జానారెడ్డి దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో నాగార్జున సాగర్ టికట్ ఆయన చిన్న కొడుకు జయవీర్ రెడ్డికి దక్కడం గమనించాల్సిన విషయం.

ఇక జి.వినోద్ గత ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీ నుంచి పోటీ చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ నుంచి బరిలో దిగుతున్నారు. అలాగే కొక్కిరాల ప్రేమ్ సాగర్ (మంచిర్యాల), కోట నీలిమ (సనత్ నగర్), సునీల్ కుమార్ (బాల్కొండ), గండ్ర సత్యనారాయణ (భూపాలపల్లి)కు కూడా కాంగ్రెస్ అవకాశమిచ్చింది. అయితే ఆయా నియోజకవర్గాల్లో కొత్తవాళ్లకు టికెట్లు ఇవ్వడంతో పాత కాంగ్రెస్ నాయకులు అసంత్రుప్తి వ్యక్తం చేస్తున్నారు. మైనంపల్లి, ఆయన కొడుకు రాకతో ఇప్పటికే మెదక్, మేడ్చల్ జిల్లాల కాంగ్రెస్ అధ్యక్షులు పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. మరి ఇప్పుడు తొలి జాబితా వెలువడటంతో ఇంకెంత మంది పార్టీని వీడతారో అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 

This post was last modified on October 16, 2023 11:31 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

40 కోట్ల స్కాం… రోజా ‘ఆట’కట్టు?

‘‘ఆడుదాం ఆంధ్రా’’ అంటూ వైసీపీ హయాంలో ఓ కార్యక్రమం నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే, ఆటల పేరుతో మాజీ మంత్రి…

1 hour ago

రాధాకృష్ణను స్టేషన్ల చుట్టూ తిప్పుతా: జగన్

వైసీపీ నేతలు, వారి కుటుంబ సభ్యులనుద్దేశించి ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ అనుచిత వ్యాఖ్యలు చేశారని వైసీపీ నేతలు…

2 hours ago

బుచ్చిబాబు వేట ఇంకా పూర్తవ్వలేదా

ఏప్రిల్ 30 నుంచి తప్పుకున్నాక పెద్ది కొంచెం రిలాక్స్ మోడ్ లోకి వచ్చేసింది కానీ దర్శకుడు బుచ్చిబాబుకి మాత్రం ఇటెమ్…

3 hours ago

క్యామియోల కోసం జైలర్ 2 తిప్పలు?

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కు అద్భుతమైన కంబ్యాక్ గా నిలిచిన జైలర్ కొనసాగింపు జైలర్ 2 షూటింగ్ చివరి…

4 hours ago

పాలిటిక్స్ లోకి వచ్చాకే బీపీ షుగర్: రోజా

రాజకీయ నాయకులు సవాలక్ష పనులతో బిజీబిజీగా ఉంటారు. అనేక ఒత్తిళ్లు, తీరిక లేని షెడ్యూళ్లు..వెరసి ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం అనేది…

5 hours ago

ఫ్లాప్ సినిమాలు గుర్తు చేసుకోవడం అవసరమా

ఇవాళ అల్లు అర్జున్ - అట్లీ కాంబో మూవీకి రాకా టైటిల్ అనౌన్స్ చేసి ప్రీ లుక్  పోస్టర్ వదిలిన…

6 hours ago