టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోగ్యం విషయంలో వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి అమానుషంగా ఉందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిప్పులు చెరిగారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై వస్తున్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయని అన్నారు. తాజాగా మంగళగిరి వచ్చిన పవన్.. అమరావతిలో మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై ఆయన మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వ వైఖరిని దుయ్యబట్టారు.
సీనియర్ నాయకుడు, ఈ దేశంలోనే ఎన్నదగిన నేత అయిన చంద్రబాబును ఓ రోడ్ సైడ్ వ్యక్తిగా ట్రీట్ చేస్తుండడం దారుణమని పవన్ వ్యాఖ్యానించారు. ఆరోగ్య పరిస్థితిపై బులెటిన్లు దాచిపెడుతున్నారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయన్నారు. వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి అమానవీయంగా ఉందన్నారు. నాయకులు, పోలీసులు ఒక్కటిగా మారి వ్యాఖ్యలు చేస్తున్నారనే సందేహాలు కూడా సాధారణ ప్రజల్లో కనిపిస్తోందని తెలిపారు.
రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఉన్న చంద్రబాబు ఆరోగ్య స్థితిగతుల విషయంలో నిర్లక్ష్యం తగదని వైసీపీ సర్కారుకు పవన్ సూచించారు. కనీసం చంద్రబాబు వయసునైనా దృష్టిలో పెట్టుకోవాలన్నారు. చంద్రబాబు జైలు గదిలో ఎదుర్కొంటున్న ఆరోగ్యపరమైన సమస్యలపై మానవతా దృక్పథంతో వ్యవహరించాలన్నారు. బాబు ఆరోగ్యం విషయంలో రాజకీయ కక్ష సాధింపు ధోరణి సరికాదని వైసీపీ సర్కారుకు హితవు పలికారు.
బాబు ఆరోగ్యంపై ఆయన కుటుంబ సభ్యుల ఆవేదనను వైసీపీ నాయకులు, పోలీసు ఉన్నతాధికారులు కూడా చులకనగా చూస్తున్నారని, వ్యంగ్యంగా మాట్లాడుతున్నారని, ఇది వైసీపీ వైఖరిని ప్రతిబింబిస్తోందని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. బాబు ఆరోగ్యంపై ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై కోర్టులు జోక్యం చేసుకొని విచారణ చేపట్టాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. చంద్రబాబుకు ఏం జరిగినా అది ప్రభుత్వ బాధ్యతేనని అన్నారు.
This post was last modified on October 15, 2023 2:32 pm
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేళ సీట్ల సర్దుబాటు విషయంలో జనసేన నాయకుల కోరికలకు కూటమి పెద్ద టీడీపీ గ్రీన్సిగ్నల్…
స్టార్ ఫ్యామిలీ నుంచి మరో హీరో వస్తున్నాడు. మాస్ మహారాజ తమ్ముడు కొడుకు మాధవ్ భూపతిరాజుని హీరోగా పరిచయం చేస్తూ…
‘90స్: ఎ మిడిల్ క్లాస్ బయోపిక్’తో ఆదిత్య హాసన్ పేరు తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. చిన్న చిన్న కుటుంబ…
ఇప్పటిదాకా తెలుగు తెరమీద వందలాది నక్సల్స్ సినిమాలు వచ్చాయి కానీ అవన్నీ సీరియస్ బ్యాక్ డ్రాప్ లో సాగేవే. ఎర్ర…
నాని కెరీర్ లోనే అత్యంత భారీ అంచనాలతో రూపొందుతున్న ది ప్యారడైజ్ సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 1 లేదా…
పాపం గీత - పిఠాపురం నియోజకవర్గంలో ఇప్పుడు ఈ మాటే వినిపిస్తోంది. రాజకీయంగా ఆమె ఇక్కడ పుంజుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. గత…