టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోగ్యం విషయంలో వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి అమానుషంగా ఉందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిప్పులు చెరిగారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై వస్తున్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయని అన్నారు. తాజాగా మంగళగిరి వచ్చిన పవన్.. అమరావతిలో మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై ఆయన మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వ వైఖరిని దుయ్యబట్టారు.
సీనియర్ నాయకుడు, ఈ దేశంలోనే ఎన్నదగిన నేత అయిన చంద్రబాబును ఓ రోడ్ సైడ్ వ్యక్తిగా ట్రీట్ చేస్తుండడం దారుణమని పవన్ వ్యాఖ్యానించారు. ఆరోగ్య పరిస్థితిపై బులెటిన్లు దాచిపెడుతున్నారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయన్నారు. వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి అమానవీయంగా ఉందన్నారు. నాయకులు, పోలీసులు ఒక్కటిగా మారి వ్యాఖ్యలు చేస్తున్నారనే సందేహాలు కూడా సాధారణ ప్రజల్లో కనిపిస్తోందని తెలిపారు.
రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఉన్న చంద్రబాబు ఆరోగ్య స్థితిగతుల విషయంలో నిర్లక్ష్యం తగదని వైసీపీ సర్కారుకు పవన్ సూచించారు. కనీసం చంద్రబాబు వయసునైనా దృష్టిలో పెట్టుకోవాలన్నారు. చంద్రబాబు జైలు గదిలో ఎదుర్కొంటున్న ఆరోగ్యపరమైన సమస్యలపై మానవతా దృక్పథంతో వ్యవహరించాలన్నారు. బాబు ఆరోగ్యం విషయంలో రాజకీయ కక్ష సాధింపు ధోరణి సరికాదని వైసీపీ సర్కారుకు హితవు పలికారు.
బాబు ఆరోగ్యంపై ఆయన కుటుంబ సభ్యుల ఆవేదనను వైసీపీ నాయకులు, పోలీసు ఉన్నతాధికారులు కూడా చులకనగా చూస్తున్నారని, వ్యంగ్యంగా మాట్లాడుతున్నారని, ఇది వైసీపీ వైఖరిని ప్రతిబింబిస్తోందని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. బాబు ఆరోగ్యంపై ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై కోర్టులు జోక్యం చేసుకొని విచారణ చేపట్టాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. చంద్రబాబుకు ఏం జరిగినా అది ప్రభుత్వ బాధ్యతేనని అన్నారు.
This post was last modified on October 15, 2023 2:32 pm
ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జరిగిన ఒక పరిణామానికి సంబంధించి ఓ వీడియో సోషల్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…
వైసీపీ అధినేత జగన్పై ఆయన సోదరి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి నిప్పులు చెరిగారు. 'అన్న'…
దేశంలో విమానయాన సంస్థల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఉన్న…
ఏపీలో మరో కీలక పథకం ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. 'దివ్యాంగ శక్తి' పేరుతో కీలక పథకాన్ని సీఎం చంద్రబాబు, ఉప…
మంత్రి నారా లోకేష్.. మంగళవారం ఉమ్మడి కృష్ణాజిల్లాలోని ఓ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ విషయాన్ని అత్యంత గోప్యంగా…