రాజమండ్రి సెంట్రల్ జైల్లో టీడీపీ అధినేత చంద్రబాబు అనారోగ్యానికి గురైన సంగతి తెలిసిందే. డీహైడ్రేషన్ తో పాటు స్కిన్ ఎలర్జీతో చంద్రబాబు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలోనే ఆయనకు ప్రభుత్వ వైద్యులు జైల్లోనే చికిత్స అందిస్తున్నారు. అయితే, చంద్రబాబుకు మరింత మెరుగైన వైద్యం అందించాలని కోరుతూ ఆయన తరఫు లాయర్లు విజయవాడ ఏసీబీ కోర్టులో హౌస్మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలోనే ఆ పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు చంద్రబాబుకు ఊరటనిచ్చింది.
చంద్రబాబు సెల్ లో ఏసీ సౌకర్యం కల్పించాలని ఏసీపీ కోర్టు న్యాయమూర్తి సంచలన ఆదేశాలు జారీ చేశారు. చంద్రబాబు అనారోగ్య రీత్యా ఏసీ ఏర్పాటు చేయాలని జైలు అధికారులను ఆదేశించారు. ఆన్లైన్ ద్వారా ఈ పిటిషన్ విచారణ చేసిన కోర్టు అత్యవసరంగా ఏసీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. చంద్రబాబుకు వైద్యులు ఇచ్చిన నివేదికను న్యాయమూర్తికి చంద్రబాబు తరఫు లాయర్లు వివరించారు. చంద్రబాబుకు చల్లని వాతావరణ పరిస్థితులు కల్పించాలని పిటిషన్ లో పేర్కొన్నారు. అవసరమైతే మెరుగైన వైద్యం కోసం కార్పొరేట్ ఆసుపత్రికి తరలించాలని కోరారు.
అంతకుముందు, చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్ మీడియాతో మాట్లాడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే చంద్రబాబు అనారోగ్యంపై డీఐజీ రవి కిరణ్ ను లోకేష్ ప్రశ్నించారు. చంద్రబాబుకు ఆరోగ్య సమస్యలున్నాయని వైద్యులు చెబుతున్నారని, కానీ, ప్రజలను తప్పుదోవ పట్టించేలా డీఐజీ ప్రకటనలు ఇవ్వడం ఏమిటని లోకేష్ మండిపడ్డారు. వైద్యులు చెప్పిన 48 గంటల తర్వాత కూడా వారి సూచనలు ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. ఒక మాజీ ముఖ్యమంత్రి డీ హైడ్రేషన్ బారిన పడ్డారని, చల్లని వాతావరణం కల్పించాలని వైద్యులు సూచించినా ఎందుకు ఇంత నిర్లక్ష్యం అని మండిపడ్డారు. అయితే, తన ప్రశ్నలకు డీఐజీ సమాధానమివ్వకుండా దురుసుగా వ్యవహరించారని లోకేష్ ఆరోపించారు.
This post was last modified on October 14, 2023 11:01 pm
ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్పై.. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు భగ్గుమన్నారు. పవన్ కల్యాణ్ కాదు.. దిష్టి…
ఒకే హీరో రెండు సినిమాలు ఒకే టైంలో రిలీజ్ కు రెడీ కావడమంత సంకట పరిస్థితి మరొకటి ఉండదు. గతంలో…
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా కూటమి…
తిరుమల శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగంపై ప్రస్తుతం సీబీఐ విచారణ చేసింది. దీనికి సంబంధించిన చార్జిషీట్ను కూడా నెల్లూరు…
డిజాస్టర్లు ప్రతి హీరో, దర్శకుడికి ఉంటాయి కానీ రాజా సాబ్ విషయంలో మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఎవరయ్యా అంటే ఠక్కున…
వచ్చే వారం విడుదల కాబోతున్న సినిమాల్లో సీత పయనం ఉంది. పేరు వింటే పెద్దగా విశేషం అనిపించదు కానీ ఈ…