Political News

చంద్రబాబు సెల్ లో ఏసీ పెట్టాలని కోర్టు ఆదేశం

రాజమండ్రి సెంట్రల్ జైల్లో టీడీపీ అధినేత చంద్రబాబు అనారోగ్యానికి గురైన సంగతి తెలిసిందే. డీహైడ్రేషన్ తో పాటు స్కిన్ ఎలర్జీతో చంద్రబాబు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలోనే ఆయనకు ప్రభుత్వ వైద్యులు జైల్లోనే చికిత్స అందిస్తున్నారు. అయితే, చంద్రబాబుకు మరింత మెరుగైన వైద్యం అందించాలని కోరుతూ ఆయన తరఫు లాయర్లు విజయవాడ ఏసీబీ కోర్టులో హౌస్‌మోషన్ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ క్రమంలోనే ఆ పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు చంద్రబాబుకు ఊరటనిచ్చింది.

చంద్రబాబు సెల్ లో ఏసీ సౌకర్యం కల్పించాలని ఏసీపీ కోర్టు న్యాయమూర్తి సంచలన ఆదేశాలు జారీ చేశారు. చంద్రబాబు అనారోగ్య రీత్యా ఏసీ ఏర్పాటు చేయాలని జైలు అధికారులను ఆదేశించారు. ఆన్‌లైన్ ద్వారా ఈ పిటిషన్ విచారణ చేసిన కోర్టు అత్యవసరంగా ఏసీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. చంద్రబాబుకు వైద్యులు ఇచ్చిన నివేదికను న్యాయమూర్తికి చంద్రబాబు తరఫు లాయర్లు వివరించారు. చంద్రబాబుకు చల్లని వాతావరణ పరిస్థితులు కల్పించాలని పిటిషన్ లో పేర్కొన్నారు. అవసరమైతే మెరుగైన వైద్యం కోసం కార్పొరేట్ ఆసుపత్రికి తరలించాలని కోరారు.

అంతకుముందు, చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్‌ మీడియాతో మాట్లాడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే చంద్రబాబు అనారోగ్యంపై డీఐజీ రవి కిరణ్‌ ను లోకేష్ ప్రశ్నించారు. చంద్రబాబుకు ఆరోగ్య సమస్యలున్నాయని వైద్యులు చెబుతున్నారని, కానీ, ప్రజలను తప్పుదోవ పట్టించేలా డీఐజీ ప్రకటనలు ఇవ్వడం ఏమిటని లోకేష్ మండిపడ్డారు. వైద్యులు చెప్పిన 48 గంటల తర్వాత కూడా వారి సూచనలు ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. ఒక మాజీ ముఖ్యమంత్రి డీ హైడ్రేషన్ బారిన పడ్డారని, చల్లని వాతావరణం కల్పించాలని వైద్యులు సూచించినా ఎందుకు ఇంత నిర్లక్ష్యం అని మండిపడ్డారు. అయితే, తన ప్రశ్నలకు డీఐజీ సమాధానమివ్వకుండా దురుసుగా వ్యవహరించారని లోకేష్ ఆరోపించారు.

This post was last modified on October 14, 2023 11:01 pm

Share

Recent Posts

త్రివిక్రమ్ మేజిక్ పని చేసినట్టేనా

ఆదర్శ కుటుంబం టీజర్ వచ్చాక అందులో కంటెంట్ ఎలా ఉంటుందో ప్రేక్షకులకు ఐడియా వచ్చేసింది. అభిమానులు హ్యాపీగానే ఉన్నారు. వెంకీ…

25 minutes ago

సీఎం అయినా స్నేహం త‌ర్వాతే..

ఫిలిం ఇండ‌స్ట్రీలో చాలా ఏళ్ల పాటు నంబ‌ర్ స్థానానికి పోటీ ప‌డ్డ ఇద్ద‌రు టాప్ హీరోల మ‌ధ్య మంచి స్నేహం…

2 hours ago

ఒత్తిడి బండి మీద ‘రణబాలి’ ప్రయాణం

ఏంటో టాలీవుడ్ లో ఏదీ మాట మీద అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుందన్న గ్యారెంటీ లేకుండా పోతోంది. వాయిదాల పర్వంలో నలిగిపోతున్న…

2 hours ago

ఇప్ప‌టి వ‌ర‌కు లేనిది.. ఇప్పుడు మ‌ళ్లీ.. బాబు ఆగ్ర‌హానికి రీజ‌నేంటి?

ఏపీ సీఎం చంద్ర‌బాబు గ‌తానికి భిన్నంగా ఏపీలో పాల‌న సాగిస్తున్నారు. గ‌తంలో ఆయ‌న మూడు సార్లు ముఖ్య‌మంత్రిగా ప‌నిచేసిన స‌మ‌యంలో…

3 hours ago

మళ్ళీ పోలీస్ కథ… మళ్ళీ ఇంకో హిట్టు

అదేంటో పోలీస్, క్రైమ్ మీద మలయాళంలో ఎన్ని సినిమాలు వచ్చినా వాటికి కేరళ ప్రేక్షకులు ఆదరణ అందిస్తూనే ఉంటారు. తాజాగా…

6 hours ago

‘ఆదర్శ కుటుంబం’లో తుపాకుల కలకలం

టాలీవుడ్ మూవీ లవర్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కాంబినేషన్ హీరో వెంకటేష్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ జంటది. రచయితగా…

7 hours ago