తెలంగాణలో గ్రూప్-2 అభ్యర్థి ప్రవళిక ఆత్మహత్య వ్యవహారం రాజకీయ దుమారం రేపుతోన్న సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసిందని, గ్రూప్-2 నోటిఫికేషన్ వాయిదా పడడంతోనే ప్రవళిక ఆత్మహత్య చేసుకుందని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇది ఆత్మహత్య కాదని, ప్రభుత్వం చేసిన హత్య అని ప్రభుత్వంపై విపక్ష నేతలు దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రవళిక ఆత్మహత్య గురించి పోలీసులు సంచలన ప్రకటన చేశారు. ప్రవళిక ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు మీడియాకు వెల్లడించారు.
ఆ యువతి సూసైడ్ చేసుకోవడానికి ప్రవళిక ప్రేమ వ్యవహారమే కారణమని ప్రాథమిక దర్యాఫ్తులో తేలినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రవళిక చనిపోయిన సమాచారం శుక్రవారం సాయంత్రం అందిందని, ఆమె గదిలో సూసైడ్ నోట్ దొరికిందని చెప్పారు. ఇప్పటిదాకా ప్రవళిక ఏ పోటీ పరీక్షలకు హాజరు కాలేదని, ఆత్మహత్యలపై రకరకాల ఊహాగానాలు వస్తున్నాయని అన్నారు. శివరామ్ రాథోడ్ అనే యువకుడితో ఆమె చాటింగ్ను గుర్తించామని, శివరామ్ మరో యువతిని పెళ్లి చేసుకోవడంతో తాను మోసపోయానని ప్రవళిక ఆవేదన చెందిందని ఆ చాటింగ్ ద్వారా గుర్తించామన్నారు. ప్రవళిక, శివరామ్ కలిసి ఓ హోటల్కు వెళ్లినట్లు సీసీటీవీ ఫుటేజీ దొరికిందని చెప్పారు.
శివరామ్పై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని, ప్రవళిక సెల్ ఫోన్, సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకొని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించామని వెల్లడించారు. వ్యక్తిగత కారణాలతో ప్రవళిక ఆత్మహత్య చేసుకుందని తోటి విద్యార్థులు చెప్పినా పట్టించుకోకుండా విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీలు నిరసన వ్యక్తం చేస్తున్నాయని పోలీసులు అన్నారు. తాజాగా పోలీసుల ప్రకటనతో ప్రవళిక సూసైడ్ వ్యవహారం కొత్త మలుపు తిరిగింది.
This post was last modified on October 14, 2023 8:50 pm
ఇవాళ విడుదలైన ఇరుముడికి సర్వత్రా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. అన్ని సెంటర్ల…
దక్షిణాది లెజండరీ నటీనటులు ఇటీవలి కాలంలో కన్ను మూయడం సినీ ప్రియులను బాధిస్తోంది. భాగ్యరాజ్ గారి హఠాన్మరణం ఇంకా మర్చిపోక…
ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…
వివేకా హత్య కేసు విచారణ ఏళ్ల తరబడి కొనసాగుతున్న వైనంపై వివేకా తనయురాలు సునీత అసహనం వ్యక్తం చేస్తున్న సంగతి…
విదేశాంగ శాఖ అనుమతి నిరాకరించడంతో తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దయ్యింది. ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం…
సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజేశాయి.…