తెలంగాణలో గ్రూప్-2 అభ్యర్థి ప్రవళిక ఆత్మహత్య వ్యవహారం రాజకీయ దుమారం రేపుతోన్న సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసిందని, గ్రూప్-2 నోటిఫికేషన్ వాయిదా పడడంతోనే ప్రవళిక ఆత్మహత్య చేసుకుందని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇది ఆత్మహత్య కాదని, ప్రభుత్వం చేసిన హత్య అని ప్రభుత్వంపై విపక్ష నేతలు దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రవళిక ఆత్మహత్య గురించి పోలీసులు సంచలన ప్రకటన చేశారు. ప్రవళిక ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు మీడియాకు వెల్లడించారు.
ఆ యువతి సూసైడ్ చేసుకోవడానికి ప్రవళిక ప్రేమ వ్యవహారమే కారణమని ప్రాథమిక దర్యాఫ్తులో తేలినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రవళిక చనిపోయిన సమాచారం శుక్రవారం సాయంత్రం అందిందని, ఆమె గదిలో సూసైడ్ నోట్ దొరికిందని చెప్పారు. ఇప్పటిదాకా ప్రవళిక ఏ పోటీ పరీక్షలకు హాజరు కాలేదని, ఆత్మహత్యలపై రకరకాల ఊహాగానాలు వస్తున్నాయని అన్నారు. శివరామ్ రాథోడ్ అనే యువకుడితో ఆమె చాటింగ్ను గుర్తించామని, శివరామ్ మరో యువతిని పెళ్లి చేసుకోవడంతో తాను మోసపోయానని ప్రవళిక ఆవేదన చెందిందని ఆ చాటింగ్ ద్వారా గుర్తించామన్నారు. ప్రవళిక, శివరామ్ కలిసి ఓ హోటల్కు వెళ్లినట్లు సీసీటీవీ ఫుటేజీ దొరికిందని చెప్పారు.
శివరామ్పై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని, ప్రవళిక సెల్ ఫోన్, సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకొని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించామని వెల్లడించారు. వ్యక్తిగత కారణాలతో ప్రవళిక ఆత్మహత్య చేసుకుందని తోటి విద్యార్థులు చెప్పినా పట్టించుకోకుండా విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీలు నిరసన వ్యక్తం చేస్తున్నాయని పోలీసులు అన్నారు. తాజాగా పోలీసుల ప్రకటనతో ప్రవళిక సూసైడ్ వ్యవహారం కొత్త మలుపు తిరిగింది.
This post was last modified on October 14, 2023 8:50 pm
క్యారెక్టర్ ఆర్టిస్టుగా పేరొందిన పావలా శ్యామల కన్ను మూశారు. గత కొన్నేళ్లుగా తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్న శ్యామల గారికి…
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య ఎంత స్నేహం ఉందో తెలిసిందే. ఆర్ఆర్ఆర్ షూటింగ్, ప్రమోషన్స్ టైంలో కనిపించినంతగా ఇప్పుడు…
తను స్వతహాగా రష్యన్ అయినా.. పుట్టి పెరిగింది రష్యాలోనే అయినా.. పవన్ కళ్యాణ్ను పెళ్లి చేసుకున్నాక పూర్తిగా ఒక తెలుగింటి…
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో చాలామంది హాలీవుడ్ సినిమాల నుంచి స్ఫూర్తి పొంది కథలు, సన్నివేశాలు తీర్చిదిద్దుకున్న వాళ్లే. ఇప్పుడు ఇండియా…
అక్కినేని నాగేశ్వరరావు మనవడు సుమంత్ను చూస్తే పెద్ద స్టార్ కావడానికి అవసరమైన అన్ని లక్షణాలు ఉన్నట్లే కనిపిస్తాడు. ఆరడుగుల ఆజానుబాహుడు,…
పోలవరం జిల్లా ఈర్లపల్లి గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్ధిని ముర్రం శివాని ఆత్మహత్య చేసుకుంది. దీనికి సంబంధించిన కారణాలు…