Political News

‘ఆ పార్టీల‌కు ఓటేస్తే.. తెలంగాణను ఏపీలో క‌లిపేస్తారు’

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల సంరంభం ప్రారంభ‌మైంది. కేంద్ర ఎన్నిక‌ల సంఘం నోటిఫికేష‌న్ ఇచ్చి వారం రోజులు కూడా కాలేదు. ఇంత‌లోనే సెంటిమెంటు రాజ‌కీయాలు ప్రారంభ‌మైపోయాయి. తాజాగా బీఆర్ ఎస్ నాయ‌కుడు, మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణ రాష్ట్రాన్నిఏపీలో క‌లిపేసేందుకు కుట్ర‌లు జ‌రుగుతున్నాయ‌ని ఆయ‌న అన్నారు.

బీజేపీ, కాంగ్రెస్‌లు ఒక్క‌టేన‌ని, ఈ రెండు పార్టీలకు ఓటేస్తే.. తెలంగాణ‌ను ఏపీలో క‌లిపేయ‌డం ఖాయ‌మ‌ని మంత్రి గంగుల వ్యాఖ్యానించారు. “ఆంధ్రోళ్లు.. కాంగ్రెస్‌, బీజేపీ ముసుగులో వ‌స్తున్నారు. ఎన్నిక‌ల్లో వారిని ఆద‌రిస్తే.. ఓటేస్తే.. మ‌న ప‌ని ఖ‌తం. ఎన్నిక‌ల్లో కేసీఆర్ ఓడిపోతే ఢిల్లీ పెద్ద‌ల‌తో ఆ పార్టీ నేత‌లు మాట్లాడి తెలంగాణ‌ను ఏపీలో క‌లిపేసే కుట్ర చేస్తున్నారు. ఇది మ‌న భ‌విష్య‌త్ త‌రానికి ఇబ్బందిక‌రం” అని మంత్రి అన్నారు.

వాస్త‌వానికి తెలంగాణలో జ‌రిగిన 2018 ఎన్నిక‌ల్లోనూ తెలంగాణ సెంటిమెంటును బీఆర్ ఎస్ నాయ‌కులు ప్లే చేశారు. అప్ప‌ట్లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్న టీడీపీని, ఆ పార్టీ అధినేత చంద్ర‌బాబును బూచిగా చూపించారు. “మ‌న‌మీద మ‌ళ్లీ ఆంధ్రోళ్లు పెత్త‌నం చేసేందుకు వ‌స్తున్న‌రు. ఆంధ్రోళ్ల పెత్త‌నం మ‌న‌కు అవ‌స‌ర‌మా?” అంటూ స్వ‌యం సీఎం కేసీఆర్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో వ్యాఖ్యానించి సెంటిమెంటును రాజేశారు. ఇక‌, ఇప్పుడు మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్ రూపంలో సెంటిమెంటు రాజ‌కీయాల‌కు శ్రీకారం చుట్టిన‌ట్ట‌యింది. రానున్న రోజుల్లో ఈ రాజ‌కీయం ఎలాంటి మ‌లుపు తిరుగుతుందో చూడాలి.

This post was last modified on October 13, 2023 2:09 pm

Share

Recent Posts

జంతర్ మంతర్ కు చెక్ ?

దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ కు ఇటీవల ఎక్కడ లేని ప్రాచుర్యం లభించింది. నీట్ పేపర్ లీకేజి కి…

1 hour ago

సత్య హాస్యం చాలా ప్లస్ అవుతోంది

గతంలో బ్రహ్మానందం, బాబు మోహన్ లాంటి కమెడియన్స్ ఉన్నప్పుడు వాళ్ళ కోసమే విడిగా కామెడీ ఎపిసోడ్స్ రాసేవాళ్ళు. మెయిన్ రైటర్స్…

2 hours ago

వెంక‌ట‌ప్ప ఫెయిల్… ఇక మాలిక్ ఏం చేస్తాడో?

తెలుగు సినిమా చ‌రిత్ర‌లోనే అత్యంత గొప్ప న‌టుల జాబితా తీస్తే.. అందులో పైవ‌రుస‌లో ఉండే ఆర్టిస్టుల్లో మోహన్ బాబు ఒక‌రు.…

2 hours ago

పీకే ఇక ఎమ్మెల్యే సాబ్!

ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కొత్త ప్రస్థానం మొదలైపోయింది. నిన్నటిదాకా రాజకీయ వ్యూహకర్తగా, ఓ రాజకీయ పార్టీకి అధినేతగా…

3 hours ago

వ్య‌క్తి చ‌నిపోతే… కేసు మూసేయొచ్చు: ఉండ‌వ‌ల్లి కేసుపై సుప్రీంకోర్టు

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు చెందిన ఓ కీల‌క కేసు విష‌యంలో సుప్రీంకోర్టు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. వ్య‌క్తి చ‌నిపోయిన త‌ర్వాత‌.. కేసును…

3 hours ago

డాటరాఫ్ రవీనా… ఫలితం కూడా అదేనా

టాలీవుడ్ విచిత్రాలు కొన్ని భలే అనిపిస్తాయి. కాకతాళీయమే అయినా అదేదో రాసిపెట్టి జరగడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇటీవలే విడుదలైన శ్రీనివాస…

3 hours ago