Political News

‘ఆ పార్టీల‌కు ఓటేస్తే.. తెలంగాణను ఏపీలో క‌లిపేస్తారు’

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల సంరంభం ప్రారంభ‌మైంది. కేంద్ర ఎన్నిక‌ల సంఘం నోటిఫికేష‌న్ ఇచ్చి వారం రోజులు కూడా కాలేదు. ఇంత‌లోనే సెంటిమెంటు రాజ‌కీయాలు ప్రారంభ‌మైపోయాయి. తాజాగా బీఆర్ ఎస్ నాయ‌కుడు, మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణ రాష్ట్రాన్నిఏపీలో క‌లిపేసేందుకు కుట్ర‌లు జ‌రుగుతున్నాయ‌ని ఆయ‌న అన్నారు.

బీజేపీ, కాంగ్రెస్‌లు ఒక్క‌టేన‌ని, ఈ రెండు పార్టీలకు ఓటేస్తే.. తెలంగాణ‌ను ఏపీలో క‌లిపేయ‌డం ఖాయ‌మ‌ని మంత్రి గంగుల వ్యాఖ్యానించారు. “ఆంధ్రోళ్లు.. కాంగ్రెస్‌, బీజేపీ ముసుగులో వ‌స్తున్నారు. ఎన్నిక‌ల్లో వారిని ఆద‌రిస్తే.. ఓటేస్తే.. మ‌న ప‌ని ఖ‌తం. ఎన్నిక‌ల్లో కేసీఆర్ ఓడిపోతే ఢిల్లీ పెద్ద‌ల‌తో ఆ పార్టీ నేత‌లు మాట్లాడి తెలంగాణ‌ను ఏపీలో క‌లిపేసే కుట్ర చేస్తున్నారు. ఇది మ‌న భ‌విష్య‌త్ త‌రానికి ఇబ్బందిక‌రం” అని మంత్రి అన్నారు.

వాస్త‌వానికి తెలంగాణలో జ‌రిగిన 2018 ఎన్నిక‌ల్లోనూ తెలంగాణ సెంటిమెంటును బీఆర్ ఎస్ నాయ‌కులు ప్లే చేశారు. అప్ప‌ట్లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్న టీడీపీని, ఆ పార్టీ అధినేత చంద్ర‌బాబును బూచిగా చూపించారు. “మ‌న‌మీద మ‌ళ్లీ ఆంధ్రోళ్లు పెత్త‌నం చేసేందుకు వ‌స్తున్న‌రు. ఆంధ్రోళ్ల పెత్త‌నం మ‌న‌కు అవ‌స‌ర‌మా?” అంటూ స్వ‌యం సీఎం కేసీఆర్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో వ్యాఖ్యానించి సెంటిమెంటును రాజేశారు. ఇక‌, ఇప్పుడు మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్ రూపంలో సెంటిమెంటు రాజ‌కీయాల‌కు శ్రీకారం చుట్టిన‌ట్ట‌యింది. రానున్న రోజుల్లో ఈ రాజ‌కీయం ఎలాంటి మ‌లుపు తిరుగుతుందో చూడాలి.

This post was last modified on October 13, 2023 2:09 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘మహేష్’ వివాదంపై స్పందించిన శ్రీలీల

ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జరిగిన ఒక పరిణామానికి సంబంధించి ఓ వీడియో సోషల్…

1 minute ago

పవన్ పారితోషికం లక్షల్లోనే అయినా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్‌గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…

4 hours ago

‘అన్న’ అనే ప‌దానికి జ‌గ‌న్ క‌ళంకం: ష‌ర్మిల‌

వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై ఆయ‌న సోద‌రి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల మ‌రోసారి నిప్పులు చెరిగారు. 'అన్న‌'…

5 hours ago

విమాన సంస్థ‌ల‌పై కొర‌డా.. 60 శాతం సీట్లు ‘ఫ్రీ’

దేశంలో విమానయాన సంస్థ‌ల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న…

6 hours ago

ఏపీలో ‘దివ్యాంగ శక్తి’.. క‌లిసి ప్ర‌యాణించిన బాబు-ప‌వ‌న్‌!

ఏపీలో మ‌రో కీల‌క ప‌థ‌కం ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి వ‌చ్చింది. 'దివ్యాంగ శక్తి' పేరుతో కీలక ప‌థ‌కాన్ని సీఎం చంద్ర‌బాబు, ఉప…

6 hours ago

లోకేష్ ఆక‌స్మిక త‌నిఖీ.. టీడీపీలో క‌ల‌వ‌రం!

మంత్రి నారా లోకేష్‌.. మంగ‌ళ‌వారం ఉమ్మ‌డి కృష్ణాజిల్లాలోని ఓ పాఠ‌శాల‌ను ఆక‌స్మికంగా త‌నిఖీ చేశారు. ఈ విష‌యాన్ని అత్యంత గోప్యంగా…

6 hours ago