Political News

‘ఆ పార్టీల‌కు ఓటేస్తే.. తెలంగాణను ఏపీలో క‌లిపేస్తారు’

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల సంరంభం ప్రారంభ‌మైంది. కేంద్ర ఎన్నిక‌ల సంఘం నోటిఫికేష‌న్ ఇచ్చి వారం రోజులు కూడా కాలేదు. ఇంత‌లోనే సెంటిమెంటు రాజ‌కీయాలు ప్రారంభ‌మైపోయాయి. తాజాగా బీఆర్ ఎస్ నాయ‌కుడు, మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణ రాష్ట్రాన్నిఏపీలో క‌లిపేసేందుకు కుట్ర‌లు జ‌రుగుతున్నాయ‌ని ఆయ‌న అన్నారు.

బీజేపీ, కాంగ్రెస్‌లు ఒక్క‌టేన‌ని, ఈ రెండు పార్టీలకు ఓటేస్తే.. తెలంగాణ‌ను ఏపీలో క‌లిపేయ‌డం ఖాయ‌మ‌ని మంత్రి గంగుల వ్యాఖ్యానించారు. “ఆంధ్రోళ్లు.. కాంగ్రెస్‌, బీజేపీ ముసుగులో వ‌స్తున్నారు. ఎన్నిక‌ల్లో వారిని ఆద‌రిస్తే.. ఓటేస్తే.. మ‌న ప‌ని ఖ‌తం. ఎన్నిక‌ల్లో కేసీఆర్ ఓడిపోతే ఢిల్లీ పెద్ద‌ల‌తో ఆ పార్టీ నేత‌లు మాట్లాడి తెలంగాణ‌ను ఏపీలో క‌లిపేసే కుట్ర చేస్తున్నారు. ఇది మ‌న భ‌విష్య‌త్ త‌రానికి ఇబ్బందిక‌రం” అని మంత్రి అన్నారు.

వాస్త‌వానికి తెలంగాణలో జ‌రిగిన 2018 ఎన్నిక‌ల్లోనూ తెలంగాణ సెంటిమెంటును బీఆర్ ఎస్ నాయ‌కులు ప్లే చేశారు. అప్ప‌ట్లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్న టీడీపీని, ఆ పార్టీ అధినేత చంద్ర‌బాబును బూచిగా చూపించారు. “మ‌న‌మీద మ‌ళ్లీ ఆంధ్రోళ్లు పెత్త‌నం చేసేందుకు వ‌స్తున్న‌రు. ఆంధ్రోళ్ల పెత్త‌నం మ‌న‌కు అవ‌స‌ర‌మా?” అంటూ స్వ‌యం సీఎం కేసీఆర్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో వ్యాఖ్యానించి సెంటిమెంటును రాజేశారు. ఇక‌, ఇప్పుడు మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్ రూపంలో సెంటిమెంటు రాజ‌కీయాల‌కు శ్రీకారం చుట్టిన‌ట్ట‌యింది. రానున్న రోజుల్లో ఈ రాజ‌కీయం ఎలాంటి మ‌లుపు తిరుగుతుందో చూడాలి.

This post was last modified on October 13, 2023 2:09 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఊపిరి పీల్చుకున్న విశ్వంభర

మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ ఇచ్చాక ఆయన ఓకే చేసిన సినిమాల్లో అనౌన్స్ అవ్వగానే మాంచి హైప్ తెచ్చుకున్న చిత్రాల్లో ‘విశ్వంభర’…

3 hours ago

పోకిరి రేంజ్ ట్విస్ట్ ఇచ్చిన రావిపూడి

ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన ‘మన శంకర వరప్రసాద్’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ అయ్యే దిశగా దూసుకెళ్తోంది.…

7 hours ago

ఇళయరాజా అభయమందుకున్న వరప్రసాద్ గారు

మన శంకరవరప్రసాద్ గారు రిలీజయ్యాక చాలా మందికి కలిగిన సందేహం ఒకటుంది. చిరంజీవి, నయనతార లవ్ ఎపిసోడ్స్ లో బ్యాక్…

9 hours ago

విజ‌య్‌కు సీబీఐ సెగ‌… `పొత్తు` కోసమా?

త‌మిళ దిగ్గ‌జ న‌టుడు, త‌మిళగ వెట్రి క‌గ‌ళం(టీవీకే) అధ్య‌క్షుడు విజ‌య్ వ్య‌వ‌హారం.. మ‌రింత ముదురుతోంది. గ‌త ఏడాది సెప్టెంబ‌రు 27న‌…

9 hours ago

చేతులు కాలాక ఆలోచిస్తే ఏం లాభం

రికార్డులు బద్దలు కొట్టేస్తుందని అభిమానులు గంపెడాశలు పెట్టుకున్న ది రాజా సాబ్ ఫలితం చూస్తున్నాం. ఆడియన్స్ ని పూర్తి స్థాయిలో…

9 hours ago

నారావారి ప‌ల్లెముచ్చ‌ట్లు: మ‌న‌వ‌డి ఆట‌లు – తాత మురిపాలు

ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత గ్రామం.. ఉమ్మ‌డి చిత్తూరు జిల్లాలోని నారావారి ప‌ల్లెలో ముంద‌స్తు సంక్రాంతి వేడుక‌లు ఘ‌నంగా నిర్వ‌హించారు.…

11 hours ago