Political News

‘ఆ పార్టీల‌కు ఓటేస్తే.. తెలంగాణను ఏపీలో క‌లిపేస్తారు’

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల సంరంభం ప్రారంభ‌మైంది. కేంద్ర ఎన్నిక‌ల సంఘం నోటిఫికేష‌న్ ఇచ్చి వారం రోజులు కూడా కాలేదు. ఇంత‌లోనే సెంటిమెంటు రాజ‌కీయాలు ప్రారంభ‌మైపోయాయి. తాజాగా బీఆర్ ఎస్ నాయ‌కుడు, మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణ రాష్ట్రాన్నిఏపీలో క‌లిపేసేందుకు కుట్ర‌లు జ‌రుగుతున్నాయ‌ని ఆయ‌న అన్నారు.

బీజేపీ, కాంగ్రెస్‌లు ఒక్క‌టేన‌ని, ఈ రెండు పార్టీలకు ఓటేస్తే.. తెలంగాణ‌ను ఏపీలో క‌లిపేయ‌డం ఖాయ‌మ‌ని మంత్రి గంగుల వ్యాఖ్యానించారు. “ఆంధ్రోళ్లు.. కాంగ్రెస్‌, బీజేపీ ముసుగులో వ‌స్తున్నారు. ఎన్నిక‌ల్లో వారిని ఆద‌రిస్తే.. ఓటేస్తే.. మ‌న ప‌ని ఖ‌తం. ఎన్నిక‌ల్లో కేసీఆర్ ఓడిపోతే ఢిల్లీ పెద్ద‌ల‌తో ఆ పార్టీ నేత‌లు మాట్లాడి తెలంగాణ‌ను ఏపీలో క‌లిపేసే కుట్ర చేస్తున్నారు. ఇది మ‌న భ‌విష్య‌త్ త‌రానికి ఇబ్బందిక‌రం” అని మంత్రి అన్నారు.

వాస్త‌వానికి తెలంగాణలో జ‌రిగిన 2018 ఎన్నిక‌ల్లోనూ తెలంగాణ సెంటిమెంటును బీఆర్ ఎస్ నాయ‌కులు ప్లే చేశారు. అప్ప‌ట్లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్న టీడీపీని, ఆ పార్టీ అధినేత చంద్ర‌బాబును బూచిగా చూపించారు. “మ‌న‌మీద మ‌ళ్లీ ఆంధ్రోళ్లు పెత్త‌నం చేసేందుకు వ‌స్తున్న‌రు. ఆంధ్రోళ్ల పెత్త‌నం మ‌న‌కు అవ‌స‌ర‌మా?” అంటూ స్వ‌యం సీఎం కేసీఆర్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో వ్యాఖ్యానించి సెంటిమెంటును రాజేశారు. ఇక‌, ఇప్పుడు మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్ రూపంలో సెంటిమెంటు రాజ‌కీయాల‌కు శ్రీకారం చుట్టిన‌ట్ట‌యింది. రానున్న రోజుల్లో ఈ రాజ‌కీయం ఎలాంటి మ‌లుపు తిరుగుతుందో చూడాలి.

This post was last modified on October 13, 2023 2:09 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

వివాదాస్పద సినిమాకు కోర్టు బ్రేకు

రేపు విడుదల కావాల్సిన కేరళ స్టోరీ 2 హఠాత్తుగా వాయిదా పడింది. పలువురు పిటీషనర్లు వేసిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్న…

22 seconds ago

మరో తమిళ స్టార్ తో పూరి మూవీ?

విజయ్ సేతుపతితో స్లమ్ డాగ్ పూర్తి చేసుకుని కొత్త కాంబో కోసం ఎదురు చూస్తున్న టైంలో దర్శకుడు పూరి జగన్నాథ్…

1 hour ago

ప్రిమియర్స్ వద్దు.. రెగ్యులర్ షోలే ముద్దు

చిన్న సినిమాలకు రిలీజ్‌కు ఒక రోజు ముందే పెయిడ్ ప్రిమియర్స్ వేయడం కొన్నేళ్లుగా ట్రెండుగా మారింది. ఆ షోల నుంచి…

1 hour ago

బీజేపీ ఎమ్మెల్సీపై దాడికి యత్నించిన వైసీపీ?

ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో గురువారం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అంశంపై చర్చ సందర్భంగా వైసీపీ సభ్యులు ఆందోళనకు…

2 hours ago

రజినీ కొడుకుగా… అందరూ మెచ్చినవాడు

కరోనా తర్వాత మొదలైన ఓటీటీ విప్లవం వల్ల మలయాళ సినిమాలకు దేశవ్యాప్తంగా ఏ స్థాయిలో ఆదరణ పెరిగిందో తెలిసిందే. ఎప్పట్నుంచో…

3 hours ago

క్లిక్ అయితే శ్రీవిష్ణు పంట పండినట్టే

రేపు విష్ణు విన్యాసం విడుదల కానుంది. కొత్త రిలీజులు ఇంకేం ఉన్నాయనేది పక్కనపెడితే జనాల దృష్టిలో అంతో ఇంతో ఫోకస్…

4 hours ago