తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సంరంభం ప్రారంభమైంది. కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చి వారం రోజులు కూడా కాలేదు. ఇంతలోనే సెంటిమెంటు రాజకీయాలు ప్రారంభమైపోయాయి. తాజాగా బీఆర్ ఎస్ నాయకుడు, మంత్రి గంగుల కమలాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రాన్నిఏపీలో కలిపేసేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఆయన అన్నారు.
బీజేపీ, కాంగ్రెస్లు ఒక్కటేనని, ఈ రెండు పార్టీలకు ఓటేస్తే.. తెలంగాణను ఏపీలో కలిపేయడం ఖాయమని మంత్రి గంగుల వ్యాఖ్యానించారు. “ఆంధ్రోళ్లు.. కాంగ్రెస్, బీజేపీ ముసుగులో వస్తున్నారు. ఎన్నికల్లో వారిని ఆదరిస్తే.. ఓటేస్తే.. మన పని ఖతం. ఎన్నికల్లో కేసీఆర్ ఓడిపోతే ఢిల్లీ పెద్దలతో ఆ పార్టీ నేతలు మాట్లాడి తెలంగాణను ఏపీలో కలిపేసే కుట్ర చేస్తున్నారు. ఇది మన భవిష్యత్ తరానికి ఇబ్బందికరం” అని మంత్రి అన్నారు.
వాస్తవానికి తెలంగాణలో జరిగిన 2018 ఎన్నికల్లోనూ తెలంగాణ సెంటిమెంటును బీఆర్ ఎస్ నాయకులు ప్లే చేశారు. అప్పట్లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్న టీడీపీని, ఆ పార్టీ అధినేత చంద్రబాబును బూచిగా చూపించారు. “మనమీద మళ్లీ ఆంధ్రోళ్లు పెత్తనం చేసేందుకు వస్తున్నరు. ఆంధ్రోళ్ల పెత్తనం మనకు అవసరమా?” అంటూ స్వయం సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో వ్యాఖ్యానించి సెంటిమెంటును రాజేశారు. ఇక, ఇప్పుడు మంత్రి గంగుల కమలాకర్ రూపంలో సెంటిమెంటు రాజకీయాలకు శ్రీకారం చుట్టినట్టయింది. రానున్న రోజుల్లో ఈ రాజకీయం ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి.
This post was last modified on October 13, 2023 2:09 pm
తమిళనాడు ఎన్నికలు నిన్నటితో అయిపోయాయి. ఫలితాలు రావడానికి ఇంకా పది రోజులు టైం ఉండటంతో ఇండస్ట్రీ, పొలిటికల్ వర్గాలు రిలాక్స్…
తెలంగాణ లో ఆర్టీసీ సమ్మె ఉద్రిక్తతల మధ్య నర్సంపేట డిపోకు చెందిన డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి రాష్ట్రవ్యాప్తంగా విషాదాన్ని…
బాక్సాఫీస్ యమా నీరసంగా ఉంది. సరైన కొత్త సినిమాలు లేక చాలా థియేటర్లలో సగం షోలు కూడా పడటం లేదు.…
ప్రస్తుతం వైసీపీకి ఉన్న 11 నియోజకవర్గాల్లో వచ్చే ఎన్నికల నాటికి 4 నియోజకవర్గాలు చేజారి పోవడం ఖాయమని అంటున్నారు పరిశీలకులు.…
బాలకృష్ణ - కొరటాల శివ కాంబినేషన్ సినిమా ఫిక్సయిపోయింది. వచ్చే వారమే పూజా కార్యక్రమాలతో ఓపెనింగ్ జరగనుందని సమాచారం. అయితే…
వైసీపీ అధినేత జగన్ శుక్రవారం నుంచి యూరప్ పర్యటనకు వెళ్తున్నారు. దాదాపు 20 రోజులకు పైగానే ఆయన రాష్ట్రానికి దూరంగా…