టీడీపీ అధినేత చంద్రబాబుకు భారీ ఊరట లభించింది. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ లో ఉన్న ఆయనకు అంగళ్లు కేసులో ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ను మంజూరు చేసింది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని అంగళ్లు ప్రాంతంలో పోలీసులు-టీడీపీ కార్యకర్తలకు మధ్య చోటు చేసుకున్న ఘర్షణ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేశారు. నాటి ఘటనలో పలువురు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. అదేసమయంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలకు కూడా గాయాలయ్యాయి.
ఈ ఘటనను పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకుని కేసులు నమోదు చేశారు. అంగళ్లు కేసులో ఏ1గా చంద్ర బాబును పేర్కొన్నారు. ఆయన రెచ్చగొట్టేలా చేసిన ప్రసంగాల కారణంగానే ఈ ఘర్షణలు చోటు చేసుకున్నాయని, పోలీసులకు గాయాలయ్యాయని కేసులో పేర్కొన్నారు. అదేవిధంగా పలువురు టీడీపీ కీలక నాయకులపైనా కేసులు పెట్టడం.. వారిని అరెస్టు చేయడం తెలిసిందే. అయితే. వీరిలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వంటి వారికి హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
ఇక, ఇప్పుడు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అవినీతికి పాల్పడ్డారంటూ జైలులో ఉంచిన చంద్రబాబుపై అంగళ్లు కేసు పోలీసు విచారణకు రానుంది.ఈ నేపథ్యంలో స్కిల్ కేసులో బెయిల్ లభించినా.. అంగళ్లు కేసులో ఆయనను అరెస్టు చేసే అవకాశం ఉందని టీడీపీ వర్గాలు భావించాయి. ఇదే విషయంపై చంద్రబాబు తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించగా కొన్నాళ్లుగా దీనిపై వాదనలు విన్న హైకోర్టు తాజాగా ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అయితే, లక్ష రూపాయల పూచీకత్తును సమర్పించాలని షరతు విధించింది.
This post was last modified on October 13, 2023 11:40 am
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…
ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…
వైసీపీ అధినేత, తన బ్రదర్ జగన్పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్…