టీడీపీ అధినేత చంద్రబాబుకు భారీ ఊరట లభించింది. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ లో ఉన్న ఆయనకు అంగళ్లు కేసులో ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ను మంజూరు చేసింది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని అంగళ్లు ప్రాంతంలో పోలీసులు-టీడీపీ కార్యకర్తలకు మధ్య చోటు చేసుకున్న ఘర్షణ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేశారు. నాటి ఘటనలో పలువురు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. అదేసమయంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలకు కూడా గాయాలయ్యాయి.
ఈ ఘటనను పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకుని కేసులు నమోదు చేశారు. అంగళ్లు కేసులో ఏ1గా చంద్ర బాబును పేర్కొన్నారు. ఆయన రెచ్చగొట్టేలా చేసిన ప్రసంగాల కారణంగానే ఈ ఘర్షణలు చోటు చేసుకున్నాయని, పోలీసులకు గాయాలయ్యాయని కేసులో పేర్కొన్నారు. అదేవిధంగా పలువురు టీడీపీ కీలక నాయకులపైనా కేసులు పెట్టడం.. వారిని అరెస్టు చేయడం తెలిసిందే. అయితే. వీరిలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వంటి వారికి హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
ఇక, ఇప్పుడు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అవినీతికి పాల్పడ్డారంటూ జైలులో ఉంచిన చంద్రబాబుపై అంగళ్లు కేసు పోలీసు విచారణకు రానుంది.ఈ నేపథ్యంలో స్కిల్ కేసులో బెయిల్ లభించినా.. అంగళ్లు కేసులో ఆయనను అరెస్టు చేసే అవకాశం ఉందని టీడీపీ వర్గాలు భావించాయి. ఇదే విషయంపై చంద్రబాబు తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించగా కొన్నాళ్లుగా దీనిపై వాదనలు విన్న హైకోర్టు తాజాగా ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అయితే, లక్ష రూపాయల పూచీకత్తును సమర్పించాలని షరతు విధించింది.
This post was last modified on October 13, 2023 11:40 am
వందేమాతరం ఆలపించడంపై ఇటీవల కేంద్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి, ప్రధాని ప్రమాణ స్వీకారం,…
ఇప్పుడున్న జనరేషన్ హీరోలు దర్శకులుగా మారడం అరుదు. కాకపోతే చిరంజీవి తరంతో పోల్చుకుంటే కొంచెం బెటరని చెప్పొచ్చు. మెగాస్టార్ తో…
నిన్న సాయిపల్లవి పుట్టినరోజు. అసలు విశేషం అది కాదు. రామాయణలో సీతగా నటించిన తనకు బర్త్ డే కానుకగా ఒక…
తమిళ సినీ రాజకీయ వర్గాలతో పాటు తెలుగు విజయ్ అభిమానుల్లోనూ హాట్ టాపిక్ గా మారింది ఎవరయ్యా అంటే ఠక్కున…
ఇండియాలో అత్యంత ఆదరణ పొందిన వెబ్ సిరీస్లలో ‘మీర్జాపూర్’ ఒకటి. అది చూసిన వాళ్లు ఎవ్వరూ అందులో మున్నా పాత్రను…
మొత్తానికి ఉత్కంఠకు తెరపడింది. కొత్తగా రాజకీయ పార్టీ పెట్టిన రెండేళ్లకే ఎన్నికల్లో అద్భుత ఫలితాలు రాబట్టిన తమిళ స్టార్ హీరో…