Political News

ఈ నెల 23న విశాఖలో జగన్ గృహప్రవేశం

ఈ ఏడాది విజయదశమి నుంచి విశాఖ నుంచి పరిపాలన చేస్తాను అని సీఎం జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే దసరా నాటికి సీఎం క్యాంప్ కార్యాలయంతో పాటు పలు కార్యాలయాలను సిద్ధం చేసేందుకు అధికారులు ఆఘమేఘాలపై పెండింగ్ పనులు పూర్తి చేస్తున్నట్లుగా తెలుస్తోంది. విశాఖ భీమిలి బీచ్ మధ్య ప్రాంతంలో పలు కార్యాలయాలకు సంబంధించిన బిల్డింగులను వైసిపి నేతలు జల్లెడ పడుతున్నట్టుగా తెలుస్తోంది. ఈనెల 20వ తారీకు లోపు సీఎం క్యాంప్ ఆఫీస్ తో పాటు మిగతా ఆఫీసులు కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది.

దీంతో, ఈనెల 23న సీఎం క్యాంప్ ఆఫీసును ప్రారంభించేందుకు వైసిపి నేతలు ఏర్పాట్లు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. దసరాకు ఒకరోజు ముందే జగన్ ను క్యాంప్ ఆఫీసులో కూర్చోబెట్టాలని వైసీపీ నేతలు అనుకుంటున్నారట. అన్నీ అనుకున్నట్లు జరిగితే అక్టోబర్ 23వ తేదీన సీఎం జగన్ విశాఖలో గృహప్రవేశం చేసే అవకాశం ఉందని, అందుకు వైసిపి నేత, మాజీ మంత్రి కన్నబాబు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారని తెలుస్తోంది. ఋషికొండపై ఏపీ టూరిజం శాఖ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న కాంప్లెక్స్ లోనే సీఎం జగన్ ఇల్లు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.

జగన్ తో పాటు అనుబంధ శాఖల అధికారులు కూడా ఇక్కడి నుంచి బాధ్యతలు నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏపీ టూరిజం కార్పొరేషన్ ఎండీ కన్నబాబు ఆధ్వర్యంలో పనులన్నీ వేగంగా జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. అక్టోబర్ 15 నాటికి సీఎం క్యాంపు కార్యాలయాన్ని భద్రతా సిబ్బందికి అప్పగించేలాగా ఏర్పాట్లు చేస్తున్నారని తెలుస్తోంది. ఈ నిర్మాణాలను చేపట్టిన డిఇసి సంస్థ ఈనెల 20 నాటికి సీఎం క్యాంపు కార్యాలయాన్ని రెడీ చేసి ఇస్తానని హామీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ నెల 23న ముహూర్తం బాగుండటంతో అదే రోజు జగన్ గృహప్రవేశం చేస్తే బాగుంటుందని కన్నబాబు సహా పలువురు వైసిపి నేతలు అభిప్రాయపడుతున్నారట.

ఈ నెల 24 నుంచి విశాఖ నుంచి పాలన కూడా సాగించవచ్చని వైసీపీ నేతలు భావిస్తున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే విశాఖలో పోలీసు యంత్రాంగం కూడా అప్రమత్తమై భద్రతాపరమైన ఏర్పాట్లు, బందోబస్తు వంటి వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారని తెలుస్తోంది. అయితే, ఈనెల 23న గృహప్రవేశం చేసే అంశంపై జగన్ స్పష్టత ఇవ్వలేదని తెలుస్తోంది. విశాఖలో ఏర్పాట్లన్నీ ఓ కొలిక్కి వచ్చిన తర్వాతే నిర్ణయాన్ని ప్రకటించాలని జగన్ ఆలోచనా ధోరణి ఉన్నట్టు తెలుస్తుంది.

సీఎం క్యాంప్ కార్యాలయంతో పాటు అనుబంధ కార్యాలయాల కోసం భీమిలి బీచ్ రోడ్డులో దాదాపు 50 ఇళ్లను అద్దెకు తీసుకొని విశాఖ కలెక్టర్ తో పాటు విశాఖ నగర మున్సిపల్ కమిషనర్ ఆ ఇళ్ల ఆధునీకరణ పనులు స్వయంగా పర్యవేక్షిస్తున్నట్టుగా తెలుస్తోంది.

This post was last modified on October 12, 2023 10:07 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘మహేష్’ వివాదంపై స్పందించిన శ్రీలీల

ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జరిగిన ఒక పరిణామానికి సంబంధించి ఓ వీడియో సోషల్…

56 minutes ago

పవన్ పారితోషికం లక్షల్లోనే అయినా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్‌గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…

5 hours ago

‘అన్న’ అనే ప‌దానికి జ‌గ‌న్ క‌ళంకం: ష‌ర్మిల‌

వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై ఆయ‌న సోద‌రి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల మ‌రోసారి నిప్పులు చెరిగారు. 'అన్న‌'…

6 hours ago

విమాన సంస్థ‌ల‌పై కొర‌డా.. 60 శాతం సీట్లు ‘ఫ్రీ’

దేశంలో విమానయాన సంస్థ‌ల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న…

6 hours ago

ఏపీలో ‘దివ్యాంగ శక్తి’.. క‌లిసి ప్ర‌యాణించిన బాబు-ప‌వ‌న్‌!

ఏపీలో మ‌రో కీల‌క ప‌థ‌కం ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి వ‌చ్చింది. 'దివ్యాంగ శక్తి' పేరుతో కీలక ప‌థ‌కాన్ని సీఎం చంద్ర‌బాబు, ఉప…

7 hours ago

లోకేష్ ఆక‌స్మిక త‌నిఖీ.. టీడీపీలో క‌ల‌వ‌రం!

మంత్రి నారా లోకేష్‌.. మంగ‌ళ‌వారం ఉమ్మ‌డి కృష్ణాజిల్లాలోని ఓ పాఠ‌శాల‌ను ఆక‌స్మికంగా త‌నిఖీ చేశారు. ఈ విష‌యాన్ని అత్యంత గోప్యంగా…

7 hours ago