ఈ ఏడాది విజయదశమి నుంచి విశాఖ నుంచి పరిపాలన చేస్తాను అని సీఎం జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే దసరా నాటికి సీఎం క్యాంప్ కార్యాలయంతో పాటు పలు కార్యాలయాలను సిద్ధం చేసేందుకు అధికారులు ఆఘమేఘాలపై పెండింగ్ పనులు పూర్తి చేస్తున్నట్లుగా తెలుస్తోంది. విశాఖ భీమిలి బీచ్ మధ్య ప్రాంతంలో పలు కార్యాలయాలకు సంబంధించిన బిల్డింగులను వైసిపి నేతలు జల్లెడ పడుతున్నట్టుగా తెలుస్తోంది. ఈనెల 20వ తారీకు లోపు సీఎం క్యాంప్ ఆఫీస్ తో పాటు మిగతా ఆఫీసులు కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది.
దీంతో, ఈనెల 23న సీఎం క్యాంప్ ఆఫీసును ప్రారంభించేందుకు వైసిపి నేతలు ఏర్పాట్లు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. దసరాకు ఒకరోజు ముందే జగన్ ను క్యాంప్ ఆఫీసులో కూర్చోబెట్టాలని వైసీపీ నేతలు అనుకుంటున్నారట. అన్నీ అనుకున్నట్లు జరిగితే అక్టోబర్ 23వ తేదీన సీఎం జగన్ విశాఖలో గృహప్రవేశం చేసే అవకాశం ఉందని, అందుకు వైసిపి నేత, మాజీ మంత్రి కన్నబాబు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారని తెలుస్తోంది. ఋషికొండపై ఏపీ టూరిజం శాఖ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న కాంప్లెక్స్ లోనే సీఎం జగన్ ఇల్లు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.
జగన్ తో పాటు అనుబంధ శాఖల అధికారులు కూడా ఇక్కడి నుంచి బాధ్యతలు నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏపీ టూరిజం కార్పొరేషన్ ఎండీ కన్నబాబు ఆధ్వర్యంలో పనులన్నీ వేగంగా జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. అక్టోబర్ 15 నాటికి సీఎం క్యాంపు కార్యాలయాన్ని భద్రతా సిబ్బందికి అప్పగించేలాగా ఏర్పాట్లు చేస్తున్నారని తెలుస్తోంది. ఈ నిర్మాణాలను చేపట్టిన డిఇసి సంస్థ ఈనెల 20 నాటికి సీఎం క్యాంపు కార్యాలయాన్ని రెడీ చేసి ఇస్తానని హామీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ నెల 23న ముహూర్తం బాగుండటంతో అదే రోజు జగన్ గృహప్రవేశం చేస్తే బాగుంటుందని కన్నబాబు సహా పలువురు వైసిపి నేతలు అభిప్రాయపడుతున్నారట.
ఈ నెల 24 నుంచి విశాఖ నుంచి పాలన కూడా సాగించవచ్చని వైసీపీ నేతలు భావిస్తున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే విశాఖలో పోలీసు యంత్రాంగం కూడా అప్రమత్తమై భద్రతాపరమైన ఏర్పాట్లు, బందోబస్తు వంటి వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారని తెలుస్తోంది. అయితే, ఈనెల 23న గృహప్రవేశం చేసే అంశంపై జగన్ స్పష్టత ఇవ్వలేదని తెలుస్తోంది. విశాఖలో ఏర్పాట్లన్నీ ఓ కొలిక్కి వచ్చిన తర్వాతే నిర్ణయాన్ని ప్రకటించాలని జగన్ ఆలోచనా ధోరణి ఉన్నట్టు తెలుస్తుంది.
సీఎం క్యాంప్ కార్యాలయంతో పాటు అనుబంధ కార్యాలయాల కోసం భీమిలి బీచ్ రోడ్డులో దాదాపు 50 ఇళ్లను అద్దెకు తీసుకొని విశాఖ కలెక్టర్ తో పాటు విశాఖ నగర మున్సిపల్ కమిషనర్ ఆ ఇళ్ల ఆధునీకరణ పనులు స్వయంగా పర్యవేక్షిస్తున్నట్టుగా తెలుస్తోంది.
విజయవాడలోని కృష్ణలంక ప్రాంతానికి చెందిన సాయికృష్ణ అనే యువకుడు లాకప్ డెత్ కు గురయ్యాడని తీవ్రస్థాయిలో ఆరోపణలు వస్తున్న సంగతి…
అమెరికానుంచి తరచుగా భారత్కు అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. వలస విధానానికి సంబంధించి, హెచ్-1బీ వీసాలకు సంబంధించి కూడా భారత్కు అమెరికా…
ఓ పరామర్శ అయినా, ఓ సాయం అయినా, ఓ ఓదార్పు అయినా, ఓ కేసు అయినా, ఓ పథకం అయినా……
ఇప్పుడు ప్రపంచంలో నంబర్ వన్ డైౌరెక్టర్ ఎవరు అని పోల్ పెడితే.. తిరుగులేని ఆధిక్యంతో క్రిస్టోఫర్ నోలనే గెలుస్తాడు అనడంలో…
గత శుక్రవారం ‘సింగ్గీతం’ చిత్రం విడుదల కావడానికి ముందు పెద్దగా బజ్ కనిపించలేదు. 94 ఏళ్ల వయసులో సింగీతం ఓపిగ్గా…
గత ఎన్నికల సమయంలో మంగళగిరిలోని ప్రతి వీధిలోనూ పర్యటించిన నారా లోకేష్.. అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యను ప్రభుత్వం…