ఏపీలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు… కేంద్రాన్ని తాకిన విషయం తెలిసిందే. 14 ఏళ్ల పాటు ఉమ్మడి, విభజిత ఏపీని పాలించిన చంద్రబాబును ఏపీలోని వైసీపీ ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో రూ.341 కోట్ల అవినీతి జరిగిందంటూ ఆయనను అరెస్టు చేసి.. రాజమండ్రి జైల్లో పెట్టిన విషయం తెలిసిందే. అయితే.. చంద్రబాబు వంటి నాయకుడిని అరెస్టు చేయడం, ఏకంగా జైల్లో పెట్టడం వంటివి.. సంచలనం సృష్టించాయి.
ఏపీలోని జగన్ సర్కారు తనంతట తానుగా ఈ సాహసం చేయలేదని, చంద్రబాబును అరెస్టు చేసి చేజేతులా.. ప్రజల్లో వ్యతిరేకతను కొని తెచ్చుకునే ప్రయత్నం చేయదని ఓ వర్గం నాయకులు విశ్లేషించారు. అంతేకాదు.. అసలు తమకు ఈ కేసుతోసంబంధం లేదని, కేంద్రంలోని ఈడీ, సీబీఐలే విచారించాయని బుధవారం మధ్యాహ్నం మీడియాతో మాట్లాడిన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్నారెడ్డి సైతం చెప్పుకొచ్చారు. దీనికి ముందు పలువురు మంత్రులు గత రెండు మూడు వారాలుగా చంద్రబాబు అరెస్టు వెనుక కేంద్రంలోని బీజేపీ పెద్దలే ఉన్నారంటూ.. పరోక్షంగా వ్యాఖ్యలు గుప్పించారు.
ఇదిలావుంటే.. వైసీపీ నాయకులు.. ఓ వర్గం మీడియాలో వచ్చిన కథనాలపై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి గతంలోనే స్పందించారు. కేంద్రంలోని బీజేపీ నాయకులకు, మంత్రులకు, ప్రభుత్వానికి సంబంధం ఉందనే విషయం సరికాదన్నారు. ఇక, ఇదే అభిప్రాయాన్ని టీడీపీ యువ నాయకుడు నారా లోకేష్ కూడా ఢిల్లీలో చెప్పుకొచ్చారు. చంద్రబాబు అరెస్టు, జైలు వెనుక కేంద్రం ఉందని తమకు ఎలాంటి సమాచారం లేదన్నారు. అయినప్పటికీ.. వైసీపీ నాయకులు మాత్రం ఈ ప్రచారానికి ఎక్కడా ఫుల్ స్టాప్ పెట్టలేదు.
ఇదిలాసాగుతుండగానే తాజాగా బుధవారం రాత్రి ఢిల్లీ వేదికగా జరిగిన పరిణామంతో చంద్రబాబు అరెస్టు వెనుక బీజేపీ పెద్దలు లేరనే విషయం స్పష్టమైందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. కేంద్ర మంత్రి, బీజేపీ అగ్ర నాయకుడు అమిత్ షా.. స్వయంగా నారా లోకేష్ తో భేటీ కావడం, చంద్రబాబు అరెస్టుపై విచారం వ్యక్తం చేయడం, 73 ఏళ్ల వయసులో ఆయనను ఇలా ఇబ్బందులకు గురి చేయడం సరికాదని వ్యాఖ్యానించడం వంటివి.. ఈ కేసులో బీజేపీ పాత్ర లేదనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని వారు చెబుతున్నారు. మొత్తానికి ఇప్పటికైతే.. చంద్రబాబు కేసు విషయంలో బీజేపీ పెద్దల జోక్యం లేదనే విషయంపై ఒకింత స్పష్టత వచ్చిందని అంటున్నారు. మరిమున్ముందు ఏం జరుగుతుందో చూడాలి.
అయితే… ఇదంతా కేంద్ర పెద్దల నాటకమని… ఎట్టి పరిస్థితుల్లోను బీజేపీకి తెలియకుండా చేసి ఉంటే ఈపాటికి బాబు విడుదలై ఉండేవారని అనేవాళ్లు కూడా లేకపోలేదు.
This post was last modified on October 12, 2023 1:36 pm
మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ ఇచ్చాక ఆయన ఓకే చేసిన సినిమాల్లో అనౌన్స్ అవ్వగానే మాంచి హైప్ తెచ్చుకున్న చిత్రాల్లో ‘విశ్వంభర’…
ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన ‘మన శంకర వరప్రసాద్’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్బస్టర్ అయ్యే దిశగా దూసుకెళ్తోంది.…
మన శంకరవరప్రసాద్ గారు రిలీజయ్యాక చాలా మందికి కలిగిన సందేహం ఒకటుంది. చిరంజీవి, నయనతార లవ్ ఎపిసోడ్స్ లో బ్యాక్…
తమిళ దిగ్గజ నటుడు, తమిళగ వెట్రి కగళం(టీవీకే) అధ్యక్షుడు విజయ్ వ్యవహారం.. మరింత ముదురుతోంది. గత ఏడాది సెప్టెంబరు 27న…
రికార్డులు బద్దలు కొట్టేస్తుందని అభిమానులు గంపెడాశలు పెట్టుకున్న ది రాజా సాబ్ ఫలితం చూస్తున్నాం. ఆడియన్స్ ని పూర్తి స్థాయిలో…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత గ్రామం.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నారావారి పల్లెలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.…