తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముంగిట అధికార పార్టీ బీఆర్ ఎస్కు ఎన్నికల గుర్తు కష్టాలు వచ్చి పడ్డాయి. బీఆర్ ఎస్ ఎన్నికల గుర్తయిన కారు ను పోలిన గుర్తులు ఇతర పార్టీలకు కేటాయించడం బీఆర్ ఎస్కు తీవ్ర సంకటంగా మారింది. ఈ నేపథ్యంలో గత కొన్ని నెలలుగా ఈ విషయంపై కేంద్ర ఎన్నికల సంఘానికి బీఆర్ ఎస్ నాయకులు లిఖిత పూర్వకంగా కూడా ఫిర్యాదులు చేశారు. అయితే.. నెలలు గడిచి, ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసినా ఇప్పటి వరకు.. ఎన్నికల సంఘం ఎలాంటి చర్యలూ తీసుకోలేదు.
దీంతో విసిగి వేసారిన బీఆర్ ఎస్.. ఎన్నికల గుర్తులపై ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. కారును పోలి ఉన్న గుర్తులను ఏ గుర్తింపు పార్టీకి కేటాయించ వద్దు అని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించేలా అభ్యర్థిస్తూ రిట్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై గురువారం విచారణ జరగనుంది. ఎన్నికల గుర్తు కారును పోలి ఉన్న గుర్తులు మరొక పార్టీకి కేటాయించడం వల్ల తమకు నష్టం జరుగుతోందని రిట్ పిటిషన్ లో బీఆర్ఎస్ పేర్కొంది.
ఢిల్లీ హైకోర్టులో బీఆర్ఎస్ తరపున న్యాయవాది మోహిత్ ఈ రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం బీఆర్ఎస్ జాతీయ పార్టీగా అవతరించిందని, ఈ క్రమంలోనే పలు రాష్ట్రాల్లో పోటీకి సిద్ధమవుతోందని ఆయన పిటిషన్లో వివరించారు. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో కారును పోలిన గుర్తులుంటే పార్టీకి ఇబ్బంది కలిగే అవకాశం ఉందని, ఆ గుర్తును ఏ పార్టీకి కేటాయించవద్దని ఢిల్లీ హైకోర్టకు విన్నవించారు. మరి కోర్టు ఏమేరకు స్వాంతన చేకూరుస్తుందో చూడాలి.
This post was last modified on October 12, 2023 1:22 pm
ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో గురువారం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అంశంపై చర్చ సందర్భంగా వైసీపీ సభ్యులు ఆందోళనకు…
కరోనా తర్వాత మొదలైన ఓటీటీ విప్లవం వల్ల మలయాళ సినిమాలకు దేశవ్యాప్తంగా ఏ స్థాయిలో ఆదరణ పెరిగిందో తెలిసిందే. ఎప్పట్నుంచో…
రేపు విష్ణు విన్యాసం విడుదల కానుంది. కొత్త రిలీజులు ఇంకేం ఉన్నాయనేది పక్కనపెడితే జనాల దృష్టిలో అంతో ఇంతో ఫోకస్…
బేబి షామిలి.. 90వ దశకంతో తెలుగు, తమిళ సినిమాలు చూసిన వాళ్లు అంత సులువుగా మరిచిపోలేని పేరిది. అంజలి, జగదేక…
థియేటర్ ఆక్యుపెన్సీలు తగ్గిపోవడానికి కారణం ఓటిటికి తక్కువ గ్యాప్ ఉండటమే అన్నది ఎప్పటి నుంచో వినిపిస్తున్న వాదన. ఎలాగూ నాలుగు…
ఇండియన్ సినిమా స్థాయి ఎంత పెరిగినా సరే.. ఇప్పటికీ వెయ్యి కోట్ల బడ్జెట్ అంటేనే చాలా ఎక్కువ. అలాంటిది రామాయణం…