టీడీపీ అధినేత, మాజీ మంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రస్తుతం రాజమండ్రి కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. గత 30 రోజులకు పైగానే ఆయన జైల్లో ఉండడం, సరైన వెంటిలేషన్ లేకపోవడం(టీడీపీ నేతల ఆరోపణ), బయటి ఉష్ణోగ్రతలు పెరగడం, జైలు గదిలో చంద్రబాబుకు ఏసీ సౌకర్యాన్ని కల్పించకపోవడం వంటి కారణాలతో మంగళవారం సాయంత్రం తర్వాత చంద్రబాబు స్వల్ప అస్వస్థతకు గురయ్యారని స్వయంగా జైలు అధికారులే తెలిపారు.
డీహైడ్రేషన్కు గురైన చంద్రబాబుకు వైద్య సేవలు అందించేందుకు వెంటనే సంబంధిత వైద్యులకు కూడా సమాచారం అందించారు. అయితే, చంద్రబాబు స్వల్ప అనారోగ్యంపై వైసీపీ నాయకుడు, మంత్రి గుడివాడ అమర్నాథ్ తీవ్రంగా స్పందించారు. చంద్రబాబు ఆరోగ్యంపై సెటైర్లు వేశారు.
“చంద్రబాబు ఉన్నది ప్రకృతి వనంలో కాదు.. జైల్లో అన్న సంగతిని ఆయన మరిచిపోయారు” అని మంత్రి గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యానించారు. అంతేకాదు.. జైల్లో ఉన్న చంద్రబాబు సింపతీ కోసం అనారోగ్యం అంటూ తన అనుకూల మీడియా ద్వారా ప్రచారం చేయించుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
అయితే, మంత్రి గుడివాడ వ్యాఖ్యలపై టీడీపీ నాయకులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మాజీ ముఖ్యమంత్రిని ఆధారాలు కనిపెట్టక ముందే జైల్లో అక్రమంగా నిర్బంధించడమే కాకుండా.. చంద్రబాబు అనారోగ్యంపై తీవ్ర విమర్శలు చేయడం ఏంటని నిలదీశారు.
ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ చివరి దశకు చేరుకున్న వేళ మాజీ మంత్రి ఓటే గల్లంతు…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వీరాభిమాని నిరంజన్ మరణం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చనీయాంశంగానే మారిపోయింది. పవన్…
విడుదలై రెండేళ్లు దాటినా కల్కి 2898 ఏడి మీద సోషల్ మీడియాలో ఏదో ఒక రూపంలో ప్రస్తావన వస్తూనే ఉంటుంది.…
ఇటీవలే విడుదలైన లెనిన్ పైరసీ మూడు రోజల వరకు రాకపోవడం మూవీ లవర్స్ ని ఆశ్చర్యపరచడమే కాదు ఇండస్ట్రీ వర్గాలను…
చట్టాన్ని అమలు చేయాల్సిన పోలీసు అధికారే నిబంధనలను ఉల్లంఘించి వివాదంలో చిక్కుకున్నారు. హైదరాబాద్ శివారులోని గంధంగూడ–బైరాగిగూడ ప్రధాన రహదారిపై ఆరేళ్ల…
టాలీవుడ్ యంగ్ స్టార్స్ పర్సనల్ లైఫ్ లో జరిగిన మార్పులు, ఆ వెంటనే వారు అందుకున్న సక్సెస్ లపై నెటిజన్లు…