టీడీపీ అధినేత, మాజీ మంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రస్తుతం రాజమండ్రి కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. గత 30 రోజులకు పైగానే ఆయన జైల్లో ఉండడం, సరైన వెంటిలేషన్ లేకపోవడం(టీడీపీ నేతల ఆరోపణ), బయటి ఉష్ణోగ్రతలు పెరగడం, జైలు గదిలో చంద్రబాబుకు ఏసీ సౌకర్యాన్ని కల్పించకపోవడం వంటి కారణాలతో మంగళవారం సాయంత్రం తర్వాత చంద్రబాబు స్వల్ప అస్వస్థతకు గురయ్యారని స్వయంగా జైలు అధికారులే తెలిపారు.
డీహైడ్రేషన్కు గురైన చంద్రబాబుకు వైద్య సేవలు అందించేందుకు వెంటనే సంబంధిత వైద్యులకు కూడా సమాచారం అందించారు. అయితే, చంద్రబాబు స్వల్ప అనారోగ్యంపై వైసీపీ నాయకుడు, మంత్రి గుడివాడ అమర్నాథ్ తీవ్రంగా స్పందించారు. చంద్రబాబు ఆరోగ్యంపై సెటైర్లు వేశారు.
“చంద్రబాబు ఉన్నది ప్రకృతి వనంలో కాదు.. జైల్లో అన్న సంగతిని ఆయన మరిచిపోయారు” అని మంత్రి గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యానించారు. అంతేకాదు.. జైల్లో ఉన్న చంద్రబాబు సింపతీ కోసం అనారోగ్యం అంటూ తన అనుకూల మీడియా ద్వారా ప్రచారం చేయించుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
అయితే, మంత్రి గుడివాడ వ్యాఖ్యలపై టీడీపీ నాయకులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మాజీ ముఖ్యమంత్రిని ఆధారాలు కనిపెట్టక ముందే జైల్లో అక్రమంగా నిర్బంధించడమే కాకుండా.. చంద్రబాబు అనారోగ్యంపై తీవ్ర విమర్శలు చేయడం ఏంటని నిలదీశారు.
This post was last modified on October 11, 2023 1:18 pm
కలిసి రాజకీయం చేయకపోయినా వైఎస్సార్సీపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య కొన్ని పోలికలు కనిపిస్తున్నాయి. అటు ఏపీలో, ఇటు తెలంగాణలో ఈ…
సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటూ.. తన సినిమాల ఈవెంట్లలో, ఇంటర్వ్యూల్లో హాట్ హాట్ కామెంట్లు చేస్తుంటాడు ప్రముఖ తెలుగు…
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు'తో ఇప్పుడు తప్పకుండా హిట్ కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో 'గద్దలకొండ గణేష్'…
ఆదివారం రోజు అందులోనూ ప్రత్యేకంగా సాయంత్రం షోలకు ఆక్యుపెన్సీలు బాగుండటం సహజమే కానీ ఈవారం మాత్రం బయ్యర్లు ఆనందంతో మునిగిపోయేలా…
తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలులో కీలక మార్పులు తెచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతుంది. కళాశాలలకు…
నీట్ ప్రశ్నపత్రం లీకేజీకి వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన ఢిల్లీ నిరసనలో ఉగ్రవాదుల కుట్ర కోణం బయట పడిందని ఢిల్లీ టాస్క్ఫోర్స్…