తెలంగాణ శాసన సభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో ఎన్నికల వేడి రాజుకుంది. ఎన్నికలకు మరో 50 రోజుల గడువు మాత్రమే ఉండడంతో అన్ని ప్రధాన పార్టీలు అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా తెలంగాణలోని ఆదిలాబాద్ లో నిర్వహించిన బీజేపీ జన గర్జన సభకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ పై అమిత్ షా విమర్శలతో విరుచుకుపడ్డారు. “చంద్రశేఖర్ రావూ జీ” అంటూ షా చురకలంటించారు.
కేసీఆర్ గత పదేళ్లుగా తన కుటుంబం గురించే ఆలోచిస్తూ, రాష్ట్రంలోని దళితులు, గిరిజనులను పట్టించుకోలేదని ఆరోపించారు. తెలంగాణ పేదల సమస్యలు తీర్చడంలో విఫలమయ్యారని విమర్శించారు. ఆదివాసీలకు డబుల్ బెడ్రూం ఇళ్లు, గిరిజనులకు హామీలు గుప్పించిన కేటీఆర్ ఒక్కటైనా అమలు చేశారా? అని నిలదీశారు. కొందరికి దళితబంధు ఇచ్చి గొప్పలు చెప్పుకుంటున్నారని, దళితులకు మూడెకరాల భూమి హామీ ఏమైంది చంద్రశేఖర్ రావూ జీ? అని చురకలంటించారు.
అవినీతిలో, రైతుల ఆత్మహత్యల విషయంలో తెలంగాణను దేశంలోనే నెంబర్ వన్ గా కేసీఆర్ చేశారని విమర్శించారు. తెలంగాణలో బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కారు వచ్చే సమయం ఆసన్నమైందని, డిసెంబరు 3న హైదరాబాదులో బీజేపీ జెండా రెపరెపలాడాలని బీజేపీ శ్రేణులకు షా పిలుపునిచ్చారు.
మరోవైపు కేసీఆర్ పై బండి సంజయ్ సెటైర్లు వేశారు. కేసీఆర్ తనకు గురువు అని, కేసీఆర్ ను చూసే తాను మాటలు నేర్చుకున్నానని ఆయన అన్నారు. కేసీఆర్ ఆరోగ్య సమాచారం వెల్లడించాలని, ఆయనను ప్రజలకు చూపించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ కనిపించకపోవడంతో తనకు చాలా బాధగా, కేటీఆర్ పై అనుమానంగా ఉందని, ఆయనకు భద్రతను కల్పించాలని కోరారు.
This post was last modified on October 10, 2023 9:48 pm
నాగచైతన్యను ఇప్పటివరకు క్లాస్ లుక్లో, లవర్ బాయ్గా చూసి అలవాటు పడ్డ కళ్లకు ఈ ఫొటో ఒక్కసారిగా షాక్ ఇస్తోంది.…
సరిగ్గా వారం రోజుల్లో ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చేస్తాడు. థియేటర్ యజమానులు ఆ క్షణం కోసమే ఎదురు చూస్తున్నారు. కేవలం…
ఇప్పుడు తెలుగు సినిమా ఎంతో ఎదిగిపోయింది.. సరికొత్త సినిమాలు తీస్తోంది అని కాలర్ ఎగరేస్తున్నాం కానీ.. రెండు దశాబ్దాల ముందు…
ఇండస్ట్రీ పెద్ద ఎవరు..? ఈ ప్రశ్న టాలీవుడ్లో తరచుగా వినిపిస్తుంటుంది. ఒకప్పుడు దర్శక రత్న దాసరి నారాయణరావు ఈ పాత్రను…
ఎన్నికలు అనగానే నాయకుల్లో మార్పులు సహజం. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.…
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…