తెలంగాణ శాసన సభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో ఎన్నికల వేడి రాజుకుంది. ఎన్నికలకు మరో 50 రోజుల గడువు మాత్రమే ఉండడంతో అన్ని ప్రధాన పార్టీలు అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా తెలంగాణలోని ఆదిలాబాద్ లో నిర్వహించిన బీజేపీ జన గర్జన సభకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ పై అమిత్ షా విమర్శలతో విరుచుకుపడ్డారు. “చంద్రశేఖర్ రావూ జీ” అంటూ షా చురకలంటించారు.
కేసీఆర్ గత పదేళ్లుగా తన కుటుంబం గురించే ఆలోచిస్తూ, రాష్ట్రంలోని దళితులు, గిరిజనులను పట్టించుకోలేదని ఆరోపించారు. తెలంగాణ పేదల సమస్యలు తీర్చడంలో విఫలమయ్యారని విమర్శించారు. ఆదివాసీలకు డబుల్ బెడ్రూం ఇళ్లు, గిరిజనులకు హామీలు గుప్పించిన కేటీఆర్ ఒక్కటైనా అమలు చేశారా? అని నిలదీశారు. కొందరికి దళితబంధు ఇచ్చి గొప్పలు చెప్పుకుంటున్నారని, దళితులకు మూడెకరాల భూమి హామీ ఏమైంది చంద్రశేఖర్ రావూ జీ? అని చురకలంటించారు.
అవినీతిలో, రైతుల ఆత్మహత్యల విషయంలో తెలంగాణను దేశంలోనే నెంబర్ వన్ గా కేసీఆర్ చేశారని విమర్శించారు. తెలంగాణలో బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కారు వచ్చే సమయం ఆసన్నమైందని, డిసెంబరు 3న హైదరాబాదులో బీజేపీ జెండా రెపరెపలాడాలని బీజేపీ శ్రేణులకు షా పిలుపునిచ్చారు.
మరోవైపు కేసీఆర్ పై బండి సంజయ్ సెటైర్లు వేశారు. కేసీఆర్ తనకు గురువు అని, కేసీఆర్ ను చూసే తాను మాటలు నేర్చుకున్నానని ఆయన అన్నారు. కేసీఆర్ ఆరోగ్య సమాచారం వెల్లడించాలని, ఆయనను ప్రజలకు చూపించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ కనిపించకపోవడంతో తనకు చాలా బాధగా, కేటీఆర్ పై అనుమానంగా ఉందని, ఆయనకు భద్రతను కల్పించాలని కోరారు.
This post was last modified on October 10, 2023 9:48 pm
అవకాశాలు.. అదృష్టాలు.. పదే పదే రావని అంటారు. అవి వచ్చినప్పుడు వాటిని సద్వినియోగం చేసుకునేందుకు వ్యక్తులైనా పార్టీలైనా.. ఎవరైనా సరే..…
ఐపీఎల్ 2026 సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు అస్సలు కలిసి రావడం లేదు. వరుసగా రెండో ఓటమిని…
ఎన్నికలు సమీపిస్తున్నపుడు కొందరు రాజకీయ నాయకులకు ఎలివేషన్లు ఇస్తూ సినిమాలు వస్తుంటాయి. అలాగే కొందరు నేతలను టార్గెట్ చేస్తూ మూవీస్…
ఏపీ రాజధాని అమరావతిపై సీఎం చంద్రబాబుకు ఉన్న ముందుచూపు, తాజాగా రాజధాని బిల్లును ఆమోదించిన విధానం.. వంటివి చర్చకు వస్తున్నాయి.…
ఏప్రిల్ 8 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా రేసు గుర్రం రీ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే.…
కేరళ రాష్ట్రంలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫు స్టార్ క్యాంపెయినర్గా వ్యవహరిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి..…