తెలంగాణ శాసన సభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో ఎన్నికల వేడి రాజుకుంది. ఎన్నికలకు మరో 50 రోజుల గడువు మాత్రమే ఉండడంతో అన్ని ప్రధాన పార్టీలు అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా తెలంగాణలోని ఆదిలాబాద్ లో నిర్వహించిన బీజేపీ జన గర్జన సభకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ పై అమిత్ షా విమర్శలతో విరుచుకుపడ్డారు. “చంద్రశేఖర్ రావూ జీ” అంటూ షా చురకలంటించారు.
కేసీఆర్ గత పదేళ్లుగా తన కుటుంబం గురించే ఆలోచిస్తూ, రాష్ట్రంలోని దళితులు, గిరిజనులను పట్టించుకోలేదని ఆరోపించారు. తెలంగాణ పేదల సమస్యలు తీర్చడంలో విఫలమయ్యారని విమర్శించారు. ఆదివాసీలకు డబుల్ బెడ్రూం ఇళ్లు, గిరిజనులకు హామీలు గుప్పించిన కేటీఆర్ ఒక్కటైనా అమలు చేశారా? అని నిలదీశారు. కొందరికి దళితబంధు ఇచ్చి గొప్పలు చెప్పుకుంటున్నారని, దళితులకు మూడెకరాల భూమి హామీ ఏమైంది చంద్రశేఖర్ రావూ జీ? అని చురకలంటించారు.
అవినీతిలో, రైతుల ఆత్మహత్యల విషయంలో తెలంగాణను దేశంలోనే నెంబర్ వన్ గా కేసీఆర్ చేశారని విమర్శించారు. తెలంగాణలో బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కారు వచ్చే సమయం ఆసన్నమైందని, డిసెంబరు 3న హైదరాబాదులో బీజేపీ జెండా రెపరెపలాడాలని బీజేపీ శ్రేణులకు షా పిలుపునిచ్చారు.
మరోవైపు కేసీఆర్ పై బండి సంజయ్ సెటైర్లు వేశారు. కేసీఆర్ తనకు గురువు అని, కేసీఆర్ ను చూసే తాను మాటలు నేర్చుకున్నానని ఆయన అన్నారు. కేసీఆర్ ఆరోగ్య సమాచారం వెల్లడించాలని, ఆయనను ప్రజలకు చూపించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ కనిపించకపోవడంతో తనకు చాలా బాధగా, కేటీఆర్ పై అనుమానంగా ఉందని, ఆయనకు భద్రతను కల్పించాలని కోరారు.
టీడీపీ మహిళా నేత, ఏపీ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత… వైసీపీ యువ నేత, మాజీ మంత్రి గుడివాడ…
మంచు విష్ణు కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించిన ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప. విశేషం కేవలం…
విజయవాడలోని కృష్ణలంక ప్రాంతానికి చెందిన సాయికృష్ణ అనే యువకుడు లాకప్ డెత్ కు గురయ్యాడని తీవ్రస్థాయిలో ఆరోపణలు వస్తున్న సంగతి…
అమెరికానుంచి తరచుగా భారత్కు అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. వలస విధానానికి సంబంధించి, హెచ్-1బీ వీసాలకు సంబంధించి కూడా భారత్కు అమెరికా…
ఓ పరామర్శ అయినా, ఓ సాయం అయినా, ఓ ఓదార్పు అయినా, ఓ కేసు అయినా, ఓ పథకం అయినా……
ఇప్పుడు ప్రపంచంలో నంబర్ వన్ డైౌరెక్టర్ ఎవరు అని పోల్ పెడితే.. తిరుగులేని ఆధిక్యంతో క్రిస్టోఫర్ నోలనే గెలుస్తాడు అనడంలో…