టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుపై సీఎం జగన్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ప్రజల్లో ఉన్నా, జైలో ఉన్నా పెద్ద తేడా ఏమీ ఉండదని జగన్ షాకింగ్ కామెంట్లు చేశారు. చంద్రబాబుకు క్రెడిబులిటీ లేదని, విశ్వసనీయత లేని ఆయన ఎక్కడున్నా ఒక్కటే అని ఎద్దేవా చేశారు. చంద్రబాబును, ఆయన పార్టీని చూసినపుడు పేదలకు, ప్రజలకు..ఆయన చేసిన మోసాలు, వెన్నుపోట్లు, అబద్ధాలు, వంచనలు మాత్రమే గుర్తుకు వస్తాయని చురకలంటించారు. చంద్రబాబు మీద కక్ష లేదని, కక్షతో అరెస్టు చేయలేదు…చంద్రబాబు అరెస్టు జరిగిన సమయంలో తాను లండన్ లో ఉన్నానని జగన్ అన్నారు.
ఒకవేళ అదే నిజమనుకుంటే….కేంద్రంలో బీజేపీ ఉందని, బీజేపీతో తానున్నానని దత్తపుత్రుడు అంటున్నాడని, సగం బీజేపీ టీడీపీ మనుషులేనని, కానీ, చంద్రబాబు అరెస్టుపై కేంద్రం స్పందించలేదని అన్నారు. కేంద్రంలోని ఈడీ, ఐటీ అధికారులు విచారణ జరిపి దోషులను అరెస్టు చేసిందని, బాబుకు ఐటీ నోటీసులిచ్చారని అన్నారు. బాబు మీద మోడీ గారు అవినీతి ఆరోపణలు చేసినప్పుడు వైసీపీ ప్రతిపక్షంలో ఉందని అన్నారు. ఆనాడే చంద్రబాబు అవినీతి గురించి మోడీ విమర్శలు చేశారని గుర్తు చేశారు. అవినీతి కేసుల్లో ఆధారాలు లభించినా చంద్రబాబును అరెస్టు చేయకూడదని…ఆయనను కోర్టు రిమాండుకు పంపకూడదని..ఎల్లో మీడియా వాదనలు వినిపిస్తున్నాయని ఎద్దేవా చేశారు. చంద్రబాబును సమర్థించడమంటే పేద సామాజిక వర్గాలను వ్యతిరేకించడమే అన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని వైసీపీ నేతలకు సూచించారు.
This post was last modified on October 9, 2023 6:53 pm
సినిమాల్లో డ్యూయల్ రోల్స్ తో మెప్పించిన హీరో విజయ్ ఇప్పుడు రాజకీయ రంగంలోనూ అదే తరహాలో రెండు నియోజకవర్గాల నుంచి…
అమెరికా-ఇరాన్ యుద్ధం ఇప్పుడు కేవలం భూమి, ఆకాశానికే పరిమితం కాకుండా సముద్ర గర్భంలో ఉన్న ఇంటర్నెట్ వ్యవస్థపై కూడా నీలినీడలు…
రోటీన్ కు తగ్గట్లు వ్యవహరిస్తే కిక్ ఏముంటుంది? వినూత్న ఆలోచనలకు వేదికగా హైదరాబాద్ మహానగరం సాగుతోంది. ఇందులో భాగంగా సరికొత్త…
వసూళ్ల లెక్కల్లోనే కాదు చాలా విషయాల్లో దురంధర్ ది రివెంజ్ ఎవరికీ అందని రికార్డులు సొంతం చేసుకుంటోంది. భారతీయ సినీ…
నిన్న జరిగిన బ్యాండ్ మేళం సక్సెస్ మీట్ లో ఎక్కువ శాతం నటీనటులు, దర్శకుడు ఒక పాయింట్ మీద ఫిర్యాదు…
అనుకున్నది ఒకటి.. అవుతున్నది మరొకటి అన్నట్లుగా మారింది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీరు. ఇరాన్ తో మొదలు పెట్టిన యుద్ధాన్ని…