Political News

చంద్రబాబు జైల్లో ఉన్న జనంలో ఉన్నా ఒక్కటే: జగన్

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుపై సీఎం జగన్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ప్రజల్లో ఉన్నా, జైలో ఉన్నా పెద్ద తేడా ఏమీ ఉండదని జగన్ షాకింగ్ కామెంట్లు చేశారు. చంద్రబాబుకు క్రెడిబులిటీ లేదని, విశ్వసనీయత లేని ఆయన ఎక్కడున్నా ఒక్కటే అని ఎద్దేవా చేశారు. చంద్రబాబును, ఆయన పార్టీని చూసినపుడు పేదలకు, ప్రజలకు..ఆయన చేసిన మోసాలు, వెన్నుపోట్లు, అబద్ధాలు, వంచనలు మాత్రమే గుర్తుకు వస్తాయని చురకలంటించారు. చంద్రబాబు మీద కక్ష లేదని, కక్షతో అరెస్టు చేయలేదు…చంద్రబాబు అరెస్టు జరిగిన సమయంలో తాను లండన్ లో ఉన్నానని జగన్ అన్నారు.

ఒకవేళ అదే నిజమనుకుంటే….కేంద్రంలో బీజేపీ ఉందని, బీజేపీతో తానున్నానని దత్తపుత్రుడు అంటున్నాడని, సగం బీజేపీ టీడీపీ మనుషులేనని, కానీ, చంద్రబాబు అరెస్టుపై కేంద్రం స్పందించలేదని అన్నారు. కేంద్రంలోని ఈడీ, ఐటీ అధికారులు విచారణ జరిపి దోషులను అరెస్టు చేసిందని, బాబుకు ఐటీ నోటీసులిచ్చారని అన్నారు. బాబు మీద మోడీ గారు అవినీతి ఆరోపణలు చేసినప్పుడు వైసీపీ ప్రతిపక్షంలో ఉందని అన్నారు. ఆనాడే చంద్రబాబు అవినీతి గురించి మోడీ విమర్శలు చేశారని గుర్తు చేశారు. అవినీతి కేసుల్లో ఆధారాలు లభించినా చంద్రబాబును అరెస్టు చేయకూడదని…ఆయనను కోర్టు రిమాండుకు పంపకూడదని..ఎల్లో మీడియా వాదనలు వినిపిస్తున్నాయని ఎద్దేవా చేశారు. చంద్రబాబును సమర్థించడమంటే పేద సామాజిక వర్గాలను వ్యతిరేకించడమే అన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని వైసీపీ నేతలకు సూచించారు.

This post was last modified on October 9, 2023 6:53 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

11 seconds ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

2 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

5 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

8 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

11 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

11 hours ago