టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుపై సీఎం జగన్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ప్రజల్లో ఉన్నా, జైలో ఉన్నా పెద్ద తేడా ఏమీ ఉండదని జగన్ షాకింగ్ కామెంట్లు చేశారు. చంద్రబాబుకు క్రెడిబులిటీ లేదని, విశ్వసనీయత లేని ఆయన ఎక్కడున్నా ఒక్కటే అని ఎద్దేవా చేశారు. చంద్రబాబును, ఆయన పార్టీని చూసినపుడు పేదలకు, ప్రజలకు..ఆయన చేసిన మోసాలు, వెన్నుపోట్లు, అబద్ధాలు, వంచనలు మాత్రమే గుర్తుకు వస్తాయని చురకలంటించారు. చంద్రబాబు మీద కక్ష లేదని, కక్షతో అరెస్టు చేయలేదు…చంద్రబాబు అరెస్టు జరిగిన సమయంలో తాను లండన్ లో ఉన్నానని జగన్ అన్నారు.
ఒకవేళ అదే నిజమనుకుంటే….కేంద్రంలో బీజేపీ ఉందని, బీజేపీతో తానున్నానని దత్తపుత్రుడు అంటున్నాడని, సగం బీజేపీ టీడీపీ మనుషులేనని, కానీ, చంద్రబాబు అరెస్టుపై కేంద్రం స్పందించలేదని అన్నారు. కేంద్రంలోని ఈడీ, ఐటీ అధికారులు విచారణ జరిపి దోషులను అరెస్టు చేసిందని, బాబుకు ఐటీ నోటీసులిచ్చారని అన్నారు. బాబు మీద మోడీ గారు అవినీతి ఆరోపణలు చేసినప్పుడు వైసీపీ ప్రతిపక్షంలో ఉందని అన్నారు. ఆనాడే చంద్రబాబు అవినీతి గురించి మోడీ విమర్శలు చేశారని గుర్తు చేశారు. అవినీతి కేసుల్లో ఆధారాలు లభించినా చంద్రబాబును అరెస్టు చేయకూడదని…ఆయనను కోర్టు రిమాండుకు పంపకూడదని..ఎల్లో మీడియా వాదనలు వినిపిస్తున్నాయని ఎద్దేవా చేశారు. చంద్రబాబును సమర్థించడమంటే పేద సామాజిక వర్గాలను వ్యతిరేకించడమే అన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని వైసీపీ నేతలకు సూచించారు.
టాలీవుడ్లో చాలామంది వారసులు సక్సెస్ ఫుల్ హీరోలుగా నిలదొక్కుకున్నారు. వారిలో కొందరికి ఆరంభం నుంచే కలిసొచ్చింది. కొందరు కాస్త తడబడి…
నేచురల్ స్టార్ నాని కెరీర్ ఆరంభంలో పెద్ద హిట్ అయిన చిత్రాల్లో ‘పిల్ల జమీందార్’ ఒకటి. ఈ చిత్రంతోనే అశోక్ బాబు…
సినీ ఇండస్ట్రీలో స్టార్స్ పర్సనల్ లైఫ్ ఎలా ఉన్నా సరే.. ఒకరి ప్రొఫెషన్ ను మరొకరు గౌరవించుకోవడం ఎప్పుడూ పాజిటివ్…
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిల మధ్య ఏముందన్న…
రాజకీయ నేతలు...ప్రత్యేకించి జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఇతరత్రా ప్రముఖులపై తనదైన శైలి దూషణ భాషతో పేట్రేగిపోయిన జోసెఫ్…
డైరెక్టర్ కావాలన్న ఆశతో ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఏళ్లకు ఏళ్ళు కష్టపడి కొంత అనుభవం సంపాదించాక.. కథలు తయారు చేసుకుని హీరోలు,…