సంక్షేమ పథకాల ఫలాలు అర్హులందరికీ చేరాలని బీఆర్ఎస్ నేత, స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గ అభ్యర్థి కడియం శ్రీహరి అన్నారు. దళిత బంధు, గృహలక్ష్మి పథకాల కోసం లంచం అడుగుతున్నట్లు తన దృష్టికి వచ్చిందని, లబ్దిదారుల నుంచి కొందరు డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయని ఆయన అన్నారు. ఒక్క రూపాయి లంచం ఇవ్వాల్సిన అవసరం లేదని, లంచం అడిగితే తనకు చెప్పాలని కార్యకర్తలకు సూచించారు. అలా డబ్బులు వసూలు చేసే వారి బట్టలు ఊడదీయిస్తానని కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఎమ్మెల్యే రాజయ్య, పల్లా రాజేశ్వర్ రెడ్డి సహకారంతో స్టేషన్ ఘన్పూర్ అభివృద్ధి కోసం కృషి చేస్తానని అన్నారు. రాష్ట్రంలోనే స్టేషన్ ఘన్పూర్ను నెం.1గా తీర్చిదిద్దుతానని కడియం శ్రీహరి చెప్పారు. మరోవైపు కడియం శ్రీహరిపై స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. కడియం శ్రీహరి ఎందుకు అభద్రతాభావంలో ఉన్నారో తనకు అర్థం కావడంలేదని షాకింగ్ కామెంట్స్ చేశారు.
నియోజకవర్గంలో కష్టమైన పరిస్థితులున్నాయని, డప్పు కొట్టాలన్నా, ఫ్లెక్సీలు కట్టలన్నా ప్రజలు భయపడుతున్నారని చెప్పారు. నూతన పంచాయతీ భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న రాజయ్య ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే కడియం శ్రీహరి వర్సెస్ రాజయ్య అన్న రీతిలో చాలాకాలంగా మాటల యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో వారిద్దరి మధ్య సయోధ్యకు కేటీఆర్ ప్రయత్నించారు. ఇక, టికెట్ కూడా రాకపోవడంతో రాజయ్య కాస్త అసహనానికి లోనై ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది.
This post was last modified on October 8, 2023 10:04 pm
ఈటీవీ విన్.. పోస్టర్ మీద ఈ లోగో ఉంటే చాలు.. అది సినిమా అయినా, వెబ్ సిరీస్ అయినా అందులో…
సోషల్ మీడియాలో ఎప్పుడు ఏది ట్రెండింగ్ టాపిక్గా మారుతుందో.. దేని మీద నెటిజన్లు చర్చలు పెడతారో చెప్పలేం. కొన్నిసార్లు ఎప్పటివో…
ఏపీలో అధికార కూటమిలోని పార్టీల మధ్య తరచూ చిన్న చిన్న వివాదాలు చెలరేగుతున్నాయి. అయితే ఈ వివాదాలన్నీ ఆయా పార్టీల కీలక నేతల ప్రమేయం…
థియేటర్లలో రిలీజైనపుడు ఆశించిన స్పందన తెచ్చుకోకపోయినా.. కాల క్రమంలో కల్ట్ స్టేటస్ తెచ్చుకునే సినిమాలు కొన్ని ఉంటాయి. ‘ఈ నగరానికి…
జెనీలియా డిసౌజా.. ఈ పేరెత్తగానే తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడూ నవ్వుతూ కనిపించే అమ్మాయి గుర్తుకు వస్తుంది. ‘బొమ్మరిల్లు’లో హహ హాసిని…
తెలుగు రాష్ట్రాల మధ్య విభజన వ్యాఖ్యలపై మరోసారి చర్చ మొదలైంది. తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా…