Political News

నాగం త్యాగం చేశారా?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ సారి కచ్చితంగా నాగర్ కర్నూల్ నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేస్తానని చెబుతూ వస్తున్న సీనియర్ నాయకుడు నాగం జనార్ధన్ రెడ్డి వెనక్కి తగ్గారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇన్ని రోజులు టికెట్ కోసం పట్టుబట్టిన జనార్ధన్ రెడ్డి ఇప్పుడు శాంతించారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. రాజేశ్ రెడ్డి కోసం జనార్ధన్ రెడ్డి టికెట్ వదిలేసుకునేందుకు సిద్ధమయ్యారనే ప్రచారం జోరుగా సాగుతోంది.

నాగర్ కర్నూల్ నుంచి ఆరు సార్లు ఎమ్మెల్యేగా మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డి గెలిచారు. 1994 నుంచి 2012 ఉప ఎన్నికల వరకు వరుసగా అయిదు సార్లు ఆయనకు తిరుగన్నదే లేదు. కానీ 2014 నుంచి బీఆర్ఎస్ నాయకుడు మర్రి జనార్ధన్ రెడ్డి అక్కడ మకాం వేశారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన నాగం ఓటమి పాలయ్యారు. ఈ సారి కూడా కాంగ్రెస్ టికెట్ కోసం పట్టుబట్టారు. బీఆర్ఎస్ నుంచి వచ్చిన జూపల్లి క్రిష్ణారావు నాలుగైదు టికెట్లు కావాలని కోరడం సరికాదంటూ నాగం సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నాగర్ కర్నూల్ ను వదిలేది లేదని చెప్పారు.

కానీ ఇప్పుడు పరిస్థితులను అర్థం చేసుకున్న నాగం జనార్ధన్ రెడ్డి హైకమాండ్ సూచన మేరకు తగ్గారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇటీవల బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి తనయుడు రాజేశ్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు. నాగం సమ్మతితోనే రాజేశ్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో రాజేశ్ రెడ్డి విషయంలో నాగం జనార్ధన్ రెడ్డి సానుకూలంగా ఉన్నారనే ప్రచారం జోరందుకుంది. ఎన్నికల్లో టికెట్ విషయంలోనూ నాగం తగ్గారనే చెబుతున్నారు. రాజేశ్ రెడ్డికి టికెట్ ఇచ్చేందుకు పార్టీ సిద్ధమైన నేపథ్యంలో నాగం ఈ స్థానాన్ని త్యాగం చేశారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

This post was last modified on October 8, 2023 7:29 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ట్రెండీ కామెడీతో నవ్వించే మురారి

​సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…

10 minutes ago

సమంతలో పెళ్ళి తెచ్చిన కళ

ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…

47 minutes ago

సంతృప్తిలో ‘రెవెన్యూ’నే అసలు సమస్య.. ఏంటి వివాదం!

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…

1 hour ago

15 ఏళ్లుగా బ్రష్ చేయలేదు.. 35 ఏళ్లుగా సబ్బు ముట్టుకోలేదు..

ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…

2 hours ago

పవర్ స్టార్ ఇప్పుడు టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…

3 hours ago

మెగా మాస్ ఈజ్ బ్యాక్

మెగాస్టార్ చిరంజీవి.. పోస్టర్ మీద ఈ పేరు చూస్తే చాలు.. కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోయేవాళ్లు ఒకప్పుడు. ఆయన ఫ్లాప్…

3 hours ago