ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టు విషయంలో మరో తెలంగాణ మంత్రి గొంతు ఎత్తారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు సన్నిహితుడనే ముద్ర ఉన్న తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ, పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తాజాగా ఈ విషయంలో రియాక్టయ్యారు. చంద్రబాబు అరెస్ట్ చాలా బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 73 సంవత్సరాల వయసులో ఉన్న చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేయడం, విచారణ పేరుతో ఇబ్బందులకు గురి చేయడం సరికాదని తలసాని అభ్యంతరం వ్యక్తం చేశారు.
తాజాగా మీడియాతో మాట్లాడిన తలసాని శ్రీనివాస్ యాదవ్ టీడీపీ నేతగా ఉన్నప్పుడు మరియు ఉమ్మడి రాష్ట్రంలో పనిచేసిన నాటి సంఘటనలను గుర్తు చేసుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారని తలసాని తెలిపారు. చంద్రబాబు నాయుడి నాయకత్వంలో ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పని చేశానని పేర్కొంటూ బాబు అరెస్టు వ్యక్తిగతంగా తనకెంతో బాధను కలగచేసిందని తలసాని అభిప్రాయపడ్డారు. అధికారం శాశ్వతం కాదు అని హితవు పలికి తలసాని ఒకప్పుడు కేంద్ర రాజకీయాలలో కీలకపాత్ర పోషించిన సీనియర్ నాయకుడు అయిన చంద్రబాబు పట్ల ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు విచారకరమని అసహనం వ్యక్తం చేశారు.
కాగా, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అరెస్టు పట్ల ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు విచారం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి కేసీఆర్ మేనల్లుడు, మంత్రి హరీశ్ రావు తో పాటుగా మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, పువ్వాడ అజయ్, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి , పార్టీ ఎమ్మెల్యేలు చంద్రబాబు అరెస్టు పట్ల విచారం వ్యక్తం చేశారు.
This post was last modified on October 4, 2023 5:43 pm
బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో గత నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ అయి.. దీనిపై…
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…