Political News

పవన్ కు పోలీసుల నోటీసులు

కృష్ణాజిల్లా పెడనలో బుధవారం జరగనున్న జనసేన బహిరంగ సభలో రాళ్ల దాడి జరిగే అవకాశం ఉందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు పెను సంచలనం రేపిన సంగతి తెలిసిందే. రెండు మూడు వేల మంది వైసీపీ గూండాలు, క్రిమినల్స్ పెడన సభలోకి చొరబడి రాళ్లు, కత్తులతో దాడి చేసే ఛాన్స్ ఉందని పవన్ సంచలన ఆరోపణలు చేశారు. రేపు ఏం జరిగినా సీఎం జగన్, రాష్ట్ర డిజిపి, రాష్ట్ర హోంమంత్రి బాధ్యత వహించాలని పవన్ చేసిన కామెంట్లు కాక రేపాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా పవన్ కళ్యాణ్ కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఏ సమాచారం, ఆధారాలతో ఆ ఆరోపణలు చేశారో వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు.

పవన్ దగ్గర ఉన్న ఆధారాలు తమకు ఇవ్వాలని కోరారు. కానీ, పోలీసుల నోటీసులకు పవన్ కళ్యాణ్, జనసేన నేతలు సమాధానం ఇవ్వలేదు. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ పై కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా షాకింగ్ కామెంట్స్ చేశారు. సరైన ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం సరికాదని, బాధ్యతారహితంగా ఆరోపణలు చేస్తే పర్యవసానాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. పవన్ సభకు సరిపడా బందోబస్తు చేశామని, ఆ ఆరోపణలు చేసిన పవన్ తాము ఇచ్చిన నోటీసులపై ఇంతవరకు స్పందించలేదని అన్నారు. పవన్ వ్యాఖ్యలపై తాము పూర్తి విచారణ చేశామనిచ, ఆ ప్రాంతాన్ని పరిశీలించామని చెప్పారు.

పవన్ పై దాడి జరుగుతుందని ఆయనకు ఎలా తెలుసని జాషువా ప్రశ్నించారు. నోటీసులకు రిప్లై రాలేదని, దానిని బట్టి పవన్ వి నిరాధారమైన ఆరోపణలు అని అనుకోవాలా..? అంటూ ప్రశ్నించారు. పోలీసులకు సమాచార వ్యవస్ధ ఉందని, స్పెషల్ బ్రాంచ్ పోలీసులతో జల్లెడ పడుతున్నామని, కానీ అటువంటి అనుమానాస్పద విషయాలేమీ తమ దృష్టికి రాలేదని తెలిపారు. రెచ్చగొట్టే భాష, సైగలు, లా అండ్ ఆర్డర్ కు భంగం కలిగించే అంశాలుగా వాడడం మానుకోవాలని పవన్ కు సూచించారు. ప్రముఖ వ్యక్తులు, పోలీసు శాఖ, ఉన్నతాధికారుల మీద వ్యాఖ్యలు చేస్తే రికార్డు చేసి పరిశీలిస్తామని, రాజకీయ పార్టీలు ఇటువంటి ఆరోపణలు చేయద్దని అన్నారు.

This post was last modified on October 4, 2023 4:10 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

దెయ్యాన్ని ప్రేమించే ‘లవ్ మీ’ కుర్రాడు

https://www.youtube.com/watch?v=BacOcD8e_3k బాక్సాఫీస్ డ్రైగా ఉన్న టైంలో సరైన సినిమా కోసం మూవీ లవర్సే కాదు ట్రేడ్ మొత్తం ఎదురు చూస్తోంది.…

12 hours ago

రవితేజ సమస్యే నానికి వచ్చిందా

కథలు, కాంబోలు చూసేందుకు ఎంత బాగున్నా బడ్జెట్ విషయంలో ప్రాక్టికల్ గా ఆలోచించకపోతే చాలా సమస్యలు తలెత్తే పరిస్థితులను నిర్మాతలు…

14 hours ago

విశ్వంభరలో స్టాలిన్ అక్కయ్య

చిరంజీవి హీరోగా వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న విశ్వంభర షూటింగ్ ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్విరామంగా జరిగిపోతోంది. ఎన్నికలు ప్లస్ విదేశీ…

15 hours ago

151 కన్నా ఎక్కువ స్థానాలు గెలుస్తాం..ఐ-ప్యాక్ తో జగన్

ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ముగిసిన అనంతరం సీఎం జగన్ తొలిసారి బయటకు వచ్చారు. విజయవాడలోని ఐ-ప్యాక్ ఆఫీసును జగన్ సందర్శించారు.…

15 hours ago

జాన్వీకి చుక్కలు చూపించిన క్రికెట్

ఒకేసారి ఆర్ఆర్ఆర్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ సరసన రెండు వేర్వేరు ప్యాన్ ఇండియా సినిమాలతో గ్రాండ్ టాలీవుడ్…

16 hours ago

రియాక్షన్లు గమనిస్తున్నారా పూరి గారూ

నిన్న విడుదలైన డబుల్ ఇస్మార్ట్ టీజర్ పట్ల రామ్ అభిమానుల స్పందన కాసేపు పక్కనపెడితే సగటు ప్రేక్షకులకు మాత్రం మరీ…

18 hours ago