ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటన సందర్భంగా నిజామాబాద్ లో ఇందూరు గిరిజన కళాశాల ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే, ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ గురించి ఎవ్వరికీ తెలియని రహస్యాన్ని వెల్లడిస్తున్నానని అన్నారు. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బిజెపి ఎక్కువ స్థానాలు గెలిచిన ఆ తర్వాత కేసీఆర్ తనని కలిశారని మోడీ షాకింగ్ ఆరోపణలు చేశారు. ఎన్డీఏలో చేరతానని కేసీఆర్ తనతో అన్నారని మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ ను ఆశీర్వదించాలని కేసీఆర్ తనని కోరారని చెప్పారు.
అయితే, ప్రజలు ఆశీర్వదిస్తేనే నాయకులు గెలుస్తారని తాను చెప్పానని మోడీ గుర్తు చేసుకున్నారు. ఈ రహస్యాన్ని ఇంతకు ముందు ఎక్కడా చెప్పలేదని, జీహెచ్ఎంసి ఎన్నికల తర్వాతే తెలంగాణలో గట్టిగా పోటీ చేసి నిలబడాలని తాను అనుకున్నానని అన్నారు. తెలంగాణ అభివృద్ధికి బిజెపి కట్టుబడి ఉందని, ఆసుపత్రులు, రైల్వే లైన్లు, పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. తెలంగాణ ప్రజల్లో శక్తిసామర్ధ్యాలు మెండుగా ఉన్నాయని, ప్రపంచానికి కరోనా వ్యాక్సిన్ అందించిన ఘనత హైదరాబాద్ కే దక్కుతుందని చెప్పారు.
వేలాదిమంది బలిదానాలతో బంగారు తెలంగాణ కల సాకారమైందని, కానీ, కేసీఆర్ కుటుంబం రాష్ట్ర సంపదను దోచుకుంటుందని ఆరోపించారు. కేసీఆర్, ఆయన కొడుకు, కూతురు, మేనల్లుడు తెలంగాణ రాష్ట్రంలో ధనికులయ్యారని, ఈ కుటుంబ పాలనకు మరోసారి అవకాశం ఇవ్వొద్దని ప్రజలకు ప్రధాని పిలుపునిచ్చారు.
This post was last modified on October 3, 2023 10:59 pm
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…
మెగాస్టార్ చిరంజీవి.. పోస్టర్ మీద ఈ పేరు చూస్తే చాలు.. కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోయేవాళ్లు ఒకప్పుడు. ఆయన ఫ్లాప్…