ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటన సందర్భంగా నిజామాబాద్ లో ఇందూరు గిరిజన కళాశాల ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే, ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ గురించి ఎవ్వరికీ తెలియని రహస్యాన్ని వెల్లడిస్తున్నానని అన్నారు. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బిజెపి ఎక్కువ స్థానాలు గెలిచిన ఆ తర్వాత కేసీఆర్ తనని కలిశారని మోడీ షాకింగ్ ఆరోపణలు చేశారు. ఎన్డీఏలో చేరతానని కేసీఆర్ తనతో అన్నారని మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ ను ఆశీర్వదించాలని కేసీఆర్ తనని కోరారని చెప్పారు.
అయితే, ప్రజలు ఆశీర్వదిస్తేనే నాయకులు గెలుస్తారని తాను చెప్పానని మోడీ గుర్తు చేసుకున్నారు. ఈ రహస్యాన్ని ఇంతకు ముందు ఎక్కడా చెప్పలేదని, జీహెచ్ఎంసి ఎన్నికల తర్వాతే తెలంగాణలో గట్టిగా పోటీ చేసి నిలబడాలని తాను అనుకున్నానని అన్నారు. తెలంగాణ అభివృద్ధికి బిజెపి కట్టుబడి ఉందని, ఆసుపత్రులు, రైల్వే లైన్లు, పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. తెలంగాణ ప్రజల్లో శక్తిసామర్ధ్యాలు మెండుగా ఉన్నాయని, ప్రపంచానికి కరోనా వ్యాక్సిన్ అందించిన ఘనత హైదరాబాద్ కే దక్కుతుందని చెప్పారు.
వేలాదిమంది బలిదానాలతో బంగారు తెలంగాణ కల సాకారమైందని, కానీ, కేసీఆర్ కుటుంబం రాష్ట్ర సంపదను దోచుకుంటుందని ఆరోపించారు. కేసీఆర్, ఆయన కొడుకు, కూతురు, మేనల్లుడు తెలంగాణ రాష్ట్రంలో ధనికులయ్యారని, ఈ కుటుంబ పాలనకు మరోసారి అవకాశం ఇవ్వొద్దని ప్రజలకు ప్రధాని పిలుపునిచ్చారు.
This post was last modified on October 3, 2023 10:59 pm
ఈ వారం విడుదల కాబోతున్న వీరభద్రుడుకి హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశారు. దర్శకుడు ఆర్జె బాలాజీ కొన్ని…
సినిమా వాళ్లకు రాజకీయ ఆసక్తులు, అభిమానాలు ఉండడం కొత్త కాదు. అందులో తప్పు కూడా లేదు. ఐతే ఎప్పుడూ రాజకీయాల…
మొన్నటి దాకా జన నాయకుడు విడుదల మీద సవాలక్ష సందేహాలు. రెండు వారాల క్రితం ఏకంగా హెచ్డి ప్రింటుతో పైరసీ…
ఈ నెల 18 పెద్ది ట్రైలర్ విడుదల కానుంది. ముందు భోపాల్ అనుకున్నారు కానీ ఇప్పుడు ఈవెంట్ వేదికని ముంబైకి…
సూర్య వీరభద్రుడు ఇంకో మూడు రోజుల్లో విడుదల కానుంది. తమిళనాడులో రాజకీయ వాతావరణం వల్ల రిలీజ్ చేయాలా వద్దాని రెండు…
తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాక కొన్ని రోజుల పాటు నడిచిన డ్రామాకు ఆదివారం తెరపడి, ఆదివారం నాడు తమిళ…