కరోనాతో అల్లాడిపోతున్న మహారాష్ట్రలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రాయ్ గఢ్ జిల్లాలోని కాజల్ పురా ప్రాంతంలో ఓ భారీ భవనం ఉన్నట్లుండి కుప్పకూలిపోయింది. ఐదు అంతస్థుల ఈ భవనం పూర్తిగా కుప్పకూలిపోగా.. శిధిలాల కింద 75 మంది వరకూ చిక్కుకున్నట్టు తెలుస్తోంది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి. 25 మంది ప్రాణాలతో బయటపడగా.. ఇంకో 50 మంది శిథిలాల్లో చిక్కుకున్నట్లు సమాచారం. వారిలో చాలామంది మరణించి ఉంటారని భావిస్తున్నారు. తారిఖ్ గార్డెన్గా పేరున్న ఈ భవనం పదేళ్ల క్రితం నాటిది. 40 అపార్ట్మెంట్లున్నాయి.
సాయంత్రం ఆరు గంటల సమయంలో కుప్పకూలిందని పోలీస్ అధికారులు తెలిపారు. కూలిపోయే సమయంలో చాలామంది బయటకు పరుగులు తీసి ప్రాణాలు కాపాడుకున్నారు. ఇరుగ్గా ఉండే ఇళ్లలో ఎవరికి వారు తమ తమ పనుల్లో నిమగ్నమై ఉండగా.. భవనం ఒక్కసారిగా కుప్పకూలినట్లు తెలుస్తోంది. ఇంకో రెండు గంటల తర్వాత భవనం కూలి ఉంటే నష్టం ఇంకా తీవ్రంగా ఉండేదే. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదానికి కారణమేంటనేది ఇంకా తెలియలేదు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్ బలగాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు. ఈ దుర్ఘటనపై ఆయన విచారం వ్యక్తం చేశారు.
This post was last modified on August 24, 2020 10:19 pm
ఒకప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే ఉండి, ఆ పార్టీ తరఫున ఎంపీగా కూడా గెలిచిన రఘురామ కృష్ణం రాజు తర్వాత…
వైసీపీ అధినేత జగన్.. రాష్ట్రంలోని ఓ వర్గం మీడియాపై తరచుగా విమర్శలు చేయడంతోపాటు.. వాటిని గేలి కూడా చేస్తుంటారు. ఆయన…
ఒకప్పుడు మంచి స్నేహితులుగా ఉన్న తమిళ స్టార్ హీరో ధనుష్, అగ్ర కథానాయిక నయనతార.. కొన్ని కారణాల వల్ల శత్రువులుగా…
ఎప్పుడు ఎవరి కెరీర్ ఎలా మలుపు తిరుగుతుందో చెప్పలేం. తమిళ కుర్రాడు ప్రదీప్ రంగనాథన్కు... నాలుగేళ్ల ముందు వరకు తమిళనాడులోనే…
బీఆర్ ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ సీఎం కేసీఆర్ తనయ, మాజీ ఎంపీ కవిత ఈ నెలలో…
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) బ్యాటర్ల విధ్వంసం ముందు చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తోకముడిచింది. ఆదివారం జరిగిన మ్యాచ్లో…