టీడీపీ నాయకుడు బండారు సత్యనారాయణ మూర్తి వర్సెస్ మంత్రి ఆర్కే రోజా విషయంలో తలెత్తిన వివాదంలో సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వేలు పెట్టిన విషయం తెలిసిందే. బండారు సత్యనారాయణ మూర్తి నోరు పారేసుకున్నారని, ఒక మహిళ గురించి ఎవరైనా బయటి వ్యక్తులు ఇలా మాట్లాడతారా? అంటూ.. ఆయన వ్యాఖ్యానించారు. అయితే, మహిళల గురించి ఆర్జీవీ మాట్లాడడం ఆశ్చర్యంగా ఉందని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.
“మహిళల ఆత్మ గౌరవం గురించి వర్మ చెపితేనే వినాలి” అంటూ కొందరు నెటిజన్లు స్పందించారు. మరికొందరు.. వర్మ గురివింద నీతులు చెబుతున్నాడంటూ కామెంట్లు చేశారు. మంత్రి రోజా నోరు పారేసుకున్నప్పుడు వర్మ ఎక్కడున్నారంటూ ప్రశ్నించారు. అధికారంలో తమ పార్టీ వుంది కదా, ప్రతిపక్ష పార్టీ ఎవరన్నా ఏదన్నా అంటే కేసులు పెట్టడమే పనిగా చేస్తున్న అధికార పార్టీవాళ్లకి, ఆర్జీవీకి సదరు మంత్రిగారు మాట్లాడిన బాష, ఒకా మాజీ ముఖ్యమంత్రి అని కూడా చూడకుండా అతన్ని ఎంత నీచంగా మాట్లాడారో వినపడలేదా అని కొందరు ప్రశ్నించారు.
చంద్రబాబు సతీమణి భువనేశ్వరి గురించి వైసీపీ నాయకులు అత్యంత ఘోరంగా, అగౌరవంగా మాట్లాడినప్పుడు ఆర్జీవీ కి వినిపించలేదా? అప్పుడు మహిళా కమిషన్ గుర్తుకు రాలేదా అని మరికొందరు అడిగారు. ఈ క్రమంలోనే ఆర్జీవీ గతంలో ఒక యువతి కాళ్ళు నాకడం, చేతులు నాకటం, ఇంకా స్త్రీ యొక్క అవయవాల గురించి మాట్లాడటం వంటి పోస్టులను సోషల్ మీడియాలో పోస్టు చేయడం గమనార్హం. ఈ పరిణామాలను గమనించిన వారు ఆర్జీవీ అడ్డంగా బుక్కయ్యాడే అని వ్యాఖ్యానిస్తున్నారు.
This post was last modified on September 30, 2023 7:32 pm
ఉస్తాద్ భగత్ సింగ్ బయటికి చెప్పని కొన్ని సర్ప్రైజులు ఒక్కొక్కటిగా రివీల్ అవుతున్నాయి. తాజాగా మా ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో…
ఢిల్లీలో సోషల్ మీడియా పిచ్చి ఒక యువకుడి నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఇన్స్టాగ్రామ్ రీల్ కోసం తుపాకీతో స్టంట్ చేస్తూ…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాతీయలపై పట్టు పెంచుకునే విధంగా కార్యాచరణ ప్రారంభించిన…
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాకు ఇద్దరు టాప్ మ్యూజిక్ డైరెక్టర్లు పని చేసిన సంగతి తెలిసిందే. దేవిశ్రీ ప్రసాద్ పాటలు…
రేపు సాయంత్రం విడుదల కాబోతున్న దురంధర్ ది రివెంజ్ ని చివరి నిమిషం ఒత్తిళ్లు ఇబ్బంది పెడుతున్నాయని బాలీవుడ్ టాక్.…
ప్యాన్ ఇండియా సినిమాలు ఎంత బడ్జెట్ తో తీశామనేది ఎంత ముఖ్యమో వాటిని ఎంత బాగా ప్రమోట్ చేసుకుంటారనేది అంతకన్నా…