టీడీపీ నాయకుడు బండారు సత్యనారాయణ మూర్తి వర్సెస్ మంత్రి ఆర్కే రోజా విషయంలో తలెత్తిన వివాదంలో సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వేలు పెట్టిన విషయం తెలిసిందే. బండారు సత్యనారాయణ మూర్తి నోరు పారేసుకున్నారని, ఒక మహిళ గురించి ఎవరైనా బయటి వ్యక్తులు ఇలా మాట్లాడతారా? అంటూ.. ఆయన వ్యాఖ్యానించారు. అయితే, మహిళల గురించి ఆర్జీవీ మాట్లాడడం ఆశ్చర్యంగా ఉందని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.
“మహిళల ఆత్మ గౌరవం గురించి వర్మ చెపితేనే వినాలి” అంటూ కొందరు నెటిజన్లు స్పందించారు. మరికొందరు.. వర్మ గురివింద నీతులు చెబుతున్నాడంటూ కామెంట్లు చేశారు. మంత్రి రోజా నోరు పారేసుకున్నప్పుడు వర్మ ఎక్కడున్నారంటూ ప్రశ్నించారు. అధికారంలో తమ పార్టీ వుంది కదా, ప్రతిపక్ష పార్టీ ఎవరన్నా ఏదన్నా అంటే కేసులు పెట్టడమే పనిగా చేస్తున్న అధికార పార్టీవాళ్లకి, ఆర్జీవీకి సదరు మంత్రిగారు మాట్లాడిన బాష, ఒకా మాజీ ముఖ్యమంత్రి అని కూడా చూడకుండా అతన్ని ఎంత నీచంగా మాట్లాడారో వినపడలేదా అని కొందరు ప్రశ్నించారు.
చంద్రబాబు సతీమణి భువనేశ్వరి గురించి వైసీపీ నాయకులు అత్యంత ఘోరంగా, అగౌరవంగా మాట్లాడినప్పుడు ఆర్జీవీ కి వినిపించలేదా? అప్పుడు మహిళా కమిషన్ గుర్తుకు రాలేదా అని మరికొందరు అడిగారు. ఈ క్రమంలోనే ఆర్జీవీ గతంలో ఒక యువతి కాళ్ళు నాకడం, చేతులు నాకటం, ఇంకా స్త్రీ యొక్క అవయవాల గురించి మాట్లాడటం వంటి పోస్టులను సోషల్ మీడియాలో పోస్టు చేయడం గమనార్హం. ఈ పరిణామాలను గమనించిన వారు ఆర్జీవీ అడ్డంగా బుక్కయ్యాడే అని వ్యాఖ్యానిస్తున్నారు.
This post was last modified on September 30, 2023 7:32 pm
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…