Political News

అక్టోబర్ లో జగన్ కీలక సమావేశం

రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి పార్టీకి కూడా సమయం కేటాయించాలని డిసైడ్ అయ్యారు. ఇందులో భాగంగానే అక్టోబర్ 9వ తేదీన విజయవాడలో పార్టీ నేతలతో కీలకమైన మేథోమథనం సదస్సు నిర్వహించబోతున్నారు. ఈ సదస్సుకు అచ్చంగా నియోజకవర్గం, మండల స్ధాయి నేతలు హాజరవ్వబోతున్నారు. వై ఏపీ నీడ్స్ జగన్ అనే స్లోగన్ గురించి జగన్ ఆరోజు హాజరవ్వబోయే నేతలకు వివరించబోతున్నారు. ప్రతిపక్షంలో ఉన్నపుడు పార్టీ కార్యక్రమాలు మాత్రమే ఉంటాయి కాబట్టి పూర్తి సమయాన్ని అధినేతలు పార్టీ నేతలకే కేటాయిస్తారు.

అధికారంలోకి వచ్చిన తర్వాత సమయంలో ఎక్కువ భాగం పాలనా విషయాలకే సరిపోతుంది. కాబట్టి పార్టీ కార్యక్రమాలకు కచ్చితంగా సమయం కేటాయించడం సాధ్యం కాదు. అయితే ఎన్నికలు దగ్గరకు వస్తున్న నేపధ్యంలో అధినేతలు పలనా వ్యవహారాలను తగ్గించుకుని పార్టీపై దృష్టి పెట్టడం చాలా సహజం. అధికారంలో ఎవరున్నా చేసేదిదే కాబట్టి ఇందులో ఆశ్చర్యం కూడా ఏమీలేదు. అదే పద్ధతిలో రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇకపై పార్టీ మీద దృష్టిపెడుతున్నారు.

ఇందులో భాగంగానే 9వ తేదీన విజయవాడలో పెద్ద సదస్సు నిర్వహించబోతున్నారు. ఇందులో 175 నియోజకవర్గాల నుండి ద్వితీయ శ్రేణి నేతలు ఎక్కువగా హాజరు అవబోతున్నారు. మామూలుగా పార్టీ తరపున అభ్యర్ధులు గెలవాలంటే ద్వితీయశ్రేణి నేతల మద్దతు చాలా అవసరం. అందుకనే పార్టీకోసం పనిచేస్తున్న ఇలాంటి సుమారు 4 వేలమంది నేతలను గుర్తించి సమావేశానికి హాజరవ్వాలని పిలిచారు. 2024 ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రావాల్సిన అవసరాన్ని జగన్ నొక్కి చెప్పబోతున్నారు.

అలాగే నియోజకవర్గాల్లో పార్టీ పరిస్ధితి, మంత్రులు, ఎంఎల్ఏల పనితీరు మీద కూడా ఫీడ్ బ్యాక్ తీసుకుంటారని సమాచారం. పార్టీ గెలుపుకు అందరు కష్టపడాలని, కష్టపడే నేతలకు తగిన గుర్తింపు ఉంటుందని జగన్ హామీ ఇవ్వబోతున్నారు. నియోజకవర్గ, మండల స్ధాయి నేతలతో పాటు పార్టీకి అనుబంధ శాఖల్లోని కీలక నేతలు కూడా హాజరవ్వాలని జగన్ ఆదేశించారు. మొత్తానికి ఎప్పటినుండో అనుకుంటున్న ఈ సమావేశానికి ముహూర్తం ఫిక్సయ్యింది. ఇక నుండి పార్టీకే ఎక్కువ సమయాన్ని కేటాయించాలని జగన్ డిసైడ్ అయ్యారు. అంటే ముందు ముందు ఇలాంటి సమావేశాలు మరిన్ని ఉండబోతున్నాయనే అనుకోవాలి.

Satya

Recent Posts

దాసరి స్మృతి వనం… కదిలిపోయిన మనోజ్

తెలుగు సినీ చరిత్రలోనే అత్యంత గొప్ప దర్శకుల్లో ఒకరు దాసరి నారాయణరావు. అగ్ర దర్శకుడిగా ఉంటూ 150 సినిమాలు తీయడం…

19 minutes ago

3 రోజులుగా పార్టీ ఆపీస్ లోనే మాజీ ఎంపీ

తెలంగాణ రాజధాని హైదరాబాద్ లోని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కార్యాలయం వద్ద శనివారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బీఆర్ఎస్…

34 minutes ago

పరీక్షల వలయంలో పెద్ది ప్రయాణం

పెద్ది సినిమాలో రామ్ చరణ్ పాత్ర రకరకాల ఆటలు ఆడుతుంది. క్రికెట్, పరుగు పందెం, కుస్తీ ఇలా అన్ని గేమ్స్…

1 hour ago

రోడ్డు పక్కన నిలబడి ఆకర్షిస్తే.. ఏం జరుగుతుంది?

శుక్రవారం రాత్రి మొదలు ఈ రోజు ఉదయాన అందుబాటులోకి వచ్చిన దినపత్రికల్లో పేర్కొన్న సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు నేపథ్యంలో కొత్త…

3 hours ago

పుష్ప-3… నమ్మొచ్చా?

పుష్ప సినిమా మొదలైనపుడు దాన్ని ఒక్క పార్ట్‌గానే రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ సినిమా మధ్యలో ఉండగా దాన్ని రెండు భాగాలు…

4 hours ago

తెలంగాణలో అదనపు రేట్లు… ఇక కలేనా?

ఇప్పుడు టాలీవుడ్లో ఏదైనా సినిమా వేడుక జరిగిందంటే చాలు.. అందులో పరిశ్రమ కష్టాల గురించి తప్పకుండా ప్రస్తావన ఉంటుంది. తెలుగు…

5 hours ago