Political News

లోకేష్ తన నిర్ణయం ఎందుకు మార్చుకున్నారు?

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర దిగ్విజయంగా కొనసాగిన సంగతి తెలిసిందే. లోకేష్ పాదయాత్రకు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక వైసీపీ నేతలు పోలీసుల సాయంతో ఎన్నో అడ్డంకులు సృష్టించేందుకు ప్రయత్నించారు. కానీ, వాటన్నిటిని అధిగమించి కదం తొక్కుతూ ముందుకు సాగిన లోకేష్ 200 రోజుల పాదయాత్రను పూర్తి చేసుకున్నారు. అయితే, చంద్రబాబు అరెస్టు తర్వాత పాదయాత్రకు లోకేష్ హఠాత్తుగా విరామం ప్రకటించాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే రేపటి నుంచి పాదయాత్రను పునః ప్రారంభించాలని లోకేష్ నిర్ణయించుకున్నారు. మరికొద్ది నెలల్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉండడంతో ఈ లోపు పాదయాత్ర పూర్తి చేసి ప్రజలతో మమేకం కావాలని లోకేష్ నిర్ణయించుకున్నారు.

అయితే, తాజాగా లోకేష్ తన నిర్ణయం మార్చుకుని పాదయాత్రను వాయిదా వేశారు. టీడీపీ నేతలతో సమావేశమైన లోకేష్ ఈ నిర్ణయం తీసుకున్నారు. పాదయాత్ర తేదీ వాయిదా వేయాలని వారంతా సూచించడంతో లోకేష్ అందుకు అంగీకరించారు. అక్టోబర్ మూడో తేదీన చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో వాదనలు జరగనున్న నేపథ్యంలో లాయర్లతో ఢిల్లీలో చర్చలు జరిపేందుకు లోకేష్ అక్కడ ఉంటే బాగుంటుందని టిడిపి నేతలు అభిప్రాయపడ్డారు. దాంతోపాటు, చంద్రబాబును మరిన్ని కేసులలో కస్టడీకి సిఐడి కోరుతోంది. దీంతో, మరికొద్ది రోజులపాటు చంద్రబాబు రిమాండ్ లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది.

ఈ పరిణామాన్నిటినీ లోకేష్ తో చర్చించిన తర్వాత పాదయాత్రను వాయిదా వేస్తే బాగుంటుందని టిడిపి నేతలు అభిప్రాయపడ్డారు. త్వరలోనే పాదయాత్ర చేయబోయే తేదీని లోకేష్ ప్రకటించనున్నారు. గత కొద్ది రోజులుగా ఢిల్లీలో మకాం వేసిన లోకేష్ జాతీయ స్థాయిలో చంద్రబాబు అక్రమ అరెస్టుపై గళం విప్పిన సంగతి తెలిసిందే. పలు పార్టీలకు చెందిన జాతీయ స్థాయి నేతలతో భేటీ అయిన లోకేష్ జగన్ అక్రమాల గురించి వారికి వివరించారు.

This post was last modified on September 28, 2023 9:07 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

వంట సామాగ్రితో రెడీగా ఉండండి… దీదీ హాట్ కామెంట్స్!

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర పరిశీలన వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ…

2 hours ago

రోడ్లకు మహర్దశ… పవన్ కు మంత్రుల అభినందనలు

ఆంధ్రప్రదేశ్ రహదారుల అభివృద్ధికి మహర్దశ వచ్చింది. పంచాయతీరాజ్‌ శాఖ రాష్ట్రవ్యాప్తంగా 157 నియోజకవర్గాల్లో మొత్తం 1299 రహదారి నిర్మాణ–మరమ్మతు పనులను…

5 hours ago

చావు భయంలో ఎలన్ మస్క్

ఎప్పుడూ ట్విట్టర్ లో, బయట హడావిడి చేసే ఎలన్ మస్క్ ఇప్పుడు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ఇది ఆయనకి ఆయనగా…

5 hours ago

కార్యకర్తలతో చంద్రబాబు… కాఫీ కబుర్లు

తెలుగుదేశం పార్టీ ఒక కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.   'కాఫీ కబుర్లు' పేరుతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం కార్యకర్తల్లో…

6 hours ago

ప్రశ్నార్థకంగా మారుతున్న రామ్ సెలక్షన్

ఆంధ్రకింగ్ తాలూకా ఫైనల్ రన్ అయిపోయింది. పాజిటివ్ రివ్యూలు, బాగుందని చెప్పిన పబ్లిక్ టాక్స్ ఇవేవి పట్టుమని మూడు వారాల…

7 hours ago

సెన్సారుకి సారీ… మంచి సాంప్రదాయం

నిన్న జరిగిన మోగ్లీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విలన్ గా నటించిన బండి సరోజ్ కుమార్ సెన్సార్ బోర్డుని…

8 hours ago