స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ తో పాటు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కేసు, ఏపీ ఫైబర్ గ్రిడ్ కేసు, అంగళ్లు అల్లర్ల కేసులో టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రాజమండ్రి సెంట్రల్ జైల్లో గత 18 రోజులుగా చంద్రబాబు జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్నారు. చంద్రబాబు బెయిల్ కస్టడీ, ముందస్తు బెయిల్ లపై ఏసీబీ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పలు పిటిషన్లపై విచారణ కొనసాగుతోంది. ఇదిలా ఉండగానే టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి, టిడిపి అగ్రనేత నారా లోకేష్ కూడా అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో అరెస్టు కాబోతున్నారంటూ కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది.
ఈ నేపథ్యంలోనే ఆ ప్రచారానికి తగ్గట్టుగా తాజాగా ఆ కేసులో లోకేష్ ను ఏ14 గా సిఐడి పేర్కొనడం సంచలనం రేపింది. తాజాగా ఏసీబీ కోర్టులో సిఐడి దాఖలు చేసిన మెమోలో లోకేష్ ను నిందితుడిగా సిఐడి చేర్చడం చర్చనీయాంశమైంది. ఈ కేసులో ఇప్పటికే చంద్రబాబుతో పాటు మాజీ మంత్రి పొంగూరు నారాయణ, లింగమనేని రమేష్, లింగమనేని రాజశేఖర్ తదితరుల పేర్లను ఎఫ్ఐఆర్లో సీఐడీ చేర్చిన సంగతి తెలిసిందే. మరోవైపు, జగన్ పై లోకేష్ విమర్శలు గుప్పించారు. జనం రోడ్డు ఎక్కితే జగన్ జడుసుకుంటున్నారని, నిరసనలు అంటేనే ఉలిక్కిపడుతున్నాడని ఎద్దేవా చేశారు.
నిరసనలపై ప్రభుత్వం అణచివేత ధోరణి అవలంబిస్తోందని, ప్రశ్నించే గళాలను చూసి భయపడుతోందని ఆరోపించారు. తమ సమస్యల పరిష్కారం కోసం రోడ్డెక్కిన అంగన్వాడీలను నిర్భంధించడం దుర్మార్గమని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సమస్యల పరిష్కారం కోసం, డిమాండ్ల సాధన కోసం విజయవాడలో ధర్నాకు దిగిన అంగన్వాడీలను ధర్నా చౌక్ కు వెళ్లకుండా పోలీసులు ఈడ్చుకొని మరి అరెస్టు చేసిన వైనం సంచలనం రేపింది. ఆ వ్యవహారంపైనే లోకేష్ స్పందించారు.
This post was last modified on September 26, 2023 5:06 pm
జంతర్ మంతర్లో కాక్రోచ్ జనతా పార్టీ చేసిన ఆందోళన విరమించినప్పటికీ అది సృష్టించిన తుఫాన్ కొనసాగుతుంది. సద్దుమణిగిందనుకున్న విషయాన్ని శుక్రవారం…
చెన్నై లవ్ స్టోరీ పోస్ట్ రిలీజ్ ప్రమోషన్లలో యూనిట్ సభ్యులు కొందరు వాడిన మాట ఒకటుంది. అదే కిరణ్ అబ్బవరం హ్యాట్రిక్…
ఆ మధ్య జరిగిన లెనిన్ సక్సెస్ మీట్ లో కింగ్ నాగార్జున ఒక మాట అన్నారు. ది ఒడిస్సి లాంటి…
భారత దేశ రాజకీయాల్లో ఎన్నో పార్టీలు పుడుతున్నాయి. ఆ వెంటనే కనుమరుగు అవుతున్నాయి. ఎక్కడో ఒకటి అరా పార్టీలు కొనసాగుతున్నా... అవన్నీ దాదాపుగా…
టాలీవుడ్లో క్యారెక్టర్ రోల్స్ తో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి సురేఖా వాణి. వందల సంఖ్యలో సినిమాలు చేసిన ఆమెకు…
సూర్య, వెంకీ అట్లూరి కాంబినేషన్ లో తెరకెక్కిన 'విశ్వనాథ్ అండ్ సన్స్' సినిమా ఈ నెల 14న థియేటర్లలోకి రానుంది.…