స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ తో పాటు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కేసు, ఏపీ ఫైబర్ గ్రిడ్ కేసు, అంగళ్లు అల్లర్ల కేసులో టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రాజమండ్రి సెంట్రల్ జైల్లో గత 18 రోజులుగా చంద్రబాబు జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్నారు. చంద్రబాబు బెయిల్ కస్టడీ, ముందస్తు బెయిల్ లపై ఏసీబీ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పలు పిటిషన్లపై విచారణ కొనసాగుతోంది. ఇదిలా ఉండగానే టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి, టిడిపి అగ్రనేత నారా లోకేష్ కూడా అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో అరెస్టు కాబోతున్నారంటూ కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది.
ఈ నేపథ్యంలోనే ఆ ప్రచారానికి తగ్గట్టుగా తాజాగా ఆ కేసులో లోకేష్ ను ఏ14 గా సిఐడి పేర్కొనడం సంచలనం రేపింది. తాజాగా ఏసీబీ కోర్టులో సిఐడి దాఖలు చేసిన మెమోలో లోకేష్ ను నిందితుడిగా సిఐడి చేర్చడం చర్చనీయాంశమైంది. ఈ కేసులో ఇప్పటికే చంద్రబాబుతో పాటు మాజీ మంత్రి పొంగూరు నారాయణ, లింగమనేని రమేష్, లింగమనేని రాజశేఖర్ తదితరుల పేర్లను ఎఫ్ఐఆర్లో సీఐడీ చేర్చిన సంగతి తెలిసిందే. మరోవైపు, జగన్ పై లోకేష్ విమర్శలు గుప్పించారు. జనం రోడ్డు ఎక్కితే జగన్ జడుసుకుంటున్నారని, నిరసనలు అంటేనే ఉలిక్కిపడుతున్నాడని ఎద్దేవా చేశారు.
నిరసనలపై ప్రభుత్వం అణచివేత ధోరణి అవలంబిస్తోందని, ప్రశ్నించే గళాలను చూసి భయపడుతోందని ఆరోపించారు. తమ సమస్యల పరిష్కారం కోసం రోడ్డెక్కిన అంగన్వాడీలను నిర్భంధించడం దుర్మార్గమని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సమస్యల పరిష్కారం కోసం, డిమాండ్ల సాధన కోసం విజయవాడలో ధర్నాకు దిగిన అంగన్వాడీలను ధర్నా చౌక్ కు వెళ్లకుండా పోలీసులు ఈడ్చుకొని మరి అరెస్టు చేసిన వైనం సంచలనం రేపింది. ఆ వ్యవహారంపైనే లోకేష్ స్పందించారు.
This post was last modified on September 26, 2023 5:06 pm
ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన ‘మన శంకర వరప్రసాద్’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్బస్టర్ అయ్యే దిశగా దూసుకెళ్తోంది.…
మన శంకరవరప్రసాద్ గారు రిలీజయ్యాక చాలా మందికి కలిగిన సందేహం ఒకటుంది. చిరంజీవి, నయనతార లవ్ ఎపిసోడ్స్ లో బ్యాక్…
తమిళ దిగ్గజ నటుడు, తమిళగ వెట్రి కగళం(టీవీకే) అధ్యక్షుడు విజయ్ వ్యవహారం.. మరింత ముదురుతోంది. గత ఏడాది సెప్టెంబరు 27న…
రికార్డులు బద్దలు కొట్టేస్తుందని అభిమానులు గంపెడాశలు పెట్టుకున్న ది రాజా సాబ్ ఫలితం చూస్తున్నాం. ఆడియన్స్ ని పూర్తి స్థాయిలో…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత గ్రామం.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నారావారి పల్లెలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.…
గత కొన్నేళ్లుగా మినిమమ్ హిట్ లేకుండా అభిమానులను హర్ట్ చేస్తున్న మాస్ మహారాజా రవితేజ ఈసారి పూర్తిగా రూటు మార్చి…