Political News

ఈ అమ్మాయి క‌థ చ‌దివి తీరాల్సిందే

అన్ని సౌక‌ర్యాలూ ఉంటాయి. దేనికీ లోటుండ‌దు. శుభ్రంగా చ‌దువుకోమంటే చాలామందికి శ్ర‌ద్ధ ఉండదు. ఇంకొంత‌మందేమో.. సౌక‌ర్యాల లేమిని, ఆర్థిక ఇబ్బందులనే సాకుగా చూపించి స‌రిగా చ‌ద‌వ‌రు. కానీ మ‌హారాష్ట్ర‌కు చెందిన స్వ‌ప్నాలి సుతార్ మాత్రం అలా కాదు.

ఆమెకు ఎటు చూసినా ఇబ్బందులే. కానీ అవేవీ ఆమె చ‌దువులో అద్భుతాలు చేయ‌నివ్వ‌కుండా ఆప‌లేదు. మారు మూల అట‌వీ ప్రాంతంలో పుట్టిన గిరిజ‌న అమ్మాయి స్వ‌ప్నాలి. త‌న‌ది పేద కుటుంబం. త‌ల్లిదండ్రులు క‌ష్టం చేసి బ‌తుకు సాగిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందుల‌కు తోడు.. ప‌ట్నానికి వెళ్లి చ‌దువుకోవ‌డానికి స‌రైన రోడ్డు కూడా లేని ప‌రిస్థితి స్వ‌ప్నాలిది.

అయితేనేం 12 తరగతిలో 98% స్కోర్ చేసిన‌ స్వప్నాలి .. ఇప్పుడు వెట‌ర్న‌రీ క‌ళాశాల‌లో చ‌దువుకుంటోంది. వెట‌ర్న‌రీ డాక్ట‌ర్ కావాల‌న్న ల‌క్ష్యంతో అడుగులేస్తున్న ఆమెకు లాక్ డౌన్ బ్రేక్ వేసింది. కాలేజీకి వెళ్లే ప‌రిస్థితి లేదు. మిగతా విద్యార్థులంద‌రూ ఇంటి ద‌గ్గ‌రే ఉంటూ ఇంటర్నెట్ సౌక‌ర్యంతో ఆన్ లైన్ క్లాసులు అటెండ్ అవుతున్నారు. చ‌క్క‌గా చ‌దువుకుంటున్నారు. కానీ స్వ‌ప్నాలి ఉంటున్న‌ గ్రామానికి ఇంటర్నెట్ కనెక్టివిటీనే లేదు. ఫోన్లో సిగ్న‌ల్ కూడా రాదు.

దీంతో ఏం చేయాలో పాలుపోని ప‌రిస్థితుల్లో కొన్ని రోజుల పాటు ఐదు కిలోమీట‌ర్ల దూరం న‌డిచి వెళ్లి ఇంట‌ర్నెట్ వ‌చ్చే చోట చ‌దువుకునేది. కానీ అలా ఎక్కువ రోజులు చేయ‌లేక‌పోయింది. పైగా ఇది వ‌ర్షాకాలం కావ‌డంతో మ‌రింత ఇబ్బంది త‌లెత్తింది. దీంతో స్వ‌ప్నాలి సోద‌రులు ఆమె కోసం గ్రామానికి దగ్గరలో ఒక కొండపై ఒక షెడ్ నిర్మించారు. అక్కడ ఆమె ఫోన్ కు ఇంటర్నెట్ సిగ్నల్ వస్తుంది. అక్కడే రోజూ ఉదయం 7 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు చదువుకుని ఇంటికి చేరుతోంది స్వ‌ప్నాలి.

త‌న గురించి మీడియాలో రావ‌డంతో చాలామంది సాయం చేయ‌డానికి ముందుకొచ్చారు. స్థానిక ఎమ్మెల్యే రూ.50 వేల ఆర్థిక సాయం కూడా అందించాడు. లాక్ డౌన్ హీరో సోనూ సూద్ సైతం ఈ అమ్మాయి గురించి స్పందించడం విశేషం. స్వప్నాలి ఊర్లో వైఫై వస్తుందని అతను హామీ ఇచ్చాడు.

This post was last modified on August 24, 2020 10:31 am

Share

Recent Posts

పోటీకి సిద్ధంకండి… పొత్తు సంగతి నేను చూసుకుంటాను

స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యకర్తలు, నాయకులకు కీలక…

2 hours ago

తిరుమలలో ‘రోబోట్‌ డాగ్‌’… వాటి కదలికలపై నిఘా!

తిరుమల అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతోపాటు, భక్తుల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు టీటీడీ ఆధునిక సాంకేతిక…

2 hours ago

అప్పట్లో చిరు ఏడాదికి నాలుగు సినిమాలు చేసినా గొడవే

ఇప్పుడు పెద్ద హీరోల నుంచి ఏడాదికో సినిమా వస్తే ఆశ్చర్యపోయే పరిస్థితి ఉంది. ఒక్క ప్రభాస్‌ను పక్కన పెడితే.. అల్లు…

9 hours ago

దీపికా విషయంలో సందీప్ వంగానే కరెక్ట్

ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న స్పిరిట్ షూటింగ్ మొదలుకాక ముందు హాట్ టాపిక్ గా మారింది…

10 hours ago

హృద‌య విదార‌కం… టీచ‌ర్ దెబ్బ‌కు ప్రాణం వ‌దిలిన పిల్లాడు

పిల్ల‌ల విష‌యంలో త‌ల్లిదండ్రులైనా, ఉపాధ్యాయులైనా ఎంత సున్నితంగా వ్య‌వ‌హ‌రించాలో చెప్పే ఉదంత‌మిది. విద్యార్థుల‌ను క్ర‌మ‌శిక్ష‌ణ‌లో పెట్టాల‌ని, వారిలో భ‌యం పెంచాల‌ని…

11 hours ago

యాక్సిడెంట్ కేసులో జనసేన ఎంపీ తనయుడు

హైదరాబాద్ మాదాపూర్ ఇనార్బిట్ మాల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో భారతి అనే 26 ఏళ్ల యువతి మృతి చెందిన…

12 hours ago