Political News

మైనంప‌ల్లి ప్లేస్‌లోకి ముగ్గురు లీడ‌ర్ల‌ను రెడీ చేసిన కేసీఆర్‌

గ‌త కొద్దికాలంగా జ‌రుగుతున్న చ‌ర్చ‌కు తెర దించుతూ మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పేస్తూ కీల‌క నిర్ణ‌యం తీసుకున్న సంగ‌తి తెలిసిందే. వీడియో మెసేజ్ రిలీజ్ చేసిన మైనంపల్లి హనుమంతరావు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు తెలియ‌జేయ‌డ‌మే కాకుండా త్వ‌ర‌లోనే తాను ఓ పార్టీలో చేర‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. అయితే, మైనంప‌ల్లి బ‌దులుగా మ‌ల్కాజ్‌గిరి నియోజ‌క‌వ‌ర్గం నుంచి బ‌రిలో దిగ‌బోయే నేత ఎవ‌ర‌నే చ‌ర్చ జ‌రుగుతుంది. అయితే, ఇప్పుడు ఇప్ప‌టికే బీఆర్ఎస్ పార్టీ ఓ ముగ్గురు నేత‌ల‌ను బ‌రిలో దింపిన‌ట్లు స‌మాచారం.

మైనంప‌ల్లి రాజీనామాతో మ‌ల్కాజ్‌గిరి నియోజ‌క‌వ‌ర్గం నుంచి బ‌రిలో దింపే బీఆర్ఎస్ నేత ఎవ‌ర‌నే చ‌ర్చ స‌హ‌జంగానే జ‌రుగుతోంది. అయితే, ఇప్ప‌టికే బీఆర్ఎస్ పార్టీ ముగ్గురు నేత‌ల‌ను గుర్తించింద‌ని స‌మాచారం. మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డి బీఆర్ఎస్ మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే అభ్యర్థిగా బ‌రిలో ఉంటార‌ని టాక్ వినిపిస్తోంది. ఇదే స‌మ‌యంలో మ‌రో పేరు సైతం తెర‌మీద‌కు వ‌స్తోంది. మల్కాజ్‌గిరి కాంగ్రెస్ నేత నందికంటి శ్రీధర్ బీఆర్ఎస్ పార్టీలో చేర‌నున్నార‌ని మ‌ల్కాజ్‌గిరి నుంచి బ‌రిలో దిగేలా క‌స‌ర‌త్తు దాదాపు ఫైనల్ అయింద‌ని అంటున్నారు. కాగా, మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్ త‌ర‌ఫు నుంచి సైతం ఓ పేరు ప్ర‌తిపాద‌న‌లో ఉన్న‌ట్లు స‌మాచారం.

మర్రి రాజ‌శేఖ‌ర్ రెడ్డి మంత్రి మ‌ల్లారెడ్డి త‌ర‌ఫున ప్ర‌తిపాద‌న‌లో ఉండ‌గా, గతంలో టీడీపీలో చాలా కాలం పాటు పని చేసిన వ్యక్తి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దగ్గరి బంధువు అయిన మండలి రాధకృష్ణా యాదవ్ సైతం ఆశావ‌హుల్లో ఉన్న‌ట్లు స‌మాచారం. మరో వైపు ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ నేత , బీసీ నందికంటి శ్రీధర్ పై గురి పెట్టిన బీఅర్ఎస్ పార్టీ ఆయ‌న అభ్య‌ర్థిత్వాన్ని ప‌రిశీలిస్తున్న‌ట్లు చెప్తున్నారు. మొత్తంగా మైనంప‌ల్లి ఎపిసోడ్‌కు ఫుల్ స్టాప్ ప‌డిన నేప‌థ్యంలో బీఆర్ఎస్ త‌మ త‌దుప‌రి కార్యాచ‌ర‌ణ మొద‌లుపెట్టిన‌ట్లు స‌మాచారం.

This post was last modified on September 23, 2023 11:38 am

Share
Show comments

Recent Posts

ప్రాంతీయ పార్టీల్లో టీడీపీదే అగ్రస్థానం

దేశ రాజకీయాల్లో జాతీయ పార్టీలదే ఆధిపత్యం కనిపిస్తున్నా.. రాష్ట్రాల రాజకీయాలను ప్రభావితం చేసేది మాత్రం ఇప్పటికీ ప్రాంతీయ పార్టీలేనని తాజా…

34 minutes ago

‘పాదయాత్ర చేసినా వైఎస్ వారసులు కాలేరు’

వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై ఆయ‌న సోద‌రి, కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్య‌క్షురాలు ష‌ర్మిల మ‌రోసారి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. పాద‌యాత్ర…

48 minutes ago

ఈ బీజేపీ ఎంపీకి ఏమైంది?

ధర్మపురి అరవింద్.. తండ్రి కాంగ్రెస్ పార్టీతో ఉన్నా తాను మాత్రం బీజేపీలో సొంతంగా ఎంపీ స్థాయికి ఎదిగిన నేత. బీఆర్ఎస్…

1 hour ago

కొణిదెల నిహారిక: ఫ్రేమ్ మారినా, గ్లామర్ మాత్రం అలాగే..

యాంకర్‌గా మొదలై, హీరోయిన్‌గా తెరపై కనిపించి, ఇప్పుడు నిర్మాతగా మారింది నిహారిక కొణిదెల. ప్రతి దశలోనూ కొత్తగా ట్రై చేస్తూనే…

1 hour ago

తారక్ అభిమానులు లైట్ తీసుకున్నారు

స్టార్ హీరోల ఫ్యాన్స్ ఎమోషన్స్ క్యాష్ చేసుకోవడానికి ఈ మధ్య డిస్ట్రిబ్యూటర్లు వాడుతున్న ఆయుధం రీ రిలీజులు. ఏదో కొత్త…

4 hours ago

బీజేపీ కేంద్ర మంత్రికి కాంగ్రెస్ ఎంపీ మద్దతు

బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి ఫ్యామిలీ ఇప్పుడు పెను వివాదంలో చిక్కుకుంది. మంత్రి కుమారుడు బండి భగీరథ్ ఓ…

4 hours ago