పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు మొదలై ముగిసిపోయాయి. 18వ తేదీన మొదలైన సమావేశాలు 22వ తేదీన ముగిశాయి. జమిలి ఎన్నికలు, ముందస్తు ఎన్నికలు, మహిళా రిజర్వేషన్ బిల్లంటు నానా గోల జరిగింది. వీటికోసం ప్రత్యేక పార్లమెంటు సమావేశాలంటు దేశ రాజకీయాల్లో నానా హడావుడి జరిగింది. దాంతో ఇండియాకూటమితో పాటు తెలంగాణాలో కేసీయార్ కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. కేసీయార్ ఇబ్బందులకు కారణం ఏమిటంటే దాదాపు నెలరోజుల క్రితమే అభ్యర్ధులను ప్రకటించేయటం.
జమిలి ఎన్నికలన్నా, ముందస్తు ఎన్నికలన్నా, మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమల్లోకి వస్తే కేసీయార్ బాగా ఇబ్బందులు పడేవారే. అయితే జమిలి లేదు, ముందస్తు ఎన్నికలు లేవు. మహిళా రిజర్వేషన్ అమలు కూడా 2029 ఎన్నికల నాటినుండే. నిజంగా పై మూడింటిలో ఏ ఒక్కటి వచ్చినా కేసీయార్ కు ఇబ్బందులు తప్పవన్నట్లే ప్రచారం జరిగింది. అయితే మూడింటిలో ఏదీ జరగకపోవటంతో రిలీఫ్ ఫీలయ్యారు. కాకపోతే సుమారు 20 రోజులల విలువైన సమాయం వృధా అయినట్లే అనుకోవాలి.
పై మూడు అంశాలు చర్చకు రాకుండా ఉండుంటే ఈపాటికే కేసీయార్ సుడిగాలి పర్యటనలు పూర్తి చేసుండేవారే. నిజానికి రోజుకు మూడు బహిరంగసభలను కేసీయార్ ప్లాన్ కూడా చేసుకున్నారు. అయితే వాటన్నింటిని రద్దుచేసుకున్నారు. కేసీయార్ ఏ స్ధాయిలో టెన్షన్ పడ్డారంటే తాను చెప్పేంతవరకు అభ్యర్ధుల్లో ఎవరినీ ప్రచారంకు కూడా వెళ్ళద్దని ఆదేశించారు. అభ్యర్ధులు ప్రచారంలోకి వెళిపోతే పార్లమెంటులో ఏదైనా నిర్ణయం జరిగితే అభ్యర్ధులు ఇబ్బందులు పడతారన్నది కేసీయార్ ఉద్దేశ్యం.
మొత్తానికి అలాంటి ఏమీ జరగకపోవటంతో కేసీయార్ ఊపిరి పీల్చుకున్నారు. కాకపోతే నష్టపోయిన 20 రోజుల సమయాన్ని ఇపుడు జెట్ స్పీడుతో కవర్ చేయాల్సుంటుంది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ముందస్తు ఎన్నికల అంశం ఇంకా సజీవంగానే ఉంది. ఎందుకంటే ఈ విషయంలో నరేంద్రమోడీ నిర్ణయం తీసుకుంటే సరిపోతుంది. మోడీ నిర్ణయమే క్యాబినెట్ నిర్ణయం కాబట్టి ముందస్తు ఎన్నికలకు వెళ్ళాలని డిసైడ్ అయితే అడ్డుచెప్పేవాళ్ళులేరు. అయితే మోడీ మనసులో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో ఎవరికీ తెలీటంలేదంతే.
మెగా ఫ్యాన్స్, ఐకాన్ స్టార్ అభిమానుల మధ్య బయటికి కనిపించని కోల్డ్ వార్ జరుగుతూనే ఉంటుంది. హీరోలు వాళ్ళు వాళ్ళు…
ప్యాన్ ఇండియా సినిమాలకు వాయిదాలు మంచి నీళ్లు తాగినంత సులభంగా మారిపోయాయి. రెండు కన్నా తక్కువ డేట్లు మార్చుకుని థియేటర్లకు…
వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం విశాఖపట్నంలో పర్యటించనున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్…
అంతర్గత వర్గాల నుంచి వినిపిస్తున్న సమాచారం కనక నిజమయ్యే పక్షంలో రామ్ చరణ్ అభిమానులకు అది గుడ్ న్యూస్ కానుంది.…
అల్లు అర్జున్ హీరోగా లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో రాబోతున్న కొత్త సినిమాపై ఇండస్ట్రీలో రకరకాల చర్చలు నడుస్తున్నాయి. సినిమా…
విశాఖ స్టీల్ ప్లాంట్ లో జరిగిన ఘోర ప్రమాదంలో 8 మంది చనిపోగా… ఆరుగురు తీవ్రంగా గాయపడి వేర్వేరు ఆసుపత్రుల్లో…