Political News

బీఆర్ఎస్‌కు మైనంపల్లి గుడ్ బై

తెలంగాణ రాజ‌కీయాల్లో మ‌రో కీల‌క ప‌రిణామం చోటుచేసుకుంది. తెలంగాణ సీఎం కేసీఆర్ ను , ఆయ‌న నిర్ణ‌యాల‌ను బ‌హిరంగంగా తూర్పార‌ప‌ట్టిన మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పేస్తూ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు వీడియో మెసేజ్ రిలీజ్ చేసిన మైనంపల్లి హనుమంతరావు త్వ‌ర‌లోనే తాను ఓ పార్టీలో చేర‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

త‌నతో పాటు కుమారుడికి ఎమ్మెల్యే టికెట్ కోరిన మైనంప‌ల్లికి తెలంగాణ ముఖ్య‌మంత్రి, బీఆర్ఎస్ పార్టీ ర‌థ‌సార‌థి కేసీఆర్ నో చెప్పిన సంగ‌తి తెలిసిందే. ఒకే కుటుంబంలో స‌భ్యులు అయిన‌ కేసీఆర్‌, కేటీఆర్‌, హ‌రీశ్‌రావు, క‌విత‌, సంతోష్‌రావుల‌కు ప‌దవులు ద‌క్కిన‌పుడు త‌న కుటుంబంలో త‌న కుమారుడికి మాత్రం ఎందుకు టికెట్ ఇవ్వ‌రంటూ మైనంప‌ల్లి ఘాటుగా నిల‌దీశారు. అయిన‌ప్ప‌టికీ మైనంప‌ల్లిపై కేసీఆర్ ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోకుండా వేచిచూసే దోర‌ణి అవ‌లంభించారు. అయితే, కేసీఆర్ సంయ‌మ‌నం నేప‌థ్యంలో గులాబీ ద‌ళ‌ప‌తికి తన మార్కు రాజ‌కీయాన్ని మైనంప‌ల్లి రుచి చూపిస్తూ త‌న అనుచ‌రుల‌తో కేసీఆర్ ను తిట్టించారు.

ఉత్కంఠ‌కు తెర‌దించుతూ మైనంప‌ల్లి హ‌న్మంత రావు త‌న నిర్ణ‌యాన్ని వెల్ల‌డించారు. మల్కాజ్‌గిరి ప్రజల కోరిక మేరకు, త‌న‌ కార్యకర్తల ప్ర‌కారం మ‌రియు రాష్ట్రంలోని శ్రేయోభిలాషుల కోరిక మేరకు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నానని మైనంప‌ల్లి ప్ర‌క‌టించారు. ‘ఇంతవరకు మీ అందరి సహకారానికి నా కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు మరిచిపోను. మల్కాజ్‌గిరి ప్రజలకు రాష్ట్రంలోని నా శ్రేయోభిలాషులందరికీ అండగా ఉంటాను. నా ప్రాణం ఉన్నంత వరకు ప్రజల కోరిక మేరకే ముందుకు నడుస్తాను…దేనికి లొంగే ప్రసక్తే లేదని తెలియజేస్తున్నాను. తప్పకుండా తగిన సమయంలో ఏ పార్టీలో చేరేది తెలియజేస్తాను. ‘ అని మైనంప‌ల్లి వెల్ల‌డించారు.

అయితే, కాంగ్రెస్ పార్టీ వైపు మైనంప‌ల్లి హ‌న్మంత‌రావు అడుగులు వేస్తున్న‌ట్లు స‌మాచారం. వాస్త‌వానికి సెప్టెంబర్ 17న సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీ సమక్షంలో అధికారికంగా పార్టీలో చేరవచ్చని అంచ‌నాలు వెలువడ్డాయి. ఇప్పటికే కాంగ్రెస్ నేతలతో చర్చలు జ‌ర‌గ‌గా, త‌న‌తో పాటే తన కుమారుడిని కాంగ్రెస్‌ టికెట్‌పై పోటీకి దించేందుకు మైనంపల్లి హామీ పొందిన‌ట్లు సమాచారం. ఇటీవలే టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డితో మైనంప‌ల్లి సూచ‌న‌ల మేర‌కు రహస్యంగా మైనంప‌ల్లి ముఖ్య అనుచ‌రుడు న‌క్క‌ ప్రభాకర్‌గౌడ్‌ భేటీ అయ్యార‌ట‌. మేడ్చ‌ల్ టికెట్ విష‌యంలో ప్రభాకర్‌గౌడ్‌కి రేవంత్ హామీ ఇచ్చారని స‌మాచారం. స్థూలంగా త‌న‌కు, త‌న కుమారుడికి, అంతే కాకుండా ముఖ్య అనుచ‌రుడికి టికెట్ విష‌యంలోనూ మైనంప‌ల్లి హామీ పొందిన‌ట్లు తెలుస్తోంది.

This post was last modified on September 22, 2023 11:31 pm

Share

Recent Posts

పిఠాపురంలో ఎవ్వ‌రికి ఛాన్స్ లేద‌బ్బా.. !

సామాజికంగా.. స‌మ‌స్య‌ల ప‌రిష్కారం ప‌రంగా.. నాయ‌కులు దూకుడు ప్ర‌ద‌ర్శిస్తారు. నియోజ‌క‌వ‌ర్గాల్లో పాగా వేసేందుకు ప్ర‌య‌త్నిస్తారు. అందుకే ఒక్కొక్క నియోజ‌క‌వ‌ర్గంలో ఒక్కొక్క‌…

56 minutes ago

కూట‌మి కాన్ఫిడెన్స్ ఏంటి?

వ‌చ్చే ఎన్నికల్లోనూ కూట‌మి విజ‌యం సాధిస్తుంద‌న్న బ‌ల‌మైన సంకేతాలు వ‌స్తున్నాయి. నాయ‌కులు చెప్ప‌డ‌మే కాదు.. క్షేత్ర‌స్థాయిలో జ‌రుగుతున్న కొన్ని ఆన్‌లైన్…

1 hour ago

రవితేజ పోటీని యష్ తట్టుకోవాలంటే

ఒకపక్క ఇరుముడి విరగాడేస్తోంది. వీకెండ్ టికెట్లు దొరక్క అల్లాడిపోతున్న ప్రేక్షకులు లక్షల్లో ఉన్నారు. ఇచ్చిన థియేటర్లు సరిపోక వేరే సినిమాలవి…

2 hours ago

టార్గెట్ చేరుకున్న టాక్సిక్ తెలుగు వేడుక

నిన్న హైదరాబాద్ లో జరిగిన టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. సౌండ్ బార్ల మీద కూర్చున్న…

3 hours ago

మెగా హీరోలు అభిమానులు ఇద్దరూ చెక్ చేసుకోవాలి

సోషల్ మీడియా రాను రాను మరీ సెన్సిటివ్ గా, టాక్సిక్ గా మారిపోతోంది. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ…

4 hours ago

ఎండోస్కోపిక్ కెమెరాతో పేపర్ లీక్… బీజేపీ రాష్ట్రంలో సంచలనం

రాయ్ పూర్ లోని ఇందిరా గాంధీ కృషి విశ్వవిద్యాలయం బీఎస్సీ ద్వితీయ సంవత్సరం పరీక్షా పేపర్ లీకేజి వ్యవహారం ఇప్పుడు…

4 hours ago