స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు రిమాండ్ ఈ రోజుతో ముగియబోతున్న సంగతి తెలిసింది. దాంతోపాటు చంద్రబాబును కస్టడీకి ఇవ్వాలని సిఐడి దాఖలు చేసిన పిటిషన్ పై కూడా ఈ రోజే తీర్పు వెలువడనుంది. నిన్న రెండు సార్లు చంద్రబాబు కస్టడీ పిటిషన్ తీర్పు వాయిదా పడింది. తాజాగా, ఈ రోజు ఉదయం 11 గంటలకు తీర్పు వెలువడాల్సి ఉండగా…మరోసారి తీర్పును కోర్టు వాయిదా వేసింది. ఈరోజు మధ్యాహ్నం 2:30 గంటలకు విజయవాడ ఎసిబి కొట్టు న్యాయమూర్తి వాయిదా
దాంతోపాటు, చంద్రబాబు రిమాండ్ ను ఈ నెల 24 వరకు పొడిగిస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
మరోవైపు, అంగళ్లు అల్లర్ల కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై ఏపీ హైకోర్టు విచారణను ఈ నెల 26కు వాయిదా వేసింది. ఈ రోజు మధ్యాహ్నం 1.30 కు ఏపీ హైకోర్టులో చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్ పై తీర్పు వెలువడనుంది. ఈ విషయాన్ని చంద్రబాబు తరఫు లాయర్లు కోర్టుకు వివరించారు. ఈ నేపథ్యంలో కస్టడీ పిటిషన్ తీర్పు మధ్యాహ్నానికి వాయిదా పడింది. ఇక, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ విచారణ ఈనెల 26 కు వాయిదా పడిన సంగతి తెలిసిందే.
This post was last modified on September 22, 2023 11:47 am
దురంధర్.. చాలా ఏళ్ల తర్వాత భారతీయ సినిమాలో బాలీవుడ్ తలెత్తుకునేలా చేసిన సినిమా. గత ఏడాది ఛావా, సైయారా సినిమాలు…
తమిళంలో కొన్నేళ్లుగా నంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న విజయ్.. పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నికల బరిలోకి దిగే…
తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…
న్యూజిలాండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…
తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…
ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…