స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు రిమాండ్ ఈ రోజుతో ముగియబోతున్న సంగతి తెలిసింది. దాంతోపాటు చంద్రబాబును కస్టడీకి ఇవ్వాలని సిఐడి దాఖలు చేసిన పిటిషన్ పై కూడా ఈ రోజే తీర్పు వెలువడనుంది. నిన్న రెండు సార్లు చంద్రబాబు కస్టడీ పిటిషన్ తీర్పు వాయిదా పడింది. తాజాగా, ఈ రోజు ఉదయం 11 గంటలకు తీర్పు వెలువడాల్సి ఉండగా…మరోసారి తీర్పును కోర్టు వాయిదా వేసింది. ఈరోజు మధ్యాహ్నం 2:30 గంటలకు విజయవాడ ఎసిబి కొట్టు న్యాయమూర్తి వాయిదా
దాంతోపాటు, చంద్రబాబు రిమాండ్ ను ఈ నెల 24 వరకు పొడిగిస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
మరోవైపు, అంగళ్లు అల్లర్ల కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై ఏపీ హైకోర్టు విచారణను ఈ నెల 26కు వాయిదా వేసింది. ఈ రోజు మధ్యాహ్నం 1.30 కు ఏపీ హైకోర్టులో చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్ పై తీర్పు వెలువడనుంది. ఈ విషయాన్ని చంద్రబాబు తరఫు లాయర్లు కోర్టుకు వివరించారు. ఈ నేపథ్యంలో కస్టడీ పిటిషన్ తీర్పు మధ్యాహ్నానికి వాయిదా పడింది. ఇక, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ విచారణ ఈనెల 26 కు వాయిదా పడిన సంగతి తెలిసిందే.
This post was last modified on September 22, 2023 11:47 am
ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జరిగిన ఒక పరిణామానికి సంబంధించి ఓ వీడియో సోషల్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…
వైసీపీ అధినేత జగన్పై ఆయన సోదరి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి నిప్పులు చెరిగారు. 'అన్న'…
దేశంలో విమానయాన సంస్థల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఉన్న…
ఏపీలో మరో కీలక పథకం ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. 'దివ్యాంగ శక్తి' పేరుతో కీలక పథకాన్ని సీఎం చంద్రబాబు, ఉప…
మంత్రి నారా లోకేష్.. మంగళవారం ఉమ్మడి కృష్ణాజిల్లాలోని ఓ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ విషయాన్ని అత్యంత గోప్యంగా…