దశాబ్దాల తరబడి కలలు కన్న సొంత రాష్ట్రాన్ని ఇచ్చినా దాదాపు పదేళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న ఆ పార్టీ.. ఇప్పుడు రాష్ట్రంలో అధికారాన్ని సొంతం చేసుకోవాలని తపిస్తోంది. ఇందుకోసం కిందా మీదా పడుతున్నారు. ఈసారి ఎన్నికల్లో తమ సత్తా చాటని పక్షంలో పార్టీకి జరిగే డ్యామేజ్ భారీగా ఉంటుందన్న మాట బలంగా వినిపిస్తోంది.
త్వరలో జరిగే ఎన్నికల్లో తెలంగాణలో గెలుపు కాంగ్రెస్ కు చాలా ముఖ్యమన్న విషయం ఆ పార్టీకి తెలియనిది కాదు. అందుకే.. అభ్యర్థుల జాబితాను ఫైనల్ చేసేందుకు భారీగానే కసరత్తు చేస్తున్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం త్వరలోనే తొలిజాబితాను విడుదల చేస్తారని చెబుతున్నారు. మొదటి జాబితాలో 30-35 పేర్ల వరకు ఉండొచ్చన్న మాట వినిపిస్తోంది.
మొత్తంగా నాలుగైదు జాబితాలు ఉండొచ్చని చెబుతున్నారు. తొలి జాబితాలో బలమైన.. ముఖ్యమైన అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తారని చెబుతున్నారు. తాజాగా జరిగిన భేటీ ఎనిమిది గంటల పాటు సాగడం గమనార్హం. మొత్తం 119 స్థానాల్లో టికెట్లు ఆశిస్తున్న వారి జాబితాను 300 మందికి షార్ట్ లిస్టు చేసినట్లుగా తెలుస్తోంది. ఇందులో ఒకే ఒక్క అభ్యర్థి బరిలో ఉన్న నియోజకవర్గాలు 30-35 వరకు ఉన్నాయని.. రెండేసి పేర్లు ఉన్న స్థానాలు 20-30 మధ్య.. ముగ్గురు చొప్పున పోటీ పడుతున్న స్థానాలు 30-35 వరకు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక.. నలుగురికి పైనే టికెట్లు ఆశిస్తున్న స్థానాలు దాదాపు పది వరకు ఉన్నాయని.. వాటి విషయంలో చివర్లో నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారు.
ఒకే ఒక్కఅభ్యర్థి బరిలో ఉన్న జాబితాను ఇప్పటికే పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ ఆమోదానికి పంపారు. అక్కడి నుంచి ఓకే అన్న మాట వచ్చినంతనే తొలి జాబితాను విడుదల చేస్తారని చెబుతున్నారు. ఈ నెలాఖరుకు మొదటి జాబితాను.. వచ్చే నెల మొదటి వారంలో రెండో జబితాను.. రెండో వారంలో మూడో జాబితాను ప్రకటిస్తారని చెబుతున్నారు. ఏదైనా పీటముడి పడితే మాత్రం నాలుగో విడతలో అభ్యర్థుల్ని ఫైనల్ చేసే అవకాశం ఉందంటున్నారు.
వరుసగా మూడుసార్లు ఓడిన వారికి మాత్రం టికెట్ ఇవ్వకూడదని సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్లుగా చెబుతున్నారు. అలాంటి నియోజకవర్గాలు దాదాపు ఆరేడు వరకు ఉన్నాయమంటున్నారు. టికెట్ల ఎంపికలో సర్వే రిపోర్టులను ప్రాధామ్యాయాలుగా తీసుకుంటారని చెబుతున్నారు. తొలి జాబితాలో వెల్లడయ్యే అభ్యర్థుల విషయానికి వస్తే.. ఇప్పటికే గుర్తింపు పొందటంతో పాటు.. బలమైన నేతలుగా ఉన్న వారే ఉన్నారు. వారెవరంటే..
పోలీసు స్టేషన్లకు వెళ్లి ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేకుండా.. ఇక నుంచి వాయిస్ మెసేజ్ల ద్వారా కూడా ఫిర్యాదులు చేసే…
ఏపీలో వైసీపీ అదికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలోని పాత జిల్లాలతో పాటుగా వైసీపీ సర్కారే కొత్తగా ఏర్పాటు చేసిన కొత్త జిల్లాల్లోనూ…
పవన్ కళ్యాణ్ భుజాల లోపల కలిగిన గాయం ఊహించిన దానికంటే తీవ్రంగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్…
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును వేధింపులకు గురిచేసి.. కస్టడీలో టార్చర్ చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ సునీల్ కుమార్…
రాజకీయాలంటే చాలా మంది చెడిపోయాయని అనుకుంటారు. కానీ, రాజకీయాలు అంతగా ఏమీ చెడిపోలేదు. ఒక పార్టీ కారణంగానే ఈ పేరు…
జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అనౌన్స్ మెంట్ ఇవాళ వచ్చేసింది. నిజానికి…