Political News

ట‌చ్ మీ నాట్‌… జ‌గ‌న్ ప‌ట్ల మోడీ ఫీలింగ్‌ మారుతోందా?

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు అరెస్టు ఎపిసోడ్, అనంత‌ర ప‌రిణామాలు ఒకింత సమస్యాత్మకంగా మారుతున్న నేపథ్యంలో ఢిల్లీలోని బీజేపీ పెద్దలు ఆచితూచి అడుగు వేస్తున్నారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం రాష్ట్రంలోనే కాకుండా దేశంలో చర్చనీయాంశంగా మారడంతో ఈ వివాదంలో జోక్యం చేసుకోవద్దని కాషాయ పెద్ద‌లు క్లారిటీతో ఉన్నట్లు సమాచారం. అందులో భాగంగానే అధికార, రాజకీయప‌ర‌మైన‌ స్పందనల‌ విషయంలో బీజేపీ పెద్దలు సైలెంట్ మోడ్ లో ఉంటున్నారని, ఏపీ సీఎం జ‌గ‌న్ ను ఒకింత దూరం పెడుతున్నార‌ని చెప్తున్నారు.

ఏపీ సీఎం వైఎస్ జగన్ విదేశీ టూర్లో ఉన్న సమయంలో బాబు అరెస్టు, ఆయనకు బెయిల్‌ దొరకపోవడం, తాజాగా ప‌లు కేసుల్లో నిందితుడి అనే వార్త‌లు చర్చ‌నీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఏపీ సీఎం జగన్ దూకుడు వెన‌క బీజేపీ అండ ఉంద‌న్న‌ అభిప్రాయాలు వ్యక్తం అవుతున్న నేప‌థ్యంలో బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు ప‌లు సంఘ‌ట‌న‌ల‌ను బ‌ట్టి అర్థం అవుతోంది. బాబు అరెస్టు సమయంలో విదేశాల్లో ఉన్న జగన్ రాష్ట్రానికి విచ్చేయగానే ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షాలను కలవాలని తలచిన సంగతి తెలిసిందే. అయితే దాదాపు వారం అవుతున్న‌ప్పటికీ అపాయింట్మెంట్ దొరకలేదు. దీని వెనుక ఢిల్లీ పెద్దలు బీజేపీ ముఖ్య నాయకుల వ‌ద్ద ఉన్న స‌మ‌చారం కారణమని అంటున్నారు.

చంద్రబాబు అరెస్టుని టీడీపీ దాని మిత్రపక్ష పార్టీలు కాకుండా ఏపీలోని ప్రజ‌లు సైతం ఈ చర్యను అవినీతిని అడ్డుకోవడం అనే కోణంలో కాకుండా పగ తీర్చుకోవడం అనే విధంగా చూస్తున్నాయని బీజేపీ నేతల దృష్టికి వచ్చింది. ఇదే స‌మాచారం ప్రధాని దృష్టికి కూడా వెళ్లిందని తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్‌ అపాయింట్మెంట్ కోరినప్పటికి ప్రధాని నో చెప్తున్నట్లు సమాచారం. మోడీ క‌నుస‌న్న‌ల్లోనే లేదా మ‌ద్ద‌తులో బాబును జ‌గ‌న్ అరెస్టు చేయించాడ‌ని ఏపీలో బలంగా ప్రచారమయ్యే అవకాశం ఉంది కాబట్టి మోడీ, అమిత్ షాలు జ‌గ‌న్ తో ట‌చ్ మీ నాట్ అంటూ వ్యవహరిస్తున్నారని చెప్తున్నారు. మొత్తంగా బీజేపీకి దగ్గర అయ్యేందుకు, బాబు అరెస్టును వాడుకునేందుకు జగన్ క్రేజీగా ఉన్న‌ప్ప‌టికీ బీజేపీకి మాత్రం అలాంటి ఆస‌క్తి లేద‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది.

This post was last modified on September 20, 2023 1:28 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

సూపర్ నిర్ణయం… GO వచ్చినా పాత రేట్లే

తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…

4 minutes ago

నానితో క్లాష్… మెగాస్టార్ ఒప్పుకోరేమో

అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…

11 minutes ago

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

2 hours ago

‘నీట్’ గా పేపర్ అమ్మేశారట!

నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…

2 hours ago

భగీరథ్ కేసు వాదించేది వైసీపీ ఎంపీనే

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…

3 hours ago

కేరళం ‘సీల్డ్ కవర్’ తెరచుకునేదెన్నడో..?

దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…

3 hours ago