Political News

ట‌చ్ మీ నాట్‌… జ‌గ‌న్ ప‌ట్ల మోడీ ఫీలింగ్‌ మారుతోందా?

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు అరెస్టు ఎపిసోడ్, అనంత‌ర ప‌రిణామాలు ఒకింత సమస్యాత్మకంగా మారుతున్న నేపథ్యంలో ఢిల్లీలోని బీజేపీ పెద్దలు ఆచితూచి అడుగు వేస్తున్నారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం రాష్ట్రంలోనే కాకుండా దేశంలో చర్చనీయాంశంగా మారడంతో ఈ వివాదంలో జోక్యం చేసుకోవద్దని కాషాయ పెద్ద‌లు క్లారిటీతో ఉన్నట్లు సమాచారం. అందులో భాగంగానే అధికార, రాజకీయప‌ర‌మైన‌ స్పందనల‌ విషయంలో బీజేపీ పెద్దలు సైలెంట్ మోడ్ లో ఉంటున్నారని, ఏపీ సీఎం జ‌గ‌న్ ను ఒకింత దూరం పెడుతున్నార‌ని చెప్తున్నారు.

ఏపీ సీఎం వైఎస్ జగన్ విదేశీ టూర్లో ఉన్న సమయంలో బాబు అరెస్టు, ఆయనకు బెయిల్‌ దొరకపోవడం, తాజాగా ప‌లు కేసుల్లో నిందితుడి అనే వార్త‌లు చర్చ‌నీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఏపీ సీఎం జగన్ దూకుడు వెన‌క బీజేపీ అండ ఉంద‌న్న‌ అభిప్రాయాలు వ్యక్తం అవుతున్న నేప‌థ్యంలో బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు ప‌లు సంఘ‌ట‌న‌ల‌ను బ‌ట్టి అర్థం అవుతోంది. బాబు అరెస్టు సమయంలో విదేశాల్లో ఉన్న జగన్ రాష్ట్రానికి విచ్చేయగానే ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షాలను కలవాలని తలచిన సంగతి తెలిసిందే. అయితే దాదాపు వారం అవుతున్న‌ప్పటికీ అపాయింట్మెంట్ దొరకలేదు. దీని వెనుక ఢిల్లీ పెద్దలు బీజేపీ ముఖ్య నాయకుల వ‌ద్ద ఉన్న స‌మ‌చారం కారణమని అంటున్నారు.

చంద్రబాబు అరెస్టుని టీడీపీ దాని మిత్రపక్ష పార్టీలు కాకుండా ఏపీలోని ప్రజ‌లు సైతం ఈ చర్యను అవినీతిని అడ్డుకోవడం అనే కోణంలో కాకుండా పగ తీర్చుకోవడం అనే విధంగా చూస్తున్నాయని బీజేపీ నేతల దృష్టికి వచ్చింది. ఇదే స‌మాచారం ప్రధాని దృష్టికి కూడా వెళ్లిందని తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్‌ అపాయింట్మెంట్ కోరినప్పటికి ప్రధాని నో చెప్తున్నట్లు సమాచారం. మోడీ క‌నుస‌న్న‌ల్లోనే లేదా మ‌ద్ద‌తులో బాబును జ‌గ‌న్ అరెస్టు చేయించాడ‌ని ఏపీలో బలంగా ప్రచారమయ్యే అవకాశం ఉంది కాబట్టి మోడీ, అమిత్ షాలు జ‌గ‌న్ తో ట‌చ్ మీ నాట్ అంటూ వ్యవహరిస్తున్నారని చెప్తున్నారు. మొత్తంగా బీజేపీకి దగ్గర అయ్యేందుకు, బాబు అరెస్టును వాడుకునేందుకు జగన్ క్రేజీగా ఉన్న‌ప్ప‌టికీ బీజేపీకి మాత్రం అలాంటి ఆస‌క్తి లేద‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది.

Satya

Recent Posts

కొరియన్ మార్కెట్ పై వంగా డార్క్ స్ట్రాటజీ

పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కావడం ఇప్పుడు చాలా కామన్ పాయింట్. కానీ ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా…

48 minutes ago

‘ఓం’ ద్వారా ఏం చెప్పాలనుకున్నారు

ధనుష్ కొత్త సినిమా పేరు 'ఓం'గా ఫిక్సయ్యింది. అమరన్ ఫేమ్ రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్…

5 hours ago

ఆ నిర్మాతకు మళ్లీ జాక్‌పాటేనా?

తెలుగులో ఇప్పుడు నిర్మాతల పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా మారిందో తెలిసిందే. నిలకడగా విజయాలు అందుకుని, లాభాలు దక్కించుకునే నిర్మాతలు అరుదైపోయారు.…

5 hours ago

సీబీఐ విచారణకు జగన్ డిమాండ్

విజయవాడలో కనిపించకుండా పోయిన గాదె సాయికృష్ణ వ్యవహారం అంతకంతకూ జఠిలంగా మారుతోంది. సాయికృష్ణ బతికి లేడని, అతడిని పోలీసులే అంతమొందించారని…

7 hours ago

వైసీపీ మాజీ ఎమ్మెల్యే అరెస్టు… మొక్కు చెల్లించుకున్న రైతు

తప్పు చేసిన నేతలు ఎప్పటికైనా ప్రజాగ్రహానికి గురి కావాల్సి వస్తుందని చెప్పడానికి పల్నాడు జిల్లాలో జరిగిన ఈ ఘటన ఉదాహరణగా…

7 hours ago

బంగారం బుకింగ్స్ ఎందుకు బాగున్నాయి

మా ఇంటి బంగారం అడ్వాన్స్ బుకింగ్స్ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తున్నాయి. నిజానికి మూడేళ్ళ గ్యాప్ తర్వాత ఒక హీరోయిన్ ఫిమేల్…

7 hours ago