టిడిపి అధినేత, ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడును స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్ కు తరలించిన సంగతి తెలిసిందే. చంద్రబాబుకు మద్దతుగా టీడీపీ, ప్రతిపక్ష నేతలతో పాటు జాతీయస్థాయి నేతలు, ఐటీ ఉద్యోగులు, టిడిపి ఎన్నారై నేతలు నిరసనలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ ప్రముఖ నిర్మాత ప్రముఖ దర్శకుడు కే రాఘవేంద్రరావుతోపాటు పలువురు సినీ ప్రముఖులు తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ నేపద్యంలోనే తాజాగా చంద్రబాబు అరెస్టు వ్యవహారంపై నిర్మాత, నటుడు బండ్ల గణేష్ తనదైన రీతిలో స్పందించారు.
చంద్రబాబు అరెస్టు తనను ఎంతో బాధించిందని, ఆ బాధలో తాను ఇంట్లో వినాయక చవితి వేడుకలు జరుపుకోలేదని బాధపడ్డారు. చంద్రబాబు జైల్లో ఇబ్బంది పడుతుంటే తనకు అన్నం కూడా తినబుద్ధి కావడంలేదని బండ్ల అన్నారు. ఇక, రాబోయే ఎన్నికల్లో టిడిపి ఘనవిజయం సాధించి చంద్రబాబు మరో మరోసారి సీఎం కావడం ఖాయమని బండ్ల గణేష్ జోస్యం చెప్పారు. చంద్రబాబు జాతీయ సంపదని, ఆయనను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని బండ్ల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఆయన పేరు చెప్పుకొని ఎంతోమంది బాగుపడ్డారని,అయితే ఐటి ఉద్యోగులు హైదరాబాదులో రోడ్లపై కాకుండా నెల రోజులు ఉద్యోగాలకు సెలవు పెట్టి సొంతూళ్లోని బొడ్రాయి ముందు ధర్నా చేయాలని బండ్ల పిలుపునిచ్చారు. అయితే, పవన్ కళ్యాణ్ ను పవనేశ్వరా అని పిలుస్తూ ఆయన భక్తుడిగా పేరున్న బండ్ల గణేష్ టీడీపీతో జనసేన పొత్తు ప్రకటన తర్వాత చంద్రబాబుకు మద్దతుగా కామెంట్లు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
మరో ఏడాది తర్వాత తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పాదయాత్రల సందడి మొదలుకానుంది. ఎన్నికలకు ముందు ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రధాన పార్టీలు…
థియేటర్ రన్ పూర్తి చేసుకున్న పెద్ది ఇటీవలే ఓటిటిలో వచ్చిన సంగతి తెలిసిందే. అయితే నార్త్ ఆడియన్స్ తో పాటు…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి.. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ లేఖ రాశారు. ``షాబాద్ ఘటన దారుణం`` అని…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఉదార స్వభావం, దాతృత్వం గురించి జనసైనికులు, ఆయన అభిమానులు గొప్పగా…
కాపు ఉద్యమ నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు ముగిశాయి. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలోని ఆయన ఇంటి ప్రాంగణంలోనే…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నీటిపారుదల విధానాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. ఎల్నినో పరిస్థితుల్లోనూ నీటి సమస్య…