ఏపీ అధికార పార్టీ వైసీపీ సీనియర్ నాయకుడు, మంత్రి ధర్మాన ప్రసాదరావు చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు. చంద్రబాబు అరెస్టు, జైలులో పెట్టడం పట్ల ఆసేతు హిమాచలం ఆవేదన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. మహిళలు, వృద్ధులు కూడా రోడ్లమీదకు వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ నాయకులు, ఎన్నారైలు.. రిలే నిరాహార దీక్షలు చేస్తూ..చంద్రబాబు అరెస్టును ఖండిస్తున్నారు. ఇలాంటి సమయంలో ఈ విషయంపై మౌనంగా ఉండాల్సిన మంత్రి ధర్మాన.. ఈ నిరసనలను, ఆవేదనను తక్కువ చేసి మాట్లాడారు.
“చంద్రబాబు జైలుకు వెళ్లడాన్ని పెద్దది చేసి చూస్తున్నారు. ఇప్పటికి ఎంతో మంది పెద్ద పెద్ద వాళ్లు కూడా జైళ్లకు వెళ్లారు. అంతెందుకు మన ముఖ్యమంత్రి జగన్ కూడా జైలులో ఉండి వచ్చారు. నేను కూడా.. అనేక కేసుల్లో కోర్టు మెట్లు ఎక్కాను. కానీ, చంద్రబాబును జైల్లో పెడితే.. ఏదో జరిగిపోయినట్టు నిరసన చేస్తున్నారు. ఇదంతా ఎందుకు? ఎందుకు చేస్తున్నట్టు” అని ధర్మాన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు.
సీఎం జగన్ 16 మాసాలు జైల్లో ఉన్నదానికి, చంద్రబాబును ఇప్పుడు జైల్లో పెట్టడానికి పోలిక ఏమైనా ఉందా ధర్మాన సార్? అంటూ.. కొందరు నిప్పులు చెరిగారు. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని లక్షల కోట్లు దోచుకున్న కేసులో జగన్ జైలు జీవితం గడిపారని.. ఇది తప్పని, తాను అవినీతికి పాల్పడలేదని ఆయన ఒక్క మాటైనా ఇప్పటి వరకు చెప్పారా? ఆయన జైలుకు వెళ్తే.. నిరసనగా ఏ ఒక్కరైనా రోడ్డెక్కారా? అని పలువురు ప్రశ్నించారు.
ధర్మాన సీనియర్ నాయకుడు, ఎంతో మేధావి అనుకున్నామని.. కానీ, ఇలా కుశ్చిత మనస్తత్వంతో వ్యాఖ్యానిస్తారని అనుకోలేదని మరికొందరు వ్యాఖ్యానించారు. ధర్మాన కేసులకు, చంద్రబాబు కేసులకు సంబంధం ఉందా? అని ఇంకొందరు ప్రశ్నించారు. మొత్తానికి సీనియర్ నేతపై నెటిజన్లు సీరియస్గానే కామెంట్లు చేస్తుండడం గమనార్హం.
This post was last modified on September 18, 2023 1:51 pm
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…