ఏపీ అధికార పార్టీ వైసీపీ సీనియర్ నాయకుడు, మంత్రి ధర్మాన ప్రసాదరావు చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు. చంద్రబాబు అరెస్టు, జైలులో పెట్టడం పట్ల ఆసేతు హిమాచలం ఆవేదన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. మహిళలు, వృద్ధులు కూడా రోడ్లమీదకు వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ నాయకులు, ఎన్నారైలు.. రిలే నిరాహార దీక్షలు చేస్తూ..చంద్రబాబు అరెస్టును ఖండిస్తున్నారు. ఇలాంటి సమయంలో ఈ విషయంపై మౌనంగా ఉండాల్సిన మంత్రి ధర్మాన.. ఈ నిరసనలను, ఆవేదనను తక్కువ చేసి మాట్లాడారు.
“చంద్రబాబు జైలుకు వెళ్లడాన్ని పెద్దది చేసి చూస్తున్నారు. ఇప్పటికి ఎంతో మంది పెద్ద పెద్ద వాళ్లు కూడా జైళ్లకు వెళ్లారు. అంతెందుకు మన ముఖ్యమంత్రి జగన్ కూడా జైలులో ఉండి వచ్చారు. నేను కూడా.. అనేక కేసుల్లో కోర్టు మెట్లు ఎక్కాను. కానీ, చంద్రబాబును జైల్లో పెడితే.. ఏదో జరిగిపోయినట్టు నిరసన చేస్తున్నారు. ఇదంతా ఎందుకు? ఎందుకు చేస్తున్నట్టు” అని ధర్మాన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు.
సీఎం జగన్ 16 మాసాలు జైల్లో ఉన్నదానికి, చంద్రబాబును ఇప్పుడు జైల్లో పెట్టడానికి పోలిక ఏమైనా ఉందా ధర్మాన సార్? అంటూ.. కొందరు నిప్పులు చెరిగారు. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని లక్షల కోట్లు దోచుకున్న కేసులో జగన్ జైలు జీవితం గడిపారని.. ఇది తప్పని, తాను అవినీతికి పాల్పడలేదని ఆయన ఒక్క మాటైనా ఇప్పటి వరకు చెప్పారా? ఆయన జైలుకు వెళ్తే.. నిరసనగా ఏ ఒక్కరైనా రోడ్డెక్కారా? అని పలువురు ప్రశ్నించారు.
ధర్మాన సీనియర్ నాయకుడు, ఎంతో మేధావి అనుకున్నామని.. కానీ, ఇలా కుశ్చిత మనస్తత్వంతో వ్యాఖ్యానిస్తారని అనుకోలేదని మరికొందరు వ్యాఖ్యానించారు. ధర్మాన కేసులకు, చంద్రబాబు కేసులకు సంబంధం ఉందా? అని ఇంకొందరు ప్రశ్నించారు. మొత్తానికి సీనియర్ నేతపై నెటిజన్లు సీరియస్గానే కామెంట్లు చేస్తుండడం గమనార్హం.
This post was last modified on September 18, 2023 1:51 pm
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…