ఏపీ అధికార పార్టీ వైసీపీ సీనియర్ నాయకుడు, మంత్రి ధర్మాన ప్రసాదరావు చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు. చంద్రబాబు అరెస్టు, జైలులో పెట్టడం పట్ల ఆసేతు హిమాచలం ఆవేదన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. మహిళలు, వృద్ధులు కూడా రోడ్లమీదకు వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ నాయకులు, ఎన్నారైలు.. రిలే నిరాహార దీక్షలు చేస్తూ..చంద్రబాబు అరెస్టును ఖండిస్తున్నారు. ఇలాంటి సమయంలో ఈ విషయంపై మౌనంగా ఉండాల్సిన మంత్రి ధర్మాన.. ఈ నిరసనలను, ఆవేదనను తక్కువ చేసి మాట్లాడారు.
“చంద్రబాబు జైలుకు వెళ్లడాన్ని పెద్దది చేసి చూస్తున్నారు. ఇప్పటికి ఎంతో మంది పెద్ద పెద్ద వాళ్లు కూడా జైళ్లకు వెళ్లారు. అంతెందుకు మన ముఖ్యమంత్రి జగన్ కూడా జైలులో ఉండి వచ్చారు. నేను కూడా.. అనేక కేసుల్లో కోర్టు మెట్లు ఎక్కాను. కానీ, చంద్రబాబును జైల్లో పెడితే.. ఏదో జరిగిపోయినట్టు నిరసన చేస్తున్నారు. ఇదంతా ఎందుకు? ఎందుకు చేస్తున్నట్టు” అని ధర్మాన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు.
సీఎం జగన్ 16 మాసాలు జైల్లో ఉన్నదానికి, చంద్రబాబును ఇప్పుడు జైల్లో పెట్టడానికి పోలిక ఏమైనా ఉందా ధర్మాన సార్? అంటూ.. కొందరు నిప్పులు చెరిగారు. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని లక్షల కోట్లు దోచుకున్న కేసులో జగన్ జైలు జీవితం గడిపారని.. ఇది తప్పని, తాను అవినీతికి పాల్పడలేదని ఆయన ఒక్క మాటైనా ఇప్పటి వరకు చెప్పారా? ఆయన జైలుకు వెళ్తే.. నిరసనగా ఏ ఒక్కరైనా రోడ్డెక్కారా? అని పలువురు ప్రశ్నించారు.
ధర్మాన సీనియర్ నాయకుడు, ఎంతో మేధావి అనుకున్నామని.. కానీ, ఇలా కుశ్చిత మనస్తత్వంతో వ్యాఖ్యానిస్తారని అనుకోలేదని మరికొందరు వ్యాఖ్యానించారు. ధర్మాన కేసులకు, చంద్రబాబు కేసులకు సంబంధం ఉందా? అని ఇంకొందరు ప్రశ్నించారు. మొత్తానికి సీనియర్ నేతపై నెటిజన్లు సీరియస్గానే కామెంట్లు చేస్తుండడం గమనార్హం.
This post was last modified on September 18, 2023 1:51 pm
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు కౌంట్డౌన్ దగ్గరపడుతోంది. మరొక్క రోజు గడువు మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అసెంబ్లీ…
లోక్సభలో ఆంధ్రప్రదేశ్ హక్కుల గురించి, రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి, ఏపీ ప్రయోజనాల గురించి ప్రశ్నించిన నేతగా టీడీపీ ఎంపీ…
రెబల్ స్టార్, దివంగత కృష్ణం రాజు సతీమణి శ్యామలా దేవి అనూహ్యంగా ఎన్నికల ప్రచారం చివరి రోజు రాజకీయ ప్రచారం…
సంక్రాంతి, దసరా సెలవులు వచ్చాయి అంటే మొదట మీడియాలో వినిపించే పేరు పంతంగి. హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారి…
"మీ శ్రేయోభిలాషి.." అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. ఎన్నికల ప్రచారం ముగిసిన మరుక్షణం…
ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రారంభం అయ్యేందుకు మరికొద్ది గంటల సమయం మాత్రమే ఉంది. కానీ.. ఇంతలోనే ఏపీలో ఏదో జరుగుతోందనే…