ఏ మాత్రం అవకాశం దొరికినా అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో అధికారంలోకి రావాలని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ తమ ప్రతిష్టాత్మక సిడబ్ల్యుసి సమావేశాలకు హైదరాబాద్ను వేదికగా చేసుకున్న సంగతి తెలిసింది. కాంగ్రెస్ అగ్ర నేతలంతా విచ్చేసి అట్టహాసంగా జరుగుతున్న ఈ సమావేశాల సమయంలో తెలంగాణలో పోస్టర్ల కలకలం జరిగింది. కాంగ్రెస్ పార్టీలోని సిడబ్ల్యుసి సభ్యులంతా అవినీతిపరులని పేర్కొంటూ హైదరాబాద్ లోని పలుచోట్ల పోస్టల్ దర్శనమిచ్చాయి. ఈ పరిణామం సహజంగానే రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ శ్రేణులు కలవరపాటుకు గురయినప్పటికీ, పీసీసీ ఛీఫ్ రేవంత్ సారథ్యంలోని దీనికి రియాక్షన్ సిద్ధమైందని సమాచారం.
కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్య నేతల వేదికైనా సిడబ్ల్యూసీలోని పలు స్కామ్లను వివరిస్తూ హైదరాబాద్లోని వివిధ ప్రాంతాలతో పోస్టర్లు వెలిశాయి. సహజంగానే ఈ పోస్టర్లు వైరల్ గా మారాయి. అధికార బీఆర్ఎస్ పార్టీ ఈ పోస్టుల వెనుక ఉందని కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపణలు వ్యక్తం చేశారు. దీనిపై బీఆర్ఎస్ పార్టీ స్పందించలేదు. అయితే, ఈ పోస్టులను ఎలా కాంగ్రెస్ ఎదుర్కోనుందని ప్రశ్న వ్యక్తం అవుతుండగా ఆ పార్టీ ప్రణాళిక సిద్ధం చేసిన సమాచారం
తన పార్టీని జాతీయ పార్టీగా మార్చి చక్రం తిప్పాలనుకుంటున్న గులాబీ దళపతి కేసీఆర్ అందుకు పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్రను క్షేత్రంగా ఎంచుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అక్కడ పలు సభలు, వివిధ కార్యక్రమాలను కేసీఆర్ నిర్వహించారు. ఇప్పుడు అదే మహారాష్ట్రలో పోస్టర్ వార్లో తమ కౌంటర్ ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు సమాచారం. తెలంగాణ కాంగ్రెస్ ఇన్చార్జిగా ఉన్న మాణిక్రావు ఠాక్రే సొంత ఇలాక అయిన మహారాష్ట్రలో కేసీఆర్ టూర్లు, సభలు ఉన్నప్పుడు ఆయన పాలనలోని అవకతవకలను పేర్కొంటూ పోస్టర్లు వేయాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణలో కేసీఆర్ ఏలుబడిలో వివిధ ప్రాజెక్టులు, పలు విధానపరమైన నిర్ణయాల్లో జరిగిన అవినీతిని పేర్కొంటూ భారీ స్థాయిలో పోస్టర్లు ప్రచురితం చేసి కేసీఆర్కు గట్టి కౌంటర్ చేయాలని ప్రణాళిక రచించారని సమాచారం. కేసీఆర్ పర్యటన మహారాష్ట్రలో ఉన్నప్పుడు తప్పనిసరిగా ఈ మేరకు పోస్టర్లు వేయాలని రేవంత్ నాయకత్వంలోని తెలంగాణ నేతలు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
This post was last modified on September 16, 2023 10:18 pm
ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకో వారమే సమయం ఉంది. ఈ ఎన్నికలు ఇటు అధికార వైఎస్సార్ కాంగ్రెస్కు, అటు ప్రతిపక్ష…
‘ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ ఎంత పెద్ద హిట్టో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇండియాలో అత్యంత ఆదరణ పొందిన…
ఏపీ ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల సంఘం భారీ షాక్ ఇచ్చింది. ముఖ్యంగా జగన్ ప్రబుత్వం అమలు చేస్తున్న పథకాలను ఎన్నికల…
రాజమండ్రిలో నిర్వహించిన కూటమి పార్టీల(జనసేన-బీజేపీ-టీడీపీ) ఎన్నికల ప్రచార సభ 'ప్రజాగళం'లో చంద్రబాబు పాల్గొన లేక పోయారు. ఆయన వేరే సభలో…
మాములుగా కమెడియన్లు హీరోలు కావడం గతంలో ఎన్నో చూశాం. చూస్తున్నాం. కానీ మధ్యవయసు దాటిన క్యారెక్టర్ ఆర్టిస్టులు కథానాయకులుగా మారడం…
ఏపీలో డబుల్ ఇంజన్ సర్కారు రానుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమే కేంద్రంలోనూ…