ఏ మాత్రం అవకాశం దొరికినా అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో అధికారంలోకి రావాలని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ తమ ప్రతిష్టాత్మక సిడబ్ల్యుసి సమావేశాలకు హైదరాబాద్ను వేదికగా చేసుకున్న సంగతి తెలిసింది. కాంగ్రెస్ అగ్ర నేతలంతా విచ్చేసి అట్టహాసంగా జరుగుతున్న ఈ సమావేశాల సమయంలో తెలంగాణలో పోస్టర్ల కలకలం జరిగింది. కాంగ్రెస్ పార్టీలోని సిడబ్ల్యుసి సభ్యులంతా అవినీతిపరులని పేర్కొంటూ హైదరాబాద్ లోని పలుచోట్ల పోస్టల్ దర్శనమిచ్చాయి. ఈ పరిణామం సహజంగానే రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ శ్రేణులు కలవరపాటుకు గురయినప్పటికీ, పీసీసీ ఛీఫ్ రేవంత్ సారథ్యంలోని దీనికి రియాక్షన్ సిద్ధమైందని సమాచారం.
కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్య నేతల వేదికైనా సిడబ్ల్యూసీలోని పలు స్కామ్లను వివరిస్తూ హైదరాబాద్లోని వివిధ ప్రాంతాలతో పోస్టర్లు వెలిశాయి. సహజంగానే ఈ పోస్టర్లు వైరల్ గా మారాయి. అధికార బీఆర్ఎస్ పార్టీ ఈ పోస్టుల వెనుక ఉందని కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపణలు వ్యక్తం చేశారు. దీనిపై బీఆర్ఎస్ పార్టీ స్పందించలేదు. అయితే, ఈ పోస్టులను ఎలా కాంగ్రెస్ ఎదుర్కోనుందని ప్రశ్న వ్యక్తం అవుతుండగా ఆ పార్టీ ప్రణాళిక సిద్ధం చేసిన సమాచారం
తన పార్టీని జాతీయ పార్టీగా మార్చి చక్రం తిప్పాలనుకుంటున్న గులాబీ దళపతి కేసీఆర్ అందుకు పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్రను క్షేత్రంగా ఎంచుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అక్కడ పలు సభలు, వివిధ కార్యక్రమాలను కేసీఆర్ నిర్వహించారు. ఇప్పుడు అదే మహారాష్ట్రలో పోస్టర్ వార్లో తమ కౌంటర్ ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు సమాచారం. తెలంగాణ కాంగ్రెస్ ఇన్చార్జిగా ఉన్న మాణిక్రావు ఠాక్రే సొంత ఇలాక అయిన మహారాష్ట్రలో కేసీఆర్ టూర్లు, సభలు ఉన్నప్పుడు ఆయన పాలనలోని అవకతవకలను పేర్కొంటూ పోస్టర్లు వేయాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణలో కేసీఆర్ ఏలుబడిలో వివిధ ప్రాజెక్టులు, పలు విధానపరమైన నిర్ణయాల్లో జరిగిన అవినీతిని పేర్కొంటూ భారీ స్థాయిలో పోస్టర్లు ప్రచురితం చేసి కేసీఆర్కు గట్టి కౌంటర్ చేయాలని ప్రణాళిక రచించారని సమాచారం. కేసీఆర్ పర్యటన మహారాష్ట్రలో ఉన్నప్పుడు తప్పనిసరిగా ఈ మేరకు పోస్టర్లు వేయాలని రేవంత్ నాయకత్వంలోని తెలంగాణ నేతలు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
This post was last modified on September 16, 2023 10:18 pm
వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన సీబీఐ తాజాగా సుప్రీం…
ఫరియా అబ్దుల్లా అంటే మనందరికీ 'జాతిరత్నాలు' సినిమాలోని చిట్టినే గుర్తొస్తుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ…
దురంధర్.. గత ఏడాది డిసెంబర్లో విడుదలై.. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమా. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే…
బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ పతనం శనివారం…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…
తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…