Political News

కేసీఆర్ పోస్ట‌ర్ల రాజకీయానికి రేవంత్ కొత్త చెక్

ఏ మాత్రం అవ‌కాశం దొరికినా అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో అధికారంలోకి రావాలని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ త‌మ ప్రతిష్టాత్మక సిడబ్ల్యుసి సమావేశాలకు హైదరాబాద్‌ను వేదికగా చేసుకున్న సంగతి తెలిసింది. కాంగ్రెస్ అగ్ర‌ నేతలంతా విచ్చేసి అట్ట‌హాసంగా జరుగుతున్న ఈ సమావేశాల సమయంలో తెలంగాణలో పోస్టర్ల కలకలం జ‌రిగింది. కాంగ్రెస్ పార్టీలోని సిడబ్ల్యుసి సభ్యులంతా అవినీతిపరుల‌ని పేర్కొంటూ హైదరాబాద్ లోని పలుచోట్ల పోస్టల్ దర్శనమిచ్చాయి. ఈ పరిణామం సహజంగానే రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ శ్రేణులు క‌ల‌వ‌ర‌పాటుకు గుర‌యిన‌ప్ప‌టికీ, పీసీసీ ఛీఫ్ రేవంత్ సార‌థ్యంలోని దీనికి రియాక్షన్ సిద్ధ‌మైంద‌ని స‌మాచారం.

కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్య నేతల వేదికైనా సిడబ్ల్యూసీలోని పలు స్కామ్‌లను వివరిస్తూ హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల‌తో పోస్టర్లు వెలిశాయి. సహజంగానే ఈ పోస్ట‌ర్లు వైరల్ గా మారాయి. అధికార బీఆర్ఎస్‌ పార్టీ ఈ పోస్టుల వెనుక ఉందని కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోప‌ణ‌లు వ్య‌క్తం చేశారు. దీనిపై బీఆర్ఎస్ పార్టీ స్పందించ‌లేదు. అయితే, ఈ పోస్టులను ఎలా కాంగ్రెస్ ఎదుర్కోనుందని ప్రశ్న వ్యక్తం అవుతుండగా ఆ పార్టీ ప్రణాళిక సిద్ధం చేసిన సమాచారం

తన పార్టీని జాతీయ పార్టీగా మార్చి చక్రం తిప్పాలనుకుంటున్న గులాబీ ద‌ళ‌ప‌తి కేసీఆర్ అందుకు పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్రను క్షేత్రంగా ఎంచుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అక్కడ పలు సభలు, వివిధ‌ కార్యక్రమాలను కేసీఆర్ నిర్వహించారు. ఇప్పుడు అదే మహారాష్ట్రలో పోస్టర్ వార్‌లో త‌మ కౌంటర్ ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు సమాచారం. తెలంగాణ కాంగ్రెస్ ఇన్చార్జిగా ఉన్న మాణిక్‌రావు ఠాక్రే సొంత ఇలాక అయిన‌ మహారాష్ట్రలో కేసీఆర్ టూర్లు, సభలు ఉన్నప్పుడు ఆయ‌న పాల‌న‌లోని అవ‌క‌త‌వ‌క‌ల‌ను పేర్కొంటూ పోస్టర్లు వేయాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

తెలంగాణలో కేసీఆర్ ఏలుబడిలో వివిధ ప్రాజెక్టులు, ప‌లు విధాన‌ప‌ర‌మైన‌ నిర్ణయాల్లో జరిగిన అవినీతిని పేర్కొంటూ భారీ స్థాయిలో పోస్టర్లు ప్రచురితం చేసి కేసీఆర్‌కు గట్టి కౌంటర్ చేయాలని ప్రణాళిక రచించార‌ని స‌మాచారం. కేసీఆర్ ప‌ర్య‌ట‌న‌ మహారాష్ట్రలో ఉన్నప్పుడు తప్పనిసరిగా ఈ మేర‌కు పోస్ట‌ర్లు వేయాల‌ని రేవంత్ నాయ‌క‌త్వంలోని తెలంగాణ నేత‌లు నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది.

Satya

Recent Posts

పోల‌వ‌రంపై చంద్ర‌బాబు శ‌ప‌థం

పోల‌వ‌రం ప్రాజెక్టును ఆరు నూరైనా పూర్తి చేస్తామ‌ని సీఎం చంద్ర‌బాబు శ‌ప‌థం చేశారు. గోదావ‌రి జిల్లాల్లో ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన ఆయ‌న…

34 minutes ago

నాగార్జున 101 ఫిక్సయిందా?

అక్కినేని నాగార్జున కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 100వ సినిమా కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కానీ…

44 minutes ago

ఇప్పుడున్న రాజకీయాల్లో ఎన్టీఆర్‌ ఇమ‌డ‌గ‌ల‌రా?

జూనియ‌ర్ ఎన్టీఆర్‌.. రాజ‌కీయ రంగ ప్ర‌వేశంపై త‌ర‌చుగా ప్ర‌చారం జ‌రుగుతూనే ఉంది. ఆయ‌న‌కు అను కూలంగా ఏపీలోనూ కొన్ని ప్రాంతాల్లో…

2 hours ago

చిరు దిగాడు… పంచాయితీ ముగిసింది

తెలుగు టాప్ కొరియోగ్రాఫ‌ర్ల‌యిన జానీ మాస్ట‌ర్, శేఖ‌ర్ మాస్ట‌ర్ ప‌ర‌స్ప‌రం అరుచుకుంటూ ఒక‌రి మీదికి ఒక‌రు దూసుకువెళ్తున్న వీడియో తాజాగా…

2 hours ago

పాజిటివ్ టాక్ ఉన్నా పనవ్వడం లేదా

బాక్సాఫీస్ వద్ద లెనిన్ తప్ప జనాలకు వేరే ఆప్షన్ కనిపించడం లేదు. ఇతర కొత్త సినిమాలు విడుదలైనా వాటి గురించి…

2 hours ago

బీఆర్ఎస్ `బ్లెడ్` పాలిటిక్స్‌.. ఇంత అవ‌స‌ర‌మా?

తెలంగాణ‌లో రైతుల‌ను ఆదుకునేందుకు ప్ర‌భుత్వం ముందుకు రావ‌డం లేద‌ని, ప్రాజెక్టుల‌కు నీటిని విడుద‌ల చేయ‌డం లేద‌ని ఆరోపిస్తూ.. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం…

2 hours ago