బీఆర్ ఎస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు తుమ్మల నాగేశ్వరరావు ఆ పార్టీకి రాజీనామా చేశారు. కేవలం రెండు వాక్యాలతో కూడిన రాజీనామా పత్రాన్ని బీఆర్ ఎస్ అధినేత, సీఎం కేసీఆర్కు పంపించారు. “తెలంగాణ రాష్ట్ర సమితిలో నాకు సహకరించినందుకు ధన్యవాదాలు. పార్టీకి నా రాజీనామాను సమర్పిస్తున్నాను” అని మాత్రమే ఆయన పేర్కొన్నారు. అంతకు మించి.. తన రాజీనామాకు కారణాలు కానీ.. ఈ సందర్భంగా పార్టీపై విమర్శలు కానీ ఆయన చేయకపోవడం గమనార్హం.
ఎవరీ తుమ్మల?
తెలంగాణ రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేకతను చాటుకున్న నాయకుడు తుమ్మల నాగేశ్వరరావు. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న తుమ్మల ఉమ్మడి ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గానికి చెందిన నాయకుడు. వ్యవసాయ కుటుంబానికి చెందిన ఆయన గతంలో టీడీపీలో ఉన్న సమయంలో ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్తో సై అంటే సై అంటూ.. రాజకీయ పోరాటా లకు తెరదీసిన నాయకుడిగా ఆయనకు పేరుంది. వాస్తవానికి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కమ్యునిస్టుల ప్రభావం ఎక్కువ.
అలాంటి జిల్లాలో తెలుగు దేశం పార్టీ జెండాను రెపరెపలాడించడంలో తుమ్మల పాత్రను తక్కువగా అంచనా వేయలేం. అలాంటి నాయకుడు రాష్ట్ర విభజన తర్వాత.. బీఆర్ ఎస్ పార్టీలో చేరారు. ఆయన ఓడిపోయినప్పటికీ.. ఆయనకు మంత్రి పదవిని ఇచ్చిన కేసీఆర్.. భక్తరామదాసు సాగు, తాగు నీటి ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను కూడా ఆయనకే అప్పగించారు. దీనిని సమర్థవంతంగా నిర్వహించడం తుమ్మలకు అప్పట్లో మంచి పేరు తెచ్చింది.
ఇక, గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున గెలిపిన కందాల ఉపేందర్రెడ్డి బీఆర్ ఎస్ తీర్థం పుచ్చుకున్న తర్వాత నుంచి తుమ్మల ప్రభావం ఆ పార్టీలో తగ్గుతూ వచ్చింది. తర్వాత తర్వాత.. కేసీఆర్ కు కూడా ఆయన దూరమయ్యారు. ఇక ఈ క్రమంలోనే తాజాగా ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు రెడీ అయ్యారు. ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతున్న సీడబ్ల్యూసీ సమావేశాల్లోనే ఆయన సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గేల సమక్షంలో హస్తం పార్టీ గూటికి చేరనున్నట్టు తెలుస్తోంది.
This post was last modified on September 16, 2023 1:02 pm
ఒకప్పుడు ఇంగ్లీష్ సినిమాలకు మన దేశంలో తెగ క్రేజ్ ఉండేది. జురాసిక్ పార్క్ నుంచి ఇది విపరీతంగా పెరిగిపోయింది. దానికి…
గత వారం విడుదలైన ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా ఫుల్ పాజిటివ్ టాకేమీ తెచ్చుకోలేదు. ప్రిమియర్స్ నుంచే డివైడ్ టాక్ మొదలైంది.…
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని విష్ణుమూర్తి అవతారంగా ప్రముఖ బాలివుడ్ నటుడు సుదేష్ బెర్రీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో…
బలమైన కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆశలన్నీ కొరియన్ కనకరాజు మీదే ఉన్నాయి. ఆగస్ట్…
ఏపీ దశ దిశలను మార్చేసే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం శనివారం ఉదయం లాంఛనంగా ప్రారంబమైంది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ అల్లూరి సీతారామరాజు…
జంతర్ మంతర్ ఆందోళనలో ప్రధాని మోదీపై విమర్శలు చేయడం కన్నీళ్లు తెప్పించిందని, పండ్లు కాసే చెట్టుపైకి రాళ్లేస్తారని, దేశం కోసం…