Political News

జ‌న‌సేన‌-టీడీపీ…”స్వీట్” షేరింగ్‌!!

ఏపీలో రాజ‌కీయ ప‌రిణామాలు వ‌డివ‌డిగా మారుతున్నాయి. వ‌చ్చే 2024 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో తాము టీడీపీతో క‌లిసి పోటీ చేయ‌నున్నామంటూ.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌క‌టించిన ద‌రిమిలా రాజ‌కీయంగా ఈ రెండు పార్టీల మ‌ధ్య బంధం ద్రుఢ‌త‌రం కాబోతోంద‌నే సంకేతాలు వ‌స్తున్నాయి. జ‌న‌సేనాని ప్ర‌క‌ట‌న‌ను ఇరు పార్టీల నాయ‌కులు, క్షేత్ర‌స్థాయిలో కార్య‌క‌ర్త‌లు కూడా.. స్వాగ‌తిస్తున్నారు. ఈ క్ర‌మంలో రాష్ట్ర వ్యాప్తంగా.. ఇరు పార్టీల నేత‌లు కూడా స్వీట్లు పంచుకుని సంబ‌రాలు చేసుకుంటున్నారు.

“వ‌చ్చే ఎన్నిక‌లు ఇప్పుడు జ‌రిగినా.. రేపు జ‌రిగినా.. షెడ్యూల్ ప్ర‌కారం 2024లో జ‌రిగినా.. మేం టీడీపీతో క‌లిసి వెళ్తాం. క‌లిసే వెళ్తాం. ఇది మా కోసం.. మా రెండు పార్టీల భ‌విష్య‌త్తు కోసం కాదు. రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్ర‌జ‌ల కోసం చేస్తున్న ప్ర‌య‌త్నం” అంటూ.. గురువారం రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైలు స‌మీపంలో నిర్వ‌హించిన మీడియా స‌మావేశంలో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు నెల‌కొన్న పొత్తుల‌పై సందేహాలు ప‌టాపంచ‌ల‌య్యాయి.

ఈ నేప‌థ్యంలో క్షేత్ర‌స్థాయిలో టీడీపీ-జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు.. చేతులు క‌లిపారు. ప్ర‌స్తుతం రెండు పార్టీల నాయ‌కుల మ‌ధ్య అవ‌గాహ‌న పెంపొందించే కార్య‌క్ర‌మాల‌కు కూడా శ్రీకారం చుట్టారు. ఇక‌, తాజాగా టీవీ చ‌ర్చ‌ల్లో పాల్గొన్న జ‌న‌సేన నాయ‌కులు, టీడీపీ నాయ‌కులు కూడా అక్క‌డిక‌క్క‌డ స్వీట్లు తినిపించుకుని.. ఇరు పార్టీల మిత్ర‌త్వాన్ని స్వాగ‌తించారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో క‌లిసి ప‌నిచేసేందుకు అనుగుణంగా త‌మ కార్యాచ‌ర‌ణ ఉంటుంద‌ని.. నాయ‌కులు ప్ర‌క‌టించారు.

ఎన్నిక‌ల్లో సీట్ల షేరింగ్ ఎలా ఉన్న‌ప్ప‌టికీ.. క్షేత్ర‌స్థాయిలో నాయ‌కుల మ‌ద్య స్వీట్ల షేరింగ్‌తో పాటు అభిప్రాయాల షేరింగ్‌… క‌లిసి వ‌చ్చే ప‌రిణామంగా ప‌రిశీల‌కులు చెబుతున్నారు. వైసీపీ ప్ర‌భుత్వాన్ని కూల‌దోయ‌డ‌మే ల‌క్ష్యంగా క‌ల‌సి ముందుకు సాగుతామ‌ని ఇరు పార్టీల నాయ‌కులు కూడా చెబుతున్నారు. ఇదే విష‌యాన్నిజ‌న‌సేన అధినేత ప‌వ‌న్ కూడా ప్ర‌క‌టించిన ద‌రిమిలా.. ఎన్నిక‌ల్లో సీట్ల షేరింగ్ క‌న్నా స్వీట్ల షేరింగ్ ద్వారా ముందు మ‌న‌సులు క‌లిసి.. తర్వాత కార్యాచ‌ర‌ణ‌కు ముందుకు క‌ద‌లాల‌ని నాయ‌కులు నిర్ణ‌యం తీసుకోవ‌డం ప‌ట్ల క్షేత్ర‌స్థాయిలో కార్య‌క‌ర్త‌లు కూడా ఉత్సాహంగా ముందుకు క‌దిలే అవ‌కాశం ఉంటుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

This post was last modified on September 15, 2023 5:09 pm

Share

Recent Posts

హనుమాన్ అంశ్… అసలు ఈ బాబా కథేంటి?

హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్‌తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…

32 minutes ago

యేషనాగుల డ్యాన్స్ ఓదెల నిర్ణయమే

నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…

49 minutes ago

కాకాని ఆగమంటున్న విశ్వంభర ?

ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…

2 hours ago

ఎపిక్ మీద నెగిటివిటీ ఎందుకంటే

నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…

3 hours ago

5జీ రావడం లేదని టెక్నీషియన్‌ను కట్టేశారా?

ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…

3 hours ago

కాళీమాత గుడిలో చేపల కూర తిన్న బీజేపీ సీఎం

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కోల్ కతాలోని కాళీ ఘాట్ ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన చేపల కూర…

3 hours ago