Political News

జ‌న‌సేన‌-టీడీపీ…”స్వీట్” షేరింగ్‌!!

ఏపీలో రాజ‌కీయ ప‌రిణామాలు వ‌డివ‌డిగా మారుతున్నాయి. వ‌చ్చే 2024 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో తాము టీడీపీతో క‌లిసి పోటీ చేయ‌నున్నామంటూ.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌క‌టించిన ద‌రిమిలా రాజ‌కీయంగా ఈ రెండు పార్టీల మ‌ధ్య బంధం ద్రుఢ‌త‌రం కాబోతోంద‌నే సంకేతాలు వ‌స్తున్నాయి. జ‌న‌సేనాని ప్ర‌క‌ట‌న‌ను ఇరు పార్టీల నాయ‌కులు, క్షేత్ర‌స్థాయిలో కార్య‌క‌ర్త‌లు కూడా.. స్వాగ‌తిస్తున్నారు. ఈ క్ర‌మంలో రాష్ట్ర వ్యాప్తంగా.. ఇరు పార్టీల నేత‌లు కూడా స్వీట్లు పంచుకుని సంబ‌రాలు చేసుకుంటున్నారు.

“వ‌చ్చే ఎన్నిక‌లు ఇప్పుడు జ‌రిగినా.. రేపు జ‌రిగినా.. షెడ్యూల్ ప్ర‌కారం 2024లో జ‌రిగినా.. మేం టీడీపీతో క‌లిసి వెళ్తాం. క‌లిసే వెళ్తాం. ఇది మా కోసం.. మా రెండు పార్టీల భ‌విష్య‌త్తు కోసం కాదు. రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్ర‌జ‌ల కోసం చేస్తున్న ప్ర‌య‌త్నం” అంటూ.. గురువారం రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైలు స‌మీపంలో నిర్వ‌హించిన మీడియా స‌మావేశంలో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు నెల‌కొన్న పొత్తుల‌పై సందేహాలు ప‌టాపంచ‌ల‌య్యాయి.

ఈ నేప‌థ్యంలో క్షేత్ర‌స్థాయిలో టీడీపీ-జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు.. చేతులు క‌లిపారు. ప్ర‌స్తుతం రెండు పార్టీల నాయ‌కుల మ‌ధ్య అవ‌గాహ‌న పెంపొందించే కార్య‌క్ర‌మాల‌కు కూడా శ్రీకారం చుట్టారు. ఇక‌, తాజాగా టీవీ చ‌ర్చ‌ల్లో పాల్గొన్న జ‌న‌సేన నాయ‌కులు, టీడీపీ నాయ‌కులు కూడా అక్క‌డిక‌క్క‌డ స్వీట్లు తినిపించుకుని.. ఇరు పార్టీల మిత్ర‌త్వాన్ని స్వాగ‌తించారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో క‌లిసి ప‌నిచేసేందుకు అనుగుణంగా త‌మ కార్యాచ‌ర‌ణ ఉంటుంద‌ని.. నాయ‌కులు ప్ర‌క‌టించారు.

ఎన్నిక‌ల్లో సీట్ల షేరింగ్ ఎలా ఉన్న‌ప్ప‌టికీ.. క్షేత్ర‌స్థాయిలో నాయ‌కుల మ‌ద్య స్వీట్ల షేరింగ్‌తో పాటు అభిప్రాయాల షేరింగ్‌… క‌లిసి వ‌చ్చే ప‌రిణామంగా ప‌రిశీల‌కులు చెబుతున్నారు. వైసీపీ ప్ర‌భుత్వాన్ని కూల‌దోయ‌డ‌మే ల‌క్ష్యంగా క‌ల‌సి ముందుకు సాగుతామ‌ని ఇరు పార్టీల నాయ‌కులు కూడా చెబుతున్నారు. ఇదే విష‌యాన్నిజ‌న‌సేన అధినేత ప‌వ‌న్ కూడా ప్ర‌క‌టించిన ద‌రిమిలా.. ఎన్నిక‌ల్లో సీట్ల షేరింగ్ క‌న్నా స్వీట్ల షేరింగ్ ద్వారా ముందు మ‌న‌సులు క‌లిసి.. తర్వాత కార్యాచ‌ర‌ణ‌కు ముందుకు క‌ద‌లాల‌ని నాయ‌కులు నిర్ణ‌యం తీసుకోవ‌డం ప‌ట్ల క్షేత్ర‌స్థాయిలో కార్య‌క‌ర్త‌లు కూడా ఉత్సాహంగా ముందుకు క‌దిలే అవ‌కాశం ఉంటుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

This post was last modified on September 15, 2023 5:09 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

నాడూ మూడే!… నేడూ మూడే!

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…

23 minutes ago

మోడీ ముందు జ‌గ‌న్ మ‌రింత‌ ప‌లుచ‌న‌!

ప్ర‌స్తుతం ఎవ‌రు ఔన‌న్నా.. కాద‌న్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజ‌కీయాల‌కు కూడా ప్ర‌ధాని మోడీ పెద్ద‌దిక్కుగా మారారన్నది వాస్త‌వం. ఆయ‌న‌ను…

1 hour ago

రాముడి పాత్ర వద్దన్న రణబీర్

ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్‌లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…

2 hours ago

దళిత క్రైస్తవుల విషయంలో జగన్ కన్నా షర్మిలే బెటర్?

వైసీపీ అధినేత, తన బ్రదర్ జగన్‌పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్…

2 hours ago

గుణశేఖర్ గారు లాజిక్ మిస్సయ్యారు

ఒక్కడు, చూడాలని ఉంది లాంటి అద్భుతమైన బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు గుణశేఖర్ కొత్త మూవీ యుఫొరియా ఫిబ్రవరిలో విడుదలైన…

2 hours ago

షాకిచ్చిన రామ్ చరణ్… పెద్ది వస్తోందా?

ఏప్రిల్ 30 పెద్ది రావడం లేదని లోకం కోడై కూస్తోంది. నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించకపోయినా ఇతర నిర్మాతలు ఆ…

3 hours ago