ఆంధ్రప్రదేశ్లో బీజేపీ మరోసారి ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడపక తప్పదా? టీడీపీతో కలిసి వెళ్లడం తప్ప ఆ పార్టీకి మరో మార్గం లేదా? అంటే రాజకీయ వర్గాల నుంచి అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. ఏపీలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పని చేయడం ఖాయమనే సూచనలు కనిపిస్తున్నాయి. తాజాగా టీడీపీతోనే కలిసి సాగుతామని, కలిసే ఎన్నికల్లో పోటీ చేస్తామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించడమే అందుకు కారణమని చెప్పాలి.
ప్రత్యేక హోదా విషయంలో టీడీపీతో తెగదెంపులు చేసుకున్న జనసేన.. 2019 ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేసింది. కానీ ఆ తర్వాత మూడు రాజధానులకు వ్యతిరేకమంటూ, రాష్ట్ర ప్రయోజనాల కోసమని బీజేపీతో ఆ పార్టీ కలిసింది. అప్పటి నుంచి జనసేన, బీజేపీ పొత్తులోనే ఉన్నాయి. కానీ టీడీపీని మాత్రం దూరం పెడుతూ వచ్చాయి. ఈ రెండు పార్టీలతో కలిసేందుకు టీడీపీ ప్రయత్నిస్తోందనే అభిప్రాయాలు వినిపించాయి. కానీ ముఖ్యమంత్రి కావాలనే లక్ష్యంతో ఉన్న పవన్.. టీడీపీతో పొత్తు విషయంలో దీర్ఘంగా ఆలోచించారనే చెప్పాలి. ఇప్పుడు చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో జగన్పై పోరాటానికి టీడీపీతో కలిసి పని చేస్తామని పవన్ అన్నారు. ఇది తమ కోసం కాదని రాష్ట్రం కోసమని మరోసారి నొక్కి చెప్పారు.
మరి టీడీపీ, జనసేన పొత్తుపై బీజేపీ ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తి రేపుతోంది. టీడీపీతో కలిసి సాగుతామని ప్రకటించిన పవన్.. బీజేపీ కూడా కలిసి వస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కానీ బీజేపీ మాత్రం వేచి చూసే ధోరణి అవలంబిస్తోందని తెలిసింది. పొత్తు విషయం జాతీయ నేతలు చూసుకుంటారని రాష్ట్ర బీజేపీ నేతలు చేతులు దులుపేసుకున్నారు. కానీ పొత్తు తప్ప బీజేపీకి మరో మార్గం కనిపించడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పైగా ఇప్పుడు బీజేపీ ఏపీ అధ్యక్షురాలిగా చంద్రబాబు వదిన పురందేశ్వరి ఉన్నారు. దీంతో టీడీపీ, జనసే, బీజేపీ కలిసి ముందుకు సాగడం ఖాయమేనన్న అంచనాలు కలుగుతున్నాయి.
This post was last modified on September 15, 2023 8:37 pm
నిర్మాత దిల్ రాజు అన్నట్టు వందల సినిమాలు తీయకపోయినా కెవిఎన్ ప్రొడక్షన్స్ అనేది ఇప్పుడు అన్ని బాషల ఇండస్ట్రీలో హాట్…
మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ‘కాాకా’ నుంచి ఇటీవల రిలీజ్ చేసిన టైటిల్ గ్లింప్స్ మెగా అభిమానులనే కాక సామాన్య…
కింగ్ సైజ్ ఫిలిం మేకర్ అని ఎవరికైనా బిరుదు ఇవ్వాల్సి వస్తే అందరి మదిలో మెదిలే ఒకే ఒక్క పేరు…
మాస్ రాజా రవితేజ నిఖార్సయిన హిట్టు కొట్టి నాలుగేళ్లయింది. ఈ నాలుగేళ్లలో ఆయన ఆరు చిత్రాలతో పలకరించాడు. వీటిలో కొన్ని…
ఏదైనా మితంగా తింటేనే అందం. మితిమీరిందా పొట్ట ఉబ్బిపోయి డాక్టర్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. తిండి సామెత సినిమాలకు కూడా…
కరోనా తర్వాత థియేటర్స్ కి జనం మళ్ళీ వచ్చేలా చేసిన సినిమాల్లో జాంబీ రెడ్డి ఉంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ…