ఏపీ సీఎం జగన్కే కాకుండా.. ఆయన సతీమణి వైఎస్ భారతికి కూడా ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తక్షణమే రెండు వారాల్లో తమకు సమాధానం చెప్పాలని.. ఢిల్లీ హైకోర్టు సదరు నోటీసుల్లో పేర్కొంది. విషయంలోకి వెళ్తే.. సీఎం జగన్ నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం వలంటీర్లు, గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది అందరూ కూడా ప్రభుత్వ సమాచారం, పథకాలు, కీలక నిర్ణయాలపై ఎప్పటికప్పుడు అప్ డేట్ కావాలని, ఆయా అంశాలపై అవగాహన పెంచుకోవాలని ఏడాదిన్నర కిందట ఆదేశాలు జారీ చేసింది.
ఈ క్రమంలో ప్రభుత్వ పథకాలపై ఎప్పటిప్పుడు వార్తలు ఇచ్చే సాక్షి పత్రికను(పరోక్షంగా చెప్పింది) కొనుగోలు చేయాలని అప్రకటిత ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో సచివాలయ సిబ్బంది, వలంటీర్లకు నెలకు రూ.200 చొప్పున(ప్రజాధనం) ఇస్తూ ఉత్తర్వులు జారీ చేయడమే కాకుండా.. నిధులు కూడా మంజూరు చేసింది. అయితే.. ఈ నిర్ణయాన్ని ఈనాడు
దిన పత్రిక ఏపీ హైకోర్టులో సవాల్ చేసింది. ఇలా ఒక పత్రికను కొనుగోలు చేయాలంటూ.. సర్కారు ఉత్తర్వులు ఇవ్వడాన్ని ఈనాడు తప్పుబట్టింది.
అయితే, దీనిని విచారించిన రాష్ట్ర హైకోర్టు సర్కారు నిర్ణయాన్ని సమర్థించింది. దీంతో ఈనాడు యాజమాన్యం.. సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిని విచారించిన సుప్రీంకోర్టు ఈ కేసును రాష్ట్రంలోనే తేల్చుకోవాలని తేల్చి చెప్పింది. దీంతో ఇరు వర్గాలకు మధ్యే మార్గంగా ఢిల్లీ హైకోర్టును ఎంపిక చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఈ కేసును ఢిల్లీ హైకోర్టు విచారిస్తోంది. తాజాగా సీఎం జగన్, ఆయన సతీమణి, సాక్షి ఎండీ భారతీరెడ్డిలకు కోర్టు నుంచి నోటీసులు అందాయి.
ప్రభుత్వ పథకాలు ఒక్క సాక్షిలోనే ఎలా ప్రచురిస్తారో.. చెప్పాలని, ఇతర పత్రికలు కూడా ప్రచురిస్తాయి కదా! అని నోటీసుల్లో ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. ఈ నోటీసులను స్థానిక మంగళగిరి కోర్టు ద్వారా ఢిల్లీ హైకోర్టు పంపించింది. నోటీసులు తీసుకుని సీఎం క్యాంపు కార్యాలయానికి కోర్టు సిబ్బంది వచ్చి అందజేసినట్టు సమచారం. సాక్షి చైర్ పర్సన్ హోదాలో సీఎం సతీమణి భారతికి కూడా నోటీసులు అందించారు.
This post was last modified on September 14, 2023 6:19 pm
ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ ఏడాది పలు పొలిటికల్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. వైసీపీకి అనుకూలంగా యాత్ర-2,వ్యూహం,…
140 కోట్ల ప్రజలున్న అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మన భారతదేశం. ఇక్కడ సార్వత్రిక ఎన్నికలు నిర్వహించడం అంటే కత్తి మీద…
మంచు విష్ణు హీరోగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న కన్నప్పలో భారీ కాస్టింగ్ ఉన్న సంగతి తెలిసిందే. ప్రభాస్, అక్షయ్ కుమార్,…
అమెరికాలో మరో ఇద్దరు తెలుగు విద్యార్థులు మరణించారు. ఉన్నత చదువులు చదివి ఉన్నత శిఖరాలకు ఎదగాలన్న వారి కలలు నిండకుండానే…
టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ పిఠాపురంలో పోటీ చేస్తున్న మామ పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం కాదని నంద్యాలలో తన…
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు కౌంట్డౌన్ దగ్గరపడుతోంది. మరొక్క రోజు గడువు మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అసెంబ్లీ…