Political News

సీఎం జ‌గ‌న్ దంప‌తుల‌కు హై కోర్టు నోటీసులు.. రీజ‌న్ ఇదే!

ఏపీ సీఎం జ‌గ‌న్‌కే కాకుండా.. ఆయ‌న స‌తీమ‌ణి వైఎస్‌ భార‌తికి కూడా ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. త‌క్ష‌ణ‌మే రెండు వారాల్లో త‌మ‌కు స‌మాధానం చెప్పాల‌ని.. ఢిల్లీ హైకోర్టు స‌ద‌రు నోటీసుల్లో పేర్కొంది. విష‌యంలోకి వెళ్తే.. సీఎం జ‌గ‌న్ నేతృత్వంలోని ఏపీ ప్ర‌భుత్వం వ‌లంటీర్లు, గ్రామ, వార్డు స‌చివాల‌యాల సిబ్బంది అంద‌రూ కూడా ప్ర‌భుత్వ స‌మాచారం, ప‌థ‌కాలు, కీల‌క నిర్ణ‌యాల‌పై ఎప్ప‌టిక‌ప్పుడు అప్ డేట్ కావాల‌ని, ఆయా అంశాల‌పై అవ‌గాహ‌న పెంచుకోవాల‌ని ఏడాదిన్న‌ర కింద‌ట ఆదేశాలు జారీ చేసింది.

ఈ క్ర‌మంలో ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌పై ఎప్ప‌టిప్పుడు వార్త‌లు ఇచ్చే సాక్షి ప‌త్రిక‌ను(ప‌రోక్షంగా చెప్పింది) కొనుగోలు చేయాల‌ని అప్ర‌క‌టిత ఆదేశాలు జారీ చేసింది. ఈ క్ర‌మంలో స‌చివాల‌య సిబ్బంది, వ‌లంటీర్ల‌కు నెల‌కు రూ.200 చొప్పున‌(ప్ర‌జాధ‌నం) ఇస్తూ ఉత్త‌ర్వులు జారీ చేయ‌డ‌మే కాకుండా.. నిధులు కూడా మంజూరు చేసింది. అయితే.. ఈ నిర్ణ‌యాన్ని ఈనాడు దిన ప‌త్రిక ఏపీ హైకోర్టులో స‌వాల్ చేసింది. ఇలా ఒక ప‌త్రిక‌ను కొనుగోలు చేయాలంటూ.. స‌ర్కారు ఉత్త‌ర్వులు ఇవ్వ‌డాన్ని ఈనాడు త‌ప్పుబ‌ట్టింది.

అయితే, దీనిని విచారించిన రాష్ట్ర హైకోర్టు స‌ర్కారు నిర్ణ‌యాన్ని స‌మ‌ర్థించింది. దీంతో ఈనాడు యాజ‌మాన్యం.. సుప్రీంకోర్టును ఆశ్ర‌యించింది. దీనిని విచారించిన సుప్రీంకోర్టు ఈ కేసును రాష్ట్రంలోనే తేల్చుకోవాల‌ని తేల్చి చెప్పింది. దీంతో ఇరు వ‌ర్గాల‌కు మ‌ధ్యే మార్గంగా ఢిల్లీ హైకోర్టును ఎంపిక చేసుకున్నాయి. ఈ నేప‌థ్యంలో ఈ కేసును ఢిల్లీ హైకోర్టు విచారిస్తోంది. తాజాగా సీఎం జగన్, ఆయన సతీమణి, సాక్షి ఎండీ భారతీరెడ్డిలకు కోర్టు నుంచి నోటీసులు అందాయి.

ప్ర‌భుత్వ ప‌థ‌కాలు ఒక్క సాక్షిలోనే ఎలా ప్ర‌చురిస్తారో.. చెప్పాల‌ని, ఇత‌ర ప‌త్రిక‌లు కూడా ప్ర‌చురిస్తాయి క‌దా! అని నోటీసుల్లో ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. ఈ నోటీసులను స్థానిక మంగళగిరి కోర్టు ద్వారా ఢిల్లీ హైకోర్టు పంపించింది. నోటీసులు తీసుకుని సీఎం క్యాంపు కార్యాలయానికి కోర్టు సిబ్బంది వచ్చి అందజేసినట్టు సమచారం. సాక్షి చైర్ ప‌ర్స‌న్ హోదాలో సీఎం స‌తీమ‌ణి భార‌తికి కూడా నోటీసులు అందించారు.

Satya

Recent Posts

30 దాటాక కూడా రేస్‌లో ఉండాలంటే…

ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ కు ఒక ఎక్స్ పైరీ డేట్ ఉంటుందనేది ఎప్పటినుంచో వినిపించే మాటే. పాతికేళ్ల నుంచి ముప్పై…

4 hours ago

మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రితో లోకేష్ భేటీ రీజ‌నేంటి?

మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి, బీజేపీ సీనియ‌ర్ నాయ‌కుడు దేవేంద్ర ఫ‌డ‌ణవీస్‌తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…

5 hours ago

నమ్మకం టన్నుల్లో… రామ్ చరణ్ మాటల్లో

విజయవాడ పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా ముగిసింది. ఏర్పాట్ల దగ్గరి నుంచి అయిపోయే దాకా ఎక్కడా అపశ్రుతి లేకుండా…

6 hours ago

జ‌గ‌న్‌కు క‌విత మ‌ద్ద‌తిస్తున్నారా?

తెలంగాణ నాయ‌కురాలు, తెలంగాణ ర‌క్ష‌ణ సేన‌(టీఆర్ఎస్‌) పార్టీ అధ్య‌క్షురాలు క‌విత తాజాగా చేసిన వ్యాఖ్య‌ల‌పై సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున…

6 hours ago

మస్సా మస్సా… లెక్క సరిపోయింది

పెద్ది నుంచి ఏదైనా బ్యాంగర్ లాంటి కంటెంట్ కావాలని ఎదురు చూస్తున్న అభిమానులకు అది మస్సా మస్సా వీడియో సాంగ్…

6 hours ago

ప‌క్కా మాస్… క‌ల్లు రుచి చూసిన బాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబు.. తాజాగా క‌ల్లు రుచి చూశారు. వాస్త‌వానికి ఆయ‌న ఇలాంటి వాటికి క‌డు దూరంగా ఉంటారు. అయితే..…

7 hours ago