AP CM YS Jagan Pressmeet
ఏపీ సీఎం జగన్కే కాకుండా.. ఆయన సతీమణి వైఎస్ భారతికి కూడా ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తక్షణమే రెండు వారాల్లో తమకు సమాధానం చెప్పాలని.. ఢిల్లీ హైకోర్టు సదరు నోటీసుల్లో పేర్కొంది. విషయంలోకి వెళ్తే.. సీఎం జగన్ నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం వలంటీర్లు, గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది అందరూ కూడా ప్రభుత్వ సమాచారం, పథకాలు, కీలక నిర్ణయాలపై ఎప్పటికప్పుడు అప్ డేట్ కావాలని, ఆయా అంశాలపై అవగాహన పెంచుకోవాలని ఏడాదిన్నర కిందట ఆదేశాలు జారీ చేసింది.
ఈ క్రమంలో ప్రభుత్వ పథకాలపై ఎప్పటిప్పుడు వార్తలు ఇచ్చే సాక్షి పత్రికను(పరోక్షంగా చెప్పింది) కొనుగోలు చేయాలని అప్రకటిత ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో సచివాలయ సిబ్బంది, వలంటీర్లకు నెలకు రూ.200 చొప్పున(ప్రజాధనం) ఇస్తూ ఉత్తర్వులు జారీ చేయడమే కాకుండా.. నిధులు కూడా మంజూరు చేసింది. అయితే.. ఈ నిర్ణయాన్ని ఈనాడు దిన పత్రిక ఏపీ హైకోర్టులో సవాల్ చేసింది. ఇలా ఒక పత్రికను కొనుగోలు చేయాలంటూ.. సర్కారు ఉత్తర్వులు ఇవ్వడాన్ని ఈనాడు తప్పుబట్టింది.
అయితే, దీనిని విచారించిన రాష్ట్ర హైకోర్టు సర్కారు నిర్ణయాన్ని సమర్థించింది. దీంతో ఈనాడు యాజమాన్యం.. సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిని విచారించిన సుప్రీంకోర్టు ఈ కేసును రాష్ట్రంలోనే తేల్చుకోవాలని తేల్చి చెప్పింది. దీంతో ఇరు వర్గాలకు మధ్యే మార్గంగా ఢిల్లీ హైకోర్టును ఎంపిక చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఈ కేసును ఢిల్లీ హైకోర్టు విచారిస్తోంది. తాజాగా సీఎం జగన్, ఆయన సతీమణి, సాక్షి ఎండీ భారతీరెడ్డిలకు కోర్టు నుంచి నోటీసులు అందాయి.
ప్రభుత్వ పథకాలు ఒక్క సాక్షిలోనే ఎలా ప్రచురిస్తారో.. చెప్పాలని, ఇతర పత్రికలు కూడా ప్రచురిస్తాయి కదా! అని నోటీసుల్లో ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. ఈ నోటీసులను స్థానిక మంగళగిరి కోర్టు ద్వారా ఢిల్లీ హైకోర్టు పంపించింది. నోటీసులు తీసుకుని సీఎం క్యాంపు కార్యాలయానికి కోర్టు సిబ్బంది వచ్చి అందజేసినట్టు సమచారం. సాక్షి చైర్ పర్సన్ హోదాలో సీఎం సతీమణి భారతికి కూడా నోటీసులు అందించారు.
యూపీలోని మహారాజ్గంజ్ జిల్లా నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బీ) బలగాలకు ఒక విదేశీయుడు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా సినిమా ఫలితాన్ని తేల్చి చెప్పేది బాక్సాఫీస్ వసూళ్లే. అవి ఎంత ఘనంగా వచ్చాయనే దాన్ని బట్టే…
రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…
తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…
టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…
ఏపీ సీఎం చంద్రబాబు కలల ప్రాజెక్టు.. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం `ప్రత్యేక`…