తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ వ్యవహారం రాజకీయంగా పెద్ద దుమారానికే దారి తీసింది. ప్రధానంగా తెలుగుదేశం వెర్సస్ వైఎస్సార్ కాంగ్రెస్ అన్నట్లుగా ఉండాల్సిన వ్యవహారం కాస్తా.. తెలుగుదేశంతో బంధం ఉన్న రెండు కుటుంబాల్లో చిచ్చుగా మారుతున్న పరిస్థితి కనిపిస్తోంది. నందమూరి వెర్సస్ నారా ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ముఖ్యంగా ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ విషయం పెద్ద చర్చకు తావిస్తోంది.
చంద్రబాబు అరెస్ట్ను ఖండిస్తూ తారక్ ప్రకటన చేయకపోవడంపై తెలుగుదేశంలోనే ఒక వర్గం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా.. పార్టీ నుంచి తారక్ను పూర్తిగా దూరం పెడుతున్నపుడు అతనెందుకు ఖండన ఇవ్వాలి అంటూ మరో వర్గం వాదిస్తోంది. ఇదిలా ఉంటే.. తారక్ మీద విషం చిమ్ముతూ సోషల్ మీడియాలో కొన్ని హ్యాండిల్స్ అదే పనిగా పోస్టులు పెడుతుండటం.. అలాగే మీడియాకు కూడా తారక్కు వ్యతిరేకంగా బైట్స్ ఇస్తుండటం గమనార్హం.
తారక్ జగన్తో చేతులు కలిపాడని.. ఆ మధ్య తనను కలిసిన కేంద్ర హోం మంత్రి అమిత్షాతో సంప్రదింపులు జరుపుతున్నాడని.. చంద్రబాబు అరెస్ట్ వెనుక తారక్ ఉన్నాడని.. ఇలా రకరకాలుగా పోస్టులు పెడుతోంది ఈ వర్గం. ఇలా తారక్ మీద నెగెటివ్ పోస్టులు పెట్టి తెలుగుదేశంలో బాబు, లోకేష్లను మద్దతుగా నిలిచే వర్గాన్ని బ్యాడ్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది.
ఐతే ఇదంతా వైసీపీని తెర వెనుక ఉండి నడిపించే ఐప్యాక్ టీం పనే అని తెలుగుదేశం వర్గాలు సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి. తాజాగా వైరల్ అయిన ఒక వీడియోలో తారక్ను తిట్టిపోసిన మహిళ వైసీపీ కార్యకర్త అని ఈ వర్గాలు చెబుతున్నాయి. తెలుగుదేశం వాళ్ల పేరుతో ఇలా కొందరిని రంగంలోకి దించి తారక్ మీద విషం చిమ్మడం తద్వారా తెలుగుదేశం వాళ్లే వర్గాలుగా విడిపోయి కొట్టుకోవడం ఈ కాన్సెప్ట్ లక్ష్యమని వాళ్లు ఆరోపిస్తున్నారు.
టాలీవుడ్ అగ్రశ్రేణి డ్యాన్స్ మాస్టర్లు ఇద్దరి మధ్య వివాదం రాజుకుంది. జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ మధ్య ఘర్షణ చోటు…
మలయాళ హీరో అయినప్పటికీ సలార్ నుంచి పృథ్విరాజ్ సుకుమారన్ కు మన దగ్గర కూడా ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ నమ్మకంతోనే…
ఘట్టమనేని మూడో తరం నుంచి మొదటి వారసుడు జయకృష్ణ తొలి సినిమా శ్రీనివాస మంగాపురం జూలై 30 విడుదలకు రెడీ…
ఏపీలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే ప్రముఖులపై అసభ్యకరమైన రీతిలో వ్యాఖ్యలు చేసిన కారణంగా ప్రశ్న రావణ్ సహా పలువురు…
టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల వ్యవహారం అదిగో పులి ఇదిగో తోక కథలా మారిపోయింది. ఒక డేట్ వేయడం, దానికి…
పశ్చిమాసియాలో నెలకొన్న శాంతియుత పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తంగా మారిపోయాయి. ఇరాన్ ను లక్ష్యంగా చేసుకుని అమెరికా భీకర దాడులకు దిగింది.…