న్యాయం కనుచూపు మేరలో కూడా కనిపించనప్పుడు కత్తి పట్టడమే మేలు అంటున్నారు చంద్రబాబు తరఫున వాదనలు వినిపిస్తున్న న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేతను అరెస్ట్ చేసిన వెంటనే లాయర్ లూథ్రా ఢిల్లీ నుంచి చంద్రబాబు వైపు ఆయన వాదనలు వినిపించడానికి ఏపీకి చేరుకున్నారు.
ఈ క్రమంలో ఆయన వాదనలు వినిపించిన తరువాత బాబుకు 14 రోజుల రిమాండ్ విధించడంతో ఆయన తిరిగి ఢిల్లీకి చేరుకున్నారు. ఈ క్రమంలో ఆయన చేసిన ఓ ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ న్యాయం అనేది కనుచూపు మేరలో కూడా కనిపించనప్పుడు కత్తి పట్టడమే మేలు అంటూ ఆయన పోస్ట్ చేశారు.
ఈ మాటలకు సంబంధించిన ఓ ఫోటోను కూడా ఆయన పోస్ట్ చేశారు. అది ఏంటి అంటే ఉర్దూలో గురుగోవింద్ సింగ్ ప్రస్తావించిన మాటల చిత్రాన్ని ఆయన ఆ పోస్ట్ కు ట్యాగ్ చేశారు. ఏసీబీ కోర్టులో రిమాండ్ అవసరం లేదని ఆయన ఎంతగా వాదించినప్పటికీ బాబుకి న్యాయమూర్తి రిమాండ్ విధించారు.
ఈ నేపథ్యంలో ఆయన ఈ ట్వీట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. దీని కంటే ముందు ఆయన “ఏపీ మాజీ సీఎం చంద్రబాబు కేసులో వాదించడం కోసం శుక్రవారం సాయంత్రం 4 గంటల నుంచి విజయవాడలో వేచి ఉన్నాను. ఈ న్యాయవాద వృత్తిలో ఎప్పుడూ నిస్తేజంగా ఉండకూడదు!” అని ట్వీట్ చేశారు.
This post was last modified on September 13, 2023 11:20 pm
ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ఉవ్వెత్తున సాగుతున్న నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి…
ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికలు(అసెంబ్లీ+పార్లమెంటు) ప్రశాంతంగా జరిగాయని ఎన్నికలు సంఘం చెబుతోంది. అయితే.. ప్రశాంతత కొన్ని నియోజకవర్గాలకు.. జిల్లాలకు మాత్రమే…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల ఆంధ్రప్రదేశ్లోని నంద్యాలకు వెళ్లి వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి అయిన శిల్పా రవికి ప్రచారం…
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పలు చోట్ల అధికార వైఎస్సార్ పార్టీ నేతలు, కార్యకర్తలు దాడులకు పాల్పడ్డ ఉదంతాలు మీడియాలో…
ఎన్నికల అంకం ముగింపుకొస్తున్న తరుణంలో అందరి దృష్టి క్రమంగా సినిమాల వైపు మళ్లుతోంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ప్లానింగ్ ఎలా…
కీలకమైన నాలుగోదశ ఎన్నికల పోలింగ్ సమయంలో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవా ల్.. సంచలన ప్రకటన చేశారు.…