బీజేపీలో చేరాలని అనుకున్న క్యాసినో కింగ్ చికోటి ప్రవీణ్ కుమార్ కు బ్రేకులు పడ్డాయి. పార్టీలో చేరేందుకు చికోటి అన్నీ ఏర్పాట్లు చేసేసుకున్నారు. కేంద్రమంత్రి, తెలంగాణా అద్యక్షుడు కిషన్ రెడ్డి సమక్షంలో పార్టీ కండువా కప్పుకునేందుకు అన్నీ ఏర్పాట్లు పూర్తయ్యాయి. నాంపల్లిలోని పార్టీ ఆఫీసు ముందు భారీ కటౌట్లు కూడా ఏర్పాటుచేసుకున్నారు. పేపర్లలో పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్లు కూడా ఇచ్చుకున్నారు. వందలాది వాహనాల్లో మంగళవారం మధ్యాహ్నం పార్టీ ఆఫీసుకు వెళ్ళిన చికోటికి విచిత్రమైన పరిస్ధితి ఎదురైంది.
ఆ పరిస్ధితి ఏమిటంటే చికోటి పార్టీ ఆఫీసుకు చేరుకునే సమయానికి సీనియర్లు కాదు కదా చివరకు కిషన్ రెడ్డి కూడా లేరు. పార్టీ ఆఫీసులో ఒక్కరంటే ఒక్క సీనియర్ నేత కనబడలేదు. దాంతో చికోటికి షాక్ కొట్టినట్లయ్యింది. పార్టీలో చేరటానికి ఎంతో అట్టహాసంగా ఏర్పాట్లు చేసుకుని వస్తే ముందుగా మాట్లాడుకుని వచ్చిన తర్వాత కూడా ఎవరు లేకపోవటం ఏమిటో క్యాసినో కింగ్ కు అర్ధంకాలేదు. అయితే దాన్ని సమర్ధించుకునేందుకు తనకు పార్టీలోని ముఖ్యులకు ఏదో మిస్ కమ్యూనికేషన్ వచ్చినట్లు ప్రకటించారు.
ఈ సమస్యను తొందరగానే క్లియర్ చేస్తానని పార్టీలో చేరికపై బుధవారం రాత్రిలోగా క్లారిటి ఇస్తానని తన మద్దతుదారులకు చెప్పుకున్నారు. తర్వాత ఎలా వచ్చారో అలాగే తిరిగి వెళ్ళిపోయారు. అయితే పార్టీ వర్గాల సమాచారం ఏమిటంటే చికోటి అంటే క్యాసినో కింగ్ అనే పాపులర్. విదేశాలకు బృందాలను తీసుకెళ్ళి క్యాసినోలు ఆడించి బాగా డబ్బు సంపాదించినట్లు ఆరోపణలున్నాయి.
థాయిల్యాండులో క్యాసినో ఆడుతుండగా పోలీసులు చికోటిని అరెస్టు చేసిన విషయం అప్పట్లో తెలుగురాష్ట్రాల్లో సంచలనంగా మారింది. చికోటి ఎంత పాపులరైనా నెగిటివ్ గా పాపులరయ్యారు కానీ పాజిటివ్ గా కాలేదు. ఇపుడు చికోటి దగ్గర డబ్బుందని, మద్దతుదారులుంటారని పార్టీలో చేర్చుకుంటే దాని ప్రభావం పార్టీపైన నెగిటివ్ గానే పడుతుందని సీనియర్లు అనుమానించారని సమాచారం. ఈ కారణంగానే బీజేపీలో చికోటి చేరిక విషయంలో పార్టీ ఆఫీసులో విచిత్రమైన వాతావరణం కనబడింది. మరి ఈరోజు రాత్రం చికోటి ఇవ్వబోయే క్లారిటి ఏమిటన్నది ఆసక్తిగా మారింది.
This post was last modified on September 13, 2023 11:19 am
ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…