Political News

చంద్రబాబును కలిసిన భువనేశ్వరి..ఎమోషనల్

రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుతో ములాఖత్ కు ఆయన కుటుంబ సభ్యులను ఈ రోజు అనుమతించారు. ముగ్గురు కుటుంబ సభ్యులకు అనుమతి లభించింది. ఈ క్రమంలోనే చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, తనయుడు నారా లోకేష్, కోడలు నారా బ్రాహ్మణి..జైలులో చంద్రబాబును కలిశారు. వారితోపాటు బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని, ఆమె భర్త భరత్ వచ్చినప్పటికీ అనుమతి లేక జైలు బయట ఉండాల్సి వచ్చింది. దాదాపు 45 నిమిషాల పాటు ములాఖత్ కు సమయం ఇచ్చారు.

ఈ క్రమంలోనే చంద్రబాబును కలిసిన తర్వాత భువనేశ్వరి మీడియాతో మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. జైల్లో ఉన్న చంద్రబాబును కలిసి బయటకు వస్తుంటే తనలో ఒక భాగం అక్కడే వదిలేసినట్లుగా అనిపించిందని భువనేశ్వరి ఎమోషనల్ గా మాట్లాడారు. నిత్యం ప్రజల గురించి ఆలోచించే చంద్రబాబును జైల్లో చూడడం బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏమీ లేని కేసులో ఇరికించి ఆయనను జైల్లో పెట్టారని ఆరోపించారు. తన తండ్రి ఎన్టీఆర్ స్థాపించిన ఈ పార్టీ అనుక్షణం ప్రజల కోసమే పని చేస్తోందని, జైల్లో ఉండి కూడా ప్రజల కోసమే ఆయన పరితపిస్తున్నారని అన్నారు.

తాను ఆరోగ్యంగా, బాగానే ఉన్నానని, భయపడవద్దని ఆయన తనకు ధైర్యం చెప్పారని వెల్లడించారు. జైల్లో అన్ని సౌకర్యాలు ఉన్నట్లు కనిపించడం లేదని, చన్నీటితో స్నానం చేయాల్సి వస్తోందని చెప్పారు. చంద్రబాబు అరెస్టు కావడం తమ కుటుంబానికి, పార్టీకి కష్టసమయమని, ప్రజలంతా అండగా ఉండాలని ఆమె కోరారు. చంద్రబాబు భద్రత గురించి తాను ఆలోచిస్తున్నానని చెప్పారు.

This post was last modified on September 13, 2023 9:18 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

తిన్న తర్వాత ఈ ఒక్క పని చేస్తే మీ ఆరోగ్యం పదిలం..

మనకు జీవితంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎంత ముఖ్యమో అందరికీ తెలిసిందే. కానీ కొన్ని చిన్న అలవాట్లను మనం నిర్లక్ష్యం చేస్తుంటాము.…

51 minutes ago

బాలయ్య పుట్టిన రోజు కానుకలు ఇవేనా?

నందమూరి బాలకృష్ణ తన ప్రతి పుట్టిన రోజుకూ అభిమానులకు సినిమాల పరంగా కానుక ఇస్తుంటాడు. అప్పటికి నటిస్తున్న సినిమా నుంచి…

3 hours ago

కన్నడ నుంచి మరో బిగ్ మూవీ

ఒకప్పుడు కన్నడ సినిమా అంటే రొటీన్ మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్. ఆ మాస్ సినిమాలు కూడా ఎక్కువగా తెలుగు, తమిళం…

6 hours ago

ఈ సారి అమరావతికి మోదీ ఎం తెస్తున్నారు?

నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో పునర్నిర్మాణ పనులకు త్వరలోనే అడుగు పడనుంది. మే 2న అమరావతి రానున్న భారత ప్రదాన మంత్రి నరేంద్ర మోదీ…

9 hours ago

పొట్ట తగ్గటానికి ఈ పండ్లు తింటే చాలు

ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ స్టైల్, స్ట్రెస్ కారణంగా చాలామంది ఊబకాయం ,బెల్లీ ఫ్యాట్ తో భాద పడుతున్నారు. మరీ…

10 hours ago

ప్రజలు ఇబ్బంది పడుతున్నారు మంత్రులు

ఏపీ మంత్రి వ‌ర్గంలో సీఎం చంద్ర‌బాబు గీస్తున్న ల‌క్ష్మ‌ణ రేఖ‌ల‌కు.. ఆయ‌న ఆదేశాల‌కు కూడా.. పెద్ద‌గా రెస్పాన్స్ ఉండ‌డం లేద‌ని…

10 hours ago