Political News

చంద్రబాబును కలిసిన భువనేశ్వరి..ఎమోషనల్

రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుతో ములాఖత్ కు ఆయన కుటుంబ సభ్యులను ఈ రోజు అనుమతించారు. ముగ్గురు కుటుంబ సభ్యులకు అనుమతి లభించింది. ఈ క్రమంలోనే చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, తనయుడు నారా లోకేష్, కోడలు నారా బ్రాహ్మణి..జైలులో చంద్రబాబును కలిశారు. వారితోపాటు బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని, ఆమె భర్త భరత్ వచ్చినప్పటికీ అనుమతి లేక జైలు బయట ఉండాల్సి వచ్చింది. దాదాపు 45 నిమిషాల పాటు ములాఖత్ కు సమయం ఇచ్చారు.

ఈ క్రమంలోనే చంద్రబాబును కలిసిన తర్వాత భువనేశ్వరి మీడియాతో మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. జైల్లో ఉన్న చంద్రబాబును కలిసి బయటకు వస్తుంటే తనలో ఒక భాగం అక్కడే వదిలేసినట్లుగా అనిపించిందని భువనేశ్వరి ఎమోషనల్ గా మాట్లాడారు. నిత్యం ప్రజల గురించి ఆలోచించే చంద్రబాబును జైల్లో చూడడం బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏమీ లేని కేసులో ఇరికించి ఆయనను జైల్లో పెట్టారని ఆరోపించారు. తన తండ్రి ఎన్టీఆర్ స్థాపించిన ఈ పార్టీ అనుక్షణం ప్రజల కోసమే పని చేస్తోందని, జైల్లో ఉండి కూడా ప్రజల కోసమే ఆయన పరితపిస్తున్నారని అన్నారు.

తాను ఆరోగ్యంగా, బాగానే ఉన్నానని, భయపడవద్దని ఆయన తనకు ధైర్యం చెప్పారని వెల్లడించారు. జైల్లో అన్ని సౌకర్యాలు ఉన్నట్లు కనిపించడం లేదని, చన్నీటితో స్నానం చేయాల్సి వస్తోందని చెప్పారు. చంద్రబాబు అరెస్టు కావడం తమ కుటుంబానికి, పార్టీకి కష్టసమయమని, ప్రజలంతా అండగా ఉండాలని ఆమె కోరారు. చంద్రబాబు భద్రత గురించి తాను ఆలోచిస్తున్నానని చెప్పారు.

This post was last modified on September 13, 2023 9:18 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

పరకామణి దొంగను వెనకేసుకొచ్చిన జగన్!

చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…

2 hours ago

‘కూటమి బలంగా ఉండాలంటే మినీ యుద్ధాలు చేయాల్సిందే’

2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…

3 hours ago

ప్రీమియర్లు క్యాన్సిల్… ఫ్యాన్స్ గుండెల్లో పిడుగు

ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…

3 hours ago

‘పరదాల్లో పవన్’ అన్న వైసీపీ ఇప్పుడేమంటుందో?

ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…

5 hours ago

చైతూ వివాహ వార్షికోత్సవం… దర్శకుడి పోస్టు వైరల్

ఏడాది కిందట అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ళల పెళ్లి జరిగింది. సన్నిహితుల మధ్య కొంచెం సింపుల్‌‌గా పెళ్లి చేసుకుంది ఈ…

5 hours ago

కోహ్లీ… 2,462 రోజుల సెంటిమెంట్ బ్రేక్

విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టాడంటే టీమిండియా గెలిచినట్టే అని ఒక నమ్మకం ఉంది. కానీ రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో…

5 hours ago