టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు హౌస్ రిమాండ్ పిటిషన్ ను ఏసీబీ కోర్టు తిరస్కరిస్తూ సంచలన తీర్పు వెలువరించింది. రెండు రోజలు ఉత్కంఠకు తెరదించుతూ సీఐడీ తరఫు న్యాయవాదుల వాదనతో ఏకీభవించిన కోర్టు చంద్రబాబు హౌస్ రిమాండ్ పిటిషన్ ను తోసిపుచ్చింది. అంతకుముందు వాదనల సందర్భంగా జైలులో చంద్రబాబుకు తగిన భద్రత లేదని లూథ్రా వాదనలు వినిపించిన సంగతి తెలిసిందే. చంద్రబాబు వీవీఐపీ అని, ఆయనకు ఎన్ఎస్ జీ కమాండోల భద్రత ఉందని, జైలులో అది సాధ్యం కాదని లూథ్రా వాదించారు.
అయితే, ఇంటి వద్ద కన్నా జైలు దగ్గరే చాలా కట్టుదిట్టమైన భద్రత ఉందని ఏఏజీ సుధాకర్ వాదనలు వినిపించారు. దీంతో, సీఐడీ, ఏసీబీ తరఫు వాదనలతో ఏకీభవించిన కోర్టు…చంద్రబాబు హౌస్ రిమాండ్ పిటిషన్ ను తిరస్కరించింది. దీంతో, ఏసీబీ కోర్టులో చంద్రబాబుకు చుక్కెదురైనట్లయింది. మరోవైపు, చంద్రబాబును 5 రోజుల పాటు కస్టడీకి కోరుతూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణను ఏసీబీ కోర్టు రేపటికి వాయిదా వేసింది.
చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో జ్యుడీషియల్ రిమాండ్ పై ఉన్న సంగతి తెలిసిందే. అయితే, చంద్రబాబు హోదా, వయసు, ఆరోగ్యం, భద్రతా కారణాల రీత్యా ఆయనకు హౌస్ రిమాండ్ కల్పించాలంటూ విజయవాడ ఏసీబీ కోర్టులో చంద్రబాబు తరఫు లాయర్ సిద్ధార్థ్ లూథ్రా పిటిషన్ దాఖలు చేశారు. నిన్న ఆ పిటిషన్ పై ప్రభుత్వ తరఫు న్యాయవాది, ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి, లూథ్రాలు వాదనలు వినిపించారు. ఇరు పక్షాల వాదనలు విన్న ఏసీబీ కోర్టు తీర్పును ఈ రోజుకు వాయిదా వేసింది.
This post was last modified on September 12, 2023 8:18 pm
సోషల్ మీడియా రాను రాను మరీ సెన్సిటివ్ గా, టాక్సిక్ గా మారిపోతోంది. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ…
రాయ్ పూర్ లోని ఇందిరా గాంధీ కృషి విశ్వవిద్యాలయం బీఎస్సీ ద్వితీయ సంవత్సరం పరీక్షా పేపర్ లీకేజి వ్యవహారం ఇప్పుడు…
పార్టీలు బలంగా ఉండాలంటే.. సమాజంలోని పలు వర్గాల మద్దతు అవసరం. నాయకులు, అధినేతలు ఎంత బలంగా ఉన్నా.. సమాజంలోని వర్గాలు…
కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే కూటమిని బలోపేతం చేసేందుకు.. రాబోయే రోజుల్లో మరింత ఐక్యంగా ముందుకు సాగేలా వ్యూహాత్మక అడుగులు…
తెలుగు సినీ అభిమానుల్లో ఎన్నెన్ని వర్గాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందులో ఒక వర్గానికి ఇంకో వర్గానికి అస్సలు…
ఒకప్పుడు హిందీ సినిమాలు తెలుగులోకి అనువాదం కావడం, ఇక్కడ పెద్ద స్థాయిలో రిలీజ్ కావడమే ఉండేది తప్ప.. తెలుగు చిత్రాలు…