టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు హౌస్ రిమాండ్ పిటిషన్ ను ఏసీబీ కోర్టు తిరస్కరిస్తూ సంచలన తీర్పు వెలువరించింది. రెండు రోజలు ఉత్కంఠకు తెరదించుతూ సీఐడీ తరఫు న్యాయవాదుల వాదనతో ఏకీభవించిన కోర్టు చంద్రబాబు హౌస్ రిమాండ్ పిటిషన్ ను తోసిపుచ్చింది. అంతకుముందు వాదనల సందర్భంగా జైలులో చంద్రబాబుకు తగిన భద్రత లేదని లూథ్రా వాదనలు వినిపించిన సంగతి తెలిసిందే. చంద్రబాబు వీవీఐపీ అని, ఆయనకు ఎన్ఎస్ జీ కమాండోల భద్రత ఉందని, జైలులో అది సాధ్యం కాదని లూథ్రా వాదించారు.
అయితే, ఇంటి వద్ద కన్నా జైలు దగ్గరే చాలా కట్టుదిట్టమైన భద్రత ఉందని ఏఏజీ సుధాకర్ వాదనలు వినిపించారు. దీంతో, సీఐడీ, ఏసీబీ తరఫు వాదనలతో ఏకీభవించిన కోర్టు…చంద్రబాబు హౌస్ రిమాండ్ పిటిషన్ ను తిరస్కరించింది. దీంతో, ఏసీబీ కోర్టులో చంద్రబాబుకు చుక్కెదురైనట్లయింది. మరోవైపు, చంద్రబాబును 5 రోజుల పాటు కస్టడీకి కోరుతూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణను ఏసీబీ కోర్టు రేపటికి వాయిదా వేసింది.
చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో జ్యుడీషియల్ రిమాండ్ పై ఉన్న సంగతి తెలిసిందే. అయితే, చంద్రబాబు హోదా, వయసు, ఆరోగ్యం, భద్రతా కారణాల రీత్యా ఆయనకు హౌస్ రిమాండ్ కల్పించాలంటూ విజయవాడ ఏసీబీ కోర్టులో చంద్రబాబు తరఫు లాయర్ సిద్ధార్థ్ లూథ్రా పిటిషన్ దాఖలు చేశారు. నిన్న ఆ పిటిషన్ పై ప్రభుత్వ తరఫు న్యాయవాది, ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి, లూథ్రాలు వాదనలు వినిపించారు. ఇరు పక్షాల వాదనలు విన్న ఏసీబీ కోర్టు తీర్పును ఈ రోజుకు వాయిదా వేసింది.
This post was last modified on September 12, 2023 8:18 pm
ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జరిగిన ఒక పరిణామానికి సంబంధించి ఓ వీడియో సోషల్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…
వైసీపీ అధినేత జగన్పై ఆయన సోదరి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి నిప్పులు చెరిగారు. 'అన్న'…
దేశంలో విమానయాన సంస్థల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఉన్న…
ఏపీలో మరో కీలక పథకం ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. 'దివ్యాంగ శక్తి' పేరుతో కీలక పథకాన్ని సీఎం చంద్రబాబు, ఉప…
మంత్రి నారా లోకేష్.. మంగళవారం ఉమ్మడి కృష్ణాజిల్లాలోని ఓ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ విషయాన్ని అత్యంత గోప్యంగా…