Political News

సమీకరణలు మారిపోతున్నాయా?

రాబోయే ఎన్నికలకు సంబంధించి పొత్తు సమీకరణలు మారబోతున్నాయా ? తాజా పరిణామాలను గమనిస్తే అలాంటి అనుమానమే పెరిగిపోతోంది. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ స్కామ్ లో చంద్రబాబునాయుడు అరెస్టయిన విషయం తెలిసిందే. అరెస్టయిన చంద్రబాబును ఏసీబీ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండుకు తరలించింది. ఈ నేపధ్యంలో టీడీపీ రాష్ట్రబంద్ కు పిలుపిచ్చింది. ఈ బంద్ లో టీడీపీతో జనసేన, వామపక్షాలు చేతులు కలిపాయి. బీజేపీ మాత్రం దూరంగా ఉంది.

ఈ నేపధ్యంలో టీడీపీ వర్గాల్లో కొత్త అనుమానాలు మొదలైనట్లు సమాచారం. చంద్రబాబు అరెస్టు జగన్మోహన్ రెడ్డి, బీజేపీ అగ్రనేతల సంప్రదింపుల తర్వాతే జరిగిందా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఇదే అనుమానం మామూలు జనాల్లో కూడా పెరిగిపోతోంది. చంద్రబాబును అరెస్టుచేయమని నరేంద్రమోడీ లేదా అమిత్ షా గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవచ్చు. కానీ చంద్రబాబును అరెస్టుచేయాలన్న జగన్ ఆలోచనను మోడి, అమిత్ షా పరోక్షంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.

దీంతో చంద్రబాబు అరెస్టన్నది జగన్, బీజేపీ పెద్దల వ్యూహం ప్రకారమే జరిగిందని అనుమానిస్తున్నారు. అందుకనే రాబోయే ఎన్నికల్లో బీజేపీని వదిలేస్తే ఎలాగుంటుందనే ఆలోచన టీడీపీలో మొదలైందట. బంద్ సందర్భంగా టీడీపీతో చేతులు కలిపిన జనసేన, వామపక్షాలతోనే ఎన్నికలను ఎదుర్కోవాలనే వాదనకు పార్టీలో మద్దతు పెరుగుతోందని సమాచారం. బీజేపీతో పొత్తు విషయంలో ఎదురుచూడటం అనవసరమైన సమయం వేస్టని అనుకుంటున్నారు. ఎలాగూ బీజేపీకి రాష్ట్రంలో ఉన్న ఓటింగ్ సున్నా అన్న విషయం అందరికీ తెలిసిందే.

ఓటింగ్ పరంగా ఏదో కలిసివస్తుందని చంద్రబాబు బీజేపీతో పొత్తుకు ప్రయత్నించటంలేదు. ఎన్నికల సమయంలో జగన్ను నియంత్రించటమే టార్గెట్ గా చంద్రబాబు ఆలోచిస్తున్నారు. అందుకనే బీజేపీ పొత్తుకు ప్రయత్నిస్తున్నారు. అయితే తాజా పరిణామాలతో అది అసాధ్యమని అర్ధమైపోయినట్లుంది. అందుకనే టీడీపీతో కలిసొచ్చే పార్టీలతోనే పొత్తు పెట్టుకుని ఎన్నికలను పటిష్టంగా ఎదుర్కోవాలనే డిమాండ్ పార్టీ సీనియర్లలో పెరిగిపోతోంది. చంద్రబాబు అరెస్టన్నది బీజేపీ పెద్దలకు తెలీకుండా జరగదని అర్ధమైపోయిన తర్వాత ఇంకా కమలంపార్టీతో పొత్తుకు పర్యత్నించటంలో అర్ధంలేదని మెజారిటి తమ్ముళ్ళు అభిప్రాయపడుతున్నారు. మరి చివరకు ఏమి నిర్ణయం తీసుకుంటారో చూడాల్సిందే.

This post was last modified on September 12, 2023 2:55 pm

Share
Show comments

Recent Posts

చంద్రబాబుపై అంబటి బూతుపురాణం… ఏం జరిగింది?

వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన సీబీఐ తాజాగా సుప్రీం…

2 minutes ago

చిట్టి ఇలా రెచ్చిపోయిందేంటి…

ఫరియా అబ్దుల్లా అంటే మనందరికీ 'జాతిరత్నాలు' సినిమాలోని చిట్టినే గుర్తొస్తుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ…

46 minutes ago

దురంధర్‌ను చెడగొట్టిన నెట్‌ఫ్లిక్స్

దురంధర్.. గత ఏడాది డిసెంబర్లో విడుదలై.. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమా. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే…

1 hour ago

పసిడి పతనం: 48 గంటల్లో రూ. 1.8 లక్షల సంపద ఆవిరి

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ పతనం శనివారం…

2 hours ago

11న అసెంబ్లీ… ఆ 11 మంది వస్తారా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…

2 hours ago

తిరుమల లడ్డు వ్యవహారం… టీటీడీ ఈవో బదిలీ?

తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…

3 hours ago