Political News

జగన్ కు లోకేష్ మాస్ వార్నింగ్..బీ రెడీ!

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టు, రిమాండ్ నకు నిరసనగా టీడీపీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ నకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఆ బంద్ కు బీజేపీ మినహా జనసేన, సిపిఐ, సిపిఎం సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. ఈ క్రమంలోనే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జనసేనతో పాటు బంద్ కు మద్దతు ఇచ్చిన మిగతా పార్టీలకు కూడా కృతజ్ఞతలు తెలిపారు. చంద్రబాబు అరెస్ట్ తర్వాత తొలిసారిగా మీడియా ముందుకు వచ్చిన లోకేష్… చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

పాముకు తలలోనే విషం ఉంటుందని, కానీ జగన్ కు ఒళ్లంతా విషమే అని లోకేష్ షాకింగ్ కామెంట్స్ చేశారు. చంద్రబాబును అరెస్ట్ చేయించి జగన్ చాలా పెద్ద తప్పు చేశారని, భవిష్యత్తులో రాజకీయంగా భారీ మూల్యం చెల్లించక తప్పదని వార్నింగ్ ఇచ్చారు. జగన్ చరిత్ర ఏంటో, ఆయనపై ఎన్ని కేసులు ఉన్నాయో అందరికీ తెలుసు అని బహిరంగంగా ప్రజల ముందుకు వచ్చి ఆ వివరాలను చెప్పే ధైర్యం జగన్ కు ఉందా అని లోకేష్ ప్రశ్నించారు. జగన్ పై మొత్తం 38 కేసులు ఉన్నాయని, పదేళ్లుగా వాటికి సంబంధించి ట్రయల్ కూడా జరగడం లేదని లోకేష్ ఆరోపించారు.

వ్యవస్థలను జగన్ ఏ స్థాయిలో మేనేజ్ చేస్తున్నారో దీన్ని బట్టి అర్థమవుతోందని లోకేష్ విమర్శలు గుప్పించారు. హెరిటేజ్ కంపెనీకి డబ్బులు వచ్చాయని ఆరోపిస్తున్నారని, కానీ ఏ రకంగా వచ్చిందో చెప్పలేకపోయారని అన్నారు. 2021లో ఎఫ్ఐఆర్ నమోదు చేసి 37వ పేరుగా చంద్రబాబును పెట్టి అరెస్ట్ చేశారని, కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఇలా చేశారని ఆరోపించారు. పింక్ డైమండ్, వివేకా హత్య కేసు, కోడి కత్తి కేసుల్లో ఎంత అబద్ధం ఉందో ఈ కేసులో అంతే అబద్ధం ఉందని లోకేష్ అన్నారు. చంద్రబాబుకు అవినీతి మరక వేసేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు సీబీఐ అధికారులు వస్తే కర్నూలులో వైసీపీ నేతలు అడ్డంగా వాహనాలను నిలిపింది ఎవరినీ ప్రశ్నించారు. ఇది ఒక ఫేక్ కేసు అని, చంద్రబాబుకు డబ్బులు ముట్టినట్టు షెల్ కంపెనీలు ఏర్పాటు చేసి డబ్బులు తీసుకున్నట్టు రిమాండ్ రిపోర్ట్ లో చూపించలేకపోయిందని ఆరోపించారు. రాష్ట్రంలో కక్ష సాధింపు డిపార్ట్మెంట్ గా సిఐడి మారిపోయిందని లోకేష్ నిప్పులు చెరిగారు. ఇక, జగన్… చంద్రబాబుపై కేసులు పెట్టించి సైకోలా సంతోషపడుతుంటే రోజా వంటి మంత్రులు సంబరాలు చేసుకుంటున్నారని, దీన్ని బట్టి చంద్రబాబుపై వారు ఏ రకంగా కక్ష్య సాధిస్తున్నారో అర్థం అవుతోందని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

This post was last modified on September 12, 2023 6:19 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

మలయాళంలో రేవంత్ సినిమా ఎలా నడుస్తోంది?

అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…

47 minutes ago

ఆ సీక్వెల్… నా వల్ల కాదు బాబోయ్

అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…

3 hours ago

నాడూ మూడే!… నేడూ మూడే!

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…

6 hours ago

మోడీ ముందు జ‌గ‌న్ మ‌రింత‌ ప‌లుచ‌న‌!

ప్ర‌స్తుతం ఎవ‌రు ఔన‌న్నా.. కాద‌న్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజ‌కీయాల‌కు కూడా ప్ర‌ధాని మోడీ పెద్ద‌దిక్కుగా మారారన్నది వాస్త‌వం. ఆయ‌న‌ను…

7 hours ago

రాముడి పాత్ర వద్దన్న రణబీర్

ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్‌లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…

8 hours ago

దళిత క్రైస్తవుల విషయంలో జగన్ కన్నా షర్మిలే బెటర్?

వైసీపీ అధినేత, తన బ్రదర్ జగన్‌పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్…

8 hours ago