ఏపీలోని వైసీపీ మంత్రివర్గంలో కొందరు వివాదాస్పద మంత్రులు ఉన్నారని ప్రతిపక్ష నాయకులు తరచుగా విమర్శలు గుప్పిస్తూ ఉంటారు. అయితే.. మరికొందరు మాత్రం వివాదాలకు దూరంగా ఉంటారు. ఇలాంటి వారిలో మంత్రి ఆదిమూలపు సురేశ్ ఒకరు. ఈయనపై పెద్దగా వివాదాలేమీ లేవు. పైగా ఉన్నత విద్యావంతుడు, మాజీ సివిల్ సర్వెంట్ కూడా. అయితే.. అనూహ్యంగా ఆదిమూలపు చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా మంటలు పుట్టిస్తున్నాయి. అంతేకాదు.. మంత్రి దిష్టిబొమ్మను దహనం చేసేవరకు విషయం వెల్లడం గమనార్హం.
ఏం జరిగిందంటే..
గురుపూజా దినోత్సవం నాడు… పలువురు టీచర్లను సన్మానించిన మంత్రి.. అనంతరం మాట్లాడుతూ… “గురువుల కన్నా గూగుల్ మిన్న” అని వ్యాఖ్యానించారు. గురువులకు తెలియని విషయాలు కూడా నేడు గూగుల్ చెబుతోందని ఆయన చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలే రాజకీయంగా మంత్రిని ఏకాకిని చేశాయి. టీడీపీ సహా ఇతర పక్షాల నుంచి కూడా మంత్రిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
తాజాగా టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు మంత్రి ఆదిమూలపు వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. “గూగుల్ మిన్న… గురువులు సున్నా… ఇదేమి సన్మానం మంత్రి గారు. గురుపూజోత్సవం రోజున గురువును పూచికపుల్లతో సమానంగా తీసి పడేశారు. ఈ ప్రపంచంలో ఉపాధ్యాయునికి ఏది ప్రత్యామ్నాయం కాదన్న సంగతి తెలుసుకోండి. గూగుల్కు కంటెంట్ను అందించేది కూడా ఒక గురువు అనే సంగతి గమనించండి” అని వ్యాఖ్యానించారు.
అదేవిధంగా పలువురు టీడీపీ నాయకులు కూడా మంత్రి ఆదిమూలపు వైఖరిపై విమర్శలు గుప్పించారు. టీచర్లకు క్షమాపణలు చెప్పాలని వారంతా డిమాండ్ చేయడం గమనార్హం. ఇదిలావుంటే.. మంత్రిపై ప్రతిపక్ష నాయకులు ఈ రేంజ్లో దాడి చేస్తున్నా… తొటి వైసీపీ నాయకులు కానీ, ఇతర మంత్రులు కానీ స్పందించకపోవడం గమనార్హం.
This post was last modified on September 6, 2023 9:05 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…