ఏపీలోని వైసీపీ మంత్రివర్గంలో కొందరు వివాదాస్పద మంత్రులు ఉన్నారని ప్రతిపక్ష నాయకులు తరచుగా విమర్శలు గుప్పిస్తూ ఉంటారు. అయితే.. మరికొందరు మాత్రం వివాదాలకు దూరంగా ఉంటారు. ఇలాంటి వారిలో మంత్రి ఆదిమూలపు సురేశ్ ఒకరు. ఈయనపై పెద్దగా వివాదాలేమీ లేవు. పైగా ఉన్నత విద్యావంతుడు, మాజీ సివిల్ సర్వెంట్ కూడా. అయితే.. అనూహ్యంగా ఆదిమూలపు చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా మంటలు పుట్టిస్తున్నాయి. అంతేకాదు.. మంత్రి దిష్టిబొమ్మను దహనం చేసేవరకు విషయం వెల్లడం గమనార్హం.
ఏం జరిగిందంటే..
గురుపూజా దినోత్సవం నాడు… పలువురు టీచర్లను సన్మానించిన మంత్రి.. అనంతరం మాట్లాడుతూ… “గురువుల కన్నా గూగుల్ మిన్న” అని వ్యాఖ్యానించారు. గురువులకు తెలియని విషయాలు కూడా నేడు గూగుల్ చెబుతోందని ఆయన చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలే రాజకీయంగా మంత్రిని ఏకాకిని చేశాయి. టీడీపీ సహా ఇతర పక్షాల నుంచి కూడా మంత్రిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
తాజాగా టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు మంత్రి ఆదిమూలపు వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. “గూగుల్ మిన్న… గురువులు సున్నా… ఇదేమి సన్మానం మంత్రి గారు. గురుపూజోత్సవం రోజున గురువును పూచికపుల్లతో సమానంగా తీసి పడేశారు. ఈ ప్రపంచంలో ఉపాధ్యాయునికి ఏది ప్రత్యామ్నాయం కాదన్న సంగతి తెలుసుకోండి. గూగుల్కు కంటెంట్ను అందించేది కూడా ఒక గురువు అనే సంగతి గమనించండి” అని వ్యాఖ్యానించారు.
అదేవిధంగా పలువురు టీడీపీ నాయకులు కూడా మంత్రి ఆదిమూలపు వైఖరిపై విమర్శలు గుప్పించారు. టీచర్లకు క్షమాపణలు చెప్పాలని వారంతా డిమాండ్ చేయడం గమనార్హం. ఇదిలావుంటే.. మంత్రిపై ప్రతిపక్ష నాయకులు ఈ రేంజ్లో దాడి చేస్తున్నా… తొటి వైసీపీ నాయకులు కానీ, ఇతర మంత్రులు కానీ స్పందించకపోవడం గమనార్హం.
This post was last modified on September 6, 2023 9:05 pm
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…
ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…
వైసీపీ అధినేత, తన బ్రదర్ జగన్పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్…
ఒక్కడు, చూడాలని ఉంది లాంటి అద్భుతమైన బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు గుణశేఖర్ కొత్త మూవీ యుఫొరియా ఫిబ్రవరిలో విడుదలైన…