ఏపీలోని వైసీపీ మంత్రివర్గంలో కొందరు వివాదాస్పద మంత్రులు ఉన్నారని ప్రతిపక్ష నాయకులు తరచుగా విమర్శలు గుప్పిస్తూ ఉంటారు. అయితే.. మరికొందరు మాత్రం వివాదాలకు దూరంగా ఉంటారు. ఇలాంటి వారిలో మంత్రి ఆదిమూలపు సురేశ్ ఒకరు. ఈయనపై పెద్దగా వివాదాలేమీ లేవు. పైగా ఉన్నత విద్యావంతుడు, మాజీ సివిల్ సర్వెంట్ కూడా. అయితే.. అనూహ్యంగా ఆదిమూలపు చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా మంటలు పుట్టిస్తున్నాయి. అంతేకాదు.. మంత్రి దిష్టిబొమ్మను దహనం చేసేవరకు విషయం వెల్లడం గమనార్హం.
ఏం జరిగిందంటే..
గురుపూజా దినోత్సవం నాడు… పలువురు టీచర్లను సన్మానించిన మంత్రి.. అనంతరం మాట్లాడుతూ… “గురువుల కన్నా గూగుల్ మిన్న” అని వ్యాఖ్యానించారు. గురువులకు తెలియని విషయాలు కూడా నేడు గూగుల్ చెబుతోందని ఆయన చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలే రాజకీయంగా మంత్రిని ఏకాకిని చేశాయి. టీడీపీ సహా ఇతర పక్షాల నుంచి కూడా మంత్రిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
తాజాగా టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు మంత్రి ఆదిమూలపు వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. “గూగుల్ మిన్న… గురువులు సున్నా… ఇదేమి సన్మానం మంత్రి గారు. గురుపూజోత్సవం రోజున గురువును పూచికపుల్లతో సమానంగా తీసి పడేశారు. ఈ ప్రపంచంలో ఉపాధ్యాయునికి ఏది ప్రత్యామ్నాయం కాదన్న సంగతి తెలుసుకోండి. గూగుల్కు కంటెంట్ను అందించేది కూడా ఒక గురువు అనే సంగతి గమనించండి” అని వ్యాఖ్యానించారు.
అదేవిధంగా పలువురు టీడీపీ నాయకులు కూడా మంత్రి ఆదిమూలపు వైఖరిపై విమర్శలు గుప్పించారు. టీచర్లకు క్షమాపణలు చెప్పాలని వారంతా డిమాండ్ చేయడం గమనార్హం. ఇదిలావుంటే.. మంత్రిపై ప్రతిపక్ష నాయకులు ఈ రేంజ్లో దాడి చేస్తున్నా… తొటి వైసీపీ నాయకులు కానీ, ఇతర మంత్రులు కానీ స్పందించకపోవడం గమనార్హం.
This post was last modified on September 6, 2023 9:05 pm
స్కూల్లో పాఠాలు నేర్చుకోవాల్సిన, పరీక్షలు రాయాల్సిన వయసులో ఐపీఎల్లో వైభవ్ సూర్యవంశీ అనే కుర్రాడు ఎలా చెలరేగిపోతున్నాడో చూస్తున్నాం. సినీ…
టాలీవుడ్ బాక్సాఫీస్ కు ఏప్రిల్ అంటే చాలా స్పెషల్. ఎందుకంటే చరిత్రలో చెప్పుకోదగిన ఎన్నో బ్లాక్ బస్టర్లు ఈ నెలలోనే…
కొన్ని కథలు ముగిసిపోవడాన్ని ప్రేక్షకులు అంతగా ఇష్టపడరు. వాటికి కొనసాగింపు ఉంటేనే బాగుంటుందని ఆశిస్తారు. వాటి మేకర్స్ కూడా ఆ…
దేవర పార్ట్ 2 ఉంటుందో లేదోననే అనుమానాలు ఇంకా కొనసాగుతుండగానే దర్శకుడు కొరటాల శివ బాలకృష్ణతో ఒక ప్రాజెక్టు లాక్…
తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్లో వన్ మ్యాన్ `ఆర్మీ`గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనిపిస్తున్నారు. గత ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి…
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఒకప్పుడు దూకుడుగా ఉన్న వైసీపీ ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. కీలక నాయకులు ఉన్నప్పటికీ..…