ప్రపంచ స్థాయిలో మన దేశం గురించి ఎవరైనా మాట్లాడాల్సి వచ్చినా.. అధికారిక సమాచారం పంచుకోవాల్సి వచ్చినా.. ఇప్పటి వరకు ‘ఇండియా’ అనే సంబోధించేవారు. ఉదాహరణకు ‘ప్రైమినిస్టర్ ఆఫ్ ఇండియా’ అని, ‘ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా’ అనే ఇప్పటి వరకు సంబోధించడం మనకు తెలుసు. ఇదే సంప్రదాయంగా కూడా వస్తోంది. అయితే, ఇటీవల కాలంలో అన్నింటికీ ‘భారతీయత’ను జోడిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ సర్కారు … ఇప్పుడు ఇండియా పేరును కూడా ప్రపంచ స్థాయిలో మార్చేసింది!
ఔను. ఇది నిజ్జంగానే నిజం. ప్రస్తుతం మన దేశం జీ-20 దేశాల సదస్సులకు ఆతిథ్యం ఇస్తోంది. ఈ క్రమంలో ఆయా జీ-20 దేశాల ప్రతినిధులకు ఈ నెల 9వ తేదీన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రత్యేక విందును ఏర్పాటు చేశారు. అయితే.. దీనికి సంబంధించి రాష్ట్రపతి భవన్ పంపించిన ఆహ్వాన పత్రికలపై ఇండియా బదులు ‘భారత్’ అని పేర్కొనడం సంచలనంగా మారింది. గతంలోనే కాదు.. నిన్న మొన్నటి వరకు కూడా ఇలా ఎవరూ అధికారిక పత్రాలపైనా.. ఆహ్వాన పత్రికలపైనా ఇండియా స్థానంలో భారత్ అని పేర్కొనలేదు.
కానీ, తాజాగా రాష్ట్రపతి భవన్ మన దేశం పేరును ‘భారత్’ అని పేర్కొనడం వివాదానికి దారి తీసింది. ఈ నెల 9న రాష్ట్రపతి భవన్లో విందు ఇస్తున్నారని, ఈ విందుకు హాజరుకావాలని కోరుతూ జీ-20 దేశాల అతిథులకు పంపిన ఆహ్వాన పత్రికల్లో మన దేశం పేరును ఇండియా అని కాకుండా భారత్ అని పేర్కొనడంపై అన్ని వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సాధారణంగా ‘ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా’ అని పేర్కొంటారని, ఈ ఆహ్వాన పత్రికల్లో ‘ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’ అని రాయడం వివాదానికి దారి తీసింది. దీనిపై ఇప్పటికే కాంగ్రెస్ నిప్పులు చెరుగుతుండగా.. దీనికి మరిన్ని పార్టీలు మద్దతు పలికాయి.
This post was last modified on September 5, 2023 1:37 pm
మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో…
పెళ్లి అనేది జీవితంలో ఒక్కసారే వచ్చే ఘట్టం. దాన్ని ఘనంగా చేసుకోవాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. ప్రతి కుటుంబంలోనూ పెళ్లిని…
టాలీవుడ్ కు సంబంధించి హైదరాబాద్ ఇవాళ రెండు కీలక ఘట్టాలకు సాక్ష్యంగా నిలబడుతోంది. నెట్ ఫ్లిక్స్ కార్యాలయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి…
మార్చి 19 విడుదల కాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి 'మెడ ముట్టుకుంటే తొడ కొట్టినట్టే' పాట వచ్చినప్పుడు పాజిటివిటీ…
అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో అటవీ శాఖ అధికారుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ…
రాజకీయాలంటే అంతే. అడుగుపెట్టాక చాలా బురదను కడుక్కోవాల్సి ఉంటుంది. కొందరు తట్టుకుంటారు. కొందరు వదిలేస్తారు. చిరంజీవి ప్రజారాజ్యం విషయంలో ఎక్కడైతే…