Modi
ప్రస్తుత పరిస్ధితిలో జమిలిఎన్నికల నిర్వహణ ఎంతమాత్రం సాధ్యంకాదు. ఈ విషయాన్ని కేంద్ర ఎన్నికల కమీషన్, కేంద్ర న్యాయశాఖ స్పష్టంగా గతంలోనే ప్రకటించాయి. జమిలి నిర్వహణపై కమీషన్ చాలా పార్టీలతో సమావేశం నిర్వహించింది. సాధ్యాసాధ్యాలపై పెద్ద కసరత్తే చేసింది. అంత జరిగిన తర్వాతే జమిలి ఎన్నికల నిర్వహణ సాధ్యంకాదని తేల్చేసింది. అలాంటిది సడెన్ గా నరేంద్రమోడీ ఇపుడు మళ్ళీ జమిలి ఎన్నికలని మొదలుపెట్టారు. నిర్వహణ సాధ్యాసాధ్యాలపై మాజీ రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ నాయకత్వంలో కమిటి కూడా వేసేశారు.
దేశమంతా ఏదో రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న కారణంగా అభివృద్ధి సాధ్యంకావటంలేదని మోడీ చెబుతున్నారు. అందుకనే జమిలి ఎన్నికలైతే ఎన్నికల ఖర్చులు కలిసొస్తుందని, సమయం కలసి వస్తుందని, అభివృద్ధిపై దృష్టి పెట్టవచ్చని చెబుతోంది. అయితే ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే. మరోవైపు ఏమిటంటే రేపు ఏదైనా రాష్ట్రంలో ప్రభుత్వం కూలిపోతే అప్పుడు ఏమిచేస్తుంది కేంద్ర ఎన్నికల కమీషన్. ఎన్నికలు నిర్వహించకుండా రాష్ట్రపతిపాలనతో నెట్టుకొచ్చేస్తుందా ?
నిజానికి ఒకపుడు దేశంలోజమిలి ఎన్నికలే జరిగాయి. తర్వాత వివిధ రాష్ట్రాల్లో జరిగిన పరిణామాలతో అర్ధాంతరంగా ఎన్నికలు నిర్వహించాల్సొచ్చింది. దాంతో జమిలి వ్యవస్ధ అస్ధవ్యస్ధమైపోయింది. ఈ విషయం మోడీకి కూడా బాగా తెలుసు. అయినా జమిలి జపం ఎందుకు చేస్తున్నారు ? ఎందుకంటే కేంద్రంలో బీజేపీ బలంగా ఉంది కానీ రాష్ట్రాల్లో లేదు. కేంద్రంతో పాటు రాష్ట్రాల్లో కూడా అధికారంలోకి రావటం బీజేపీ వల్ల కావటం లేదు.
పార్లమెంటుతో పాటు అసెంబ్లీల్లో కూడా బీజేపీ అధికారంలోకి రావాలంటే జమిలి ఎన్నికలు ఒకటే మార్గమని అనుకున్నట్లున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీకి ఓట్లేస్తున్న జనాలు అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి ఇతర పార్టీలకు వేస్తున్నారు. మోడీకి ఇది చాలా ఇబ్బందిగా తయారైంది. పార్లమెంటు, అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే జనాలు రెండు ఓట్లను బీజేపీకే వేస్తారని మోడీ అనుకుంటున్నారు. అందుకనే జమిలీ జపం ఎత్తుకున్నారు. దీనికి ఖర్చులు, సమయం, అభివృద్ధనే కలరింగ్ ఇస్తున్నారంతే. మరి మోడీ ఆలోచన ఎంతవరకు సాకారమవుతుందో చూడాల్సిందే.
This post was last modified on September 2, 2023 2:26 pm
బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో గత నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ అయి.. దీనిపై…
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…